అన్నమయ్య: మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు పీలేరు, పుంగనూరు ప్రాంతాల్లో శనివారం ‘డ్రగ్ డిటెక్షన్’ కిట్లతో అనుమానితులపై తనిఖీలు నిర్వహించగా.. పరీక్షల్లో అందరికీ నెగిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాపై సమాచారం ఉంటే 112 లేదా ఈగల్ సెల్ 1972కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.