AP: అమరావతి చట్టబద్ధత బిల్లును ఆమోదించడంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర, అనిత హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అనకాపల్లి కలెక్టరేట్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బిల్లును పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదించడం శుభపరిణామమని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అలాగే, అమరావతి కేవలం రాజధాని కాదు.. తెలుగుజాతి గౌరవమని అనిత అన్నారు.