ప్రకాశం: ఒంగోలులో నూతనంగా నిర్మిస్తున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయ నిర్మాణ పనులను కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయ నిర్మాణ పురోగతిని పరిశీలించి, పనులు నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత నాయకులు, నిర్వాహకులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.