• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గుండెపోటుతో హిందీ పండిత్ మృతి

SRD: సిర్గాపూర్ మండలం వాసర్ ZPHSలో విధులు నిర్వహిస్తున్న హిందీ పండిత్ వెంకట్ రామ్ గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం తుల్జాపూర్ భవాని మాత దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా హఠాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఖేడ్ పట్టణంలోని నెహ్రు నగర్ ఆయన స్వగృహంలో సోమవారం అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు.

May 5, 2025 / 07:55 AM IST

ట్రాక్టర్ లోంచి జారిపడ్డ బస్తాలు.. తప్పిన ప్రమాదం

KNR: శంకరపట్నం ప్రధాన రహదారిపై లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ వరి ధాన్యం బస్తాలు జారీ రోడ్డుపై పడ్డాయి. ఈ ఘటనలో వరి ధాన్యం బస్తాలు కింద పడడంతో ధాన్యం బస్తాలు చిరిగిపోయి వడ్లు రోడ్డు మీద పడ్డాయి. చెల్లాచెదురుగా పడిన వరి ధాన్యం బస్తాలతో ఎలాంటి ప్రమాదం జరగలేదని వాహనదారులు తెలిపారు. రోడ్డుపై ధాన్యం బస్తాలు పడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

May 4, 2025 / 05:26 PM IST

ఒక్క నిమిషం ఆలస్యం.. NEETకి నో ఎంట్రీ

HYD: OU సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ పరీక్షా కేంద్రంలో NEETకు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన ఇద్దరు యువతులను అధికారులు పరీక్షా హాల్లోకి అనుమతించలేదు. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన విద్యార్థినులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారు ఎంత విజ్ఞప్తి చేసినా అధికారులు నిబంధనలు ఉల్లంఘించలేమని స్పష్టం చేశారు.

May 4, 2025 / 05:17 PM IST

‘మే 19న జనగామ కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష’

జనగాం: వికలాంగుల హక్కుల సాధన సమితి సభ్యులు జనగామ పట్టణ కేంద్రంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గణేష్ హాజరై మాట్లాడుతూ.. వికలాంగుల హక్కులు, రిజర్వేషన్ల సాధన కోసం మే 19న జనగామ కలెక్టర్ కార్యాలయం వద్ద 48 గంటల పాటు నిరాహార దీక్ష చేయబోతున్నారు. దీని కోసం నేటి నుండి మే 15వ తేదీ వరకు లక్ష సంతకాల సేకరణ చేపడుతున్నామన్నారు.

May 4, 2025 / 04:41 PM IST

జిల్లా ప్రజలకు కలెక్టర్ ముఖ్య సూచన

జనగాం: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లా ప్రజలకు ముఖ్య సూచన చేశారు. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా వడదెబ్బ ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శరీరానికి తగినంత నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలన్నారు, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం, మధ్యాహ్న వేళలో బయటకు వెళ్లకుండా ఉండాలన్నారు.

May 4, 2025 / 03:36 PM IST

మోడల్ స్కూల్లో దరఖాస్తులు ఆహ్వానం

BHPL: చిట్యాల మోడల్ స్కూల్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మేకల రమేశ్ తెలిపారు. MPC, BIPC, CEC కోర్సుల్లో ప్రతి కోర్సుకు 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 5 నుంచి 20 వరకు telanganams.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

May 4, 2025 / 03:09 PM IST

‘ఆర్ఎంపీలు ప్రథమచికిత్స మాత్రమే చేయాలి’: DMHO

JGL: జిల్లాలోని ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని డీఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీలు ఎలాంటి ఇంజక్షన్లు, మందులు ఇవ్వకూడదు, రాయకూడదన్నారు. స్టెతస్కోప్ వినియోగించరాదని తెలిపారు. జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశామని, ఎవరైనా చికిత్స చేసినట్లు, మందులు విక్రయించినట్లు దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం అన్నారు.

May 4, 2025 / 03:02 PM IST

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత: MLA

ADB: నేరడిగొండ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో శ్రీ జగదాంబ దేవి సంతుసేవాలాల్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. గ్రామస్తులు సమిష్టిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు.

May 4, 2025 / 03:01 PM IST

భవనం పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్య

HYD: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి వివాహిత లక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి స్వస్థలం శ్రీకాకుళం అని స్థానికులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉండగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

May 4, 2025 / 03:00 PM IST

దేశాయిపేటలో శివలింగం, నంది విగ్రహాలు లభ్యం

KNR: చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామ చెరువు దగ్గర ఆదివారం శివలింగం, నంది విగ్రహాలు లభ్యమయ్యాయి. విషయం తెలిసిన గ్రామస్థులు విగ్రహాల దగ్గర కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. విగ్రహాలు లభ్యమైన చోటనే శివాలయం నిర్మించాలని కొందరు అంటుండగా, పూజారులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని మరి కొందరు అంటున్నారు.

May 4, 2025 / 02:26 PM IST

గోషామహల్ సమస్యలపై తలసానిని కలిసిన బీఆర్ఎస్ నేతలు

HYD: గోషామహల్ నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. సమావేశంలో కోళ్ల ప్రదీప్ రాజ్, జగపతి సాయి కుమార్, సాయిబాబా, శివ, ప్రతాప్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఎదురవుతున్న సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సందర్భంగా నేతలు చర్చించారు.

May 4, 2025 / 02:02 PM IST

రేపు విద్యుత్ కార్యాలయంలో ప్రజావాణి

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు NPDCL జిల్లా అధికారి శ్రావణ్ కుమార్ తెలిపారు. NPDCL పరిధిలోని సబ్ డివిజన్, సెక్షన్, ఈఆర్వో సర్కిల్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 1:00 వరకు అలాగే జిల్లా జిల్లాస్థాయిలో మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు వినతులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

May 4, 2025 / 01:53 PM IST

నల్లవల్లిలో కొనసాగుతున్న రిలే నిరసన దీక్షలు

సంగారెడ్డి: పటాన్‌చెరు నియోజకవర్గం నల్లవల్లి గ్రామంలో 88వ రోజు డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా రిలే నిరసన దీక్షలు కొనసాగించారు. గుమ్మడిదల మున్సిపాలిటీ నల్లవల్లి గ్రామ పరిధిలోని ప్యారా నగర్ గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్దంటూ గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. వద్దురా నాయన డంపింగ్ యార్డ్ వద్దు అంటూ నినాదాలు చేశారు. డంపింగ్ యార్డ్ రద్దు అయ్యేంతవరకు మా పోరాటం ఆగదన్నారు.

May 4, 2025 / 01:46 PM IST

మెట్రో రైలు ఛార్జీలు భారీగా పెంపు.!

HYD: మెట్రో రైలు ఛార్జీలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. మే రెండోవారం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీటి ద్వారా వార్షికంగా, అదనంగా రూ.150 కోట్ల వరకు రాబట్టుకునేలా సంస్థ కసరత్తు చేస్తోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెట్రోలో కనిష్ఠం రూ.10, గరిష్ఠం రూ.60 ఉండగా, గరిష్ఠం రూ.75 వరకు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

May 4, 2025 / 01:40 PM IST

PACS ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

MNCL: బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను మాజీ ZPTC కారుకూరి రాంచందర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు.

May 4, 2025 / 01:24 PM IST