E.G: ఐదు సంవత్సరాల పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న కడియం మండలం జేగురుపాడు గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని శనివారం ఘనంగా సత్కరించారు. పంచాయతీ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాసరావు ఆద్వర్యంలో సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్, ఉప సర్పంచ్ పాతూరి రాజేష్, వార్డు సభ్యులను, ఎంపీటీసీలు నాగిరెడ్డి సూర్య రామకృష్ణ, ఆకుల సుధాకర్లను ఘనంగా సత్కరించారు.