NDL: పాణ్యం మండలం కొత్తూరు గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తిరుపతి డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామకృష్ణ, అర్చకులు వారికి మర్యాదపూర్వక స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికి రూ.45,000, అన్నదానానికి రూ.25,000 విరాళం అందజేసినట్లు తెలిపారు.