కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలం పెద్ద తడ్గూర్లో హనుమాన్ మందిరం పునర్నిర్మాణం కోసం గురువారం సొసైటీ మాజీ ఛైర్మన్ కొండ గంగాధర్ రూ.1,11,111 విరాళం అందజేశారు. పురాతన ఆలయాన్ని అభివృద్ది చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు, హనుమాన్ స్వాములు, గ్రామస్థులు పాల్గొన్నారు