NZB: కలెక్టరేట్లో ఈనెల రేపు ఉదయం 10.30 గంటలకు MP ధర్మపురి అరవింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం జరగనుందని DRDO సాయాగౌడ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులచే వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై దిశ సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. సంబంధిత శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.