AP: జగన్ను రాజకీయంగా ఎదుర్కొవాలి కానీ మహానాయకుడు వైఎస్ఆర్ గురించి తప్పుగా మాట్లాడటం ఏంటని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు. అచ్చెన్నాయుడు కావాలనే జగన్పై బురదజల్లుతున్నాడని మండిపడ్డారు. అమరావతిపై వైసీపీని విమర్శించాలనుకుంటే రాజకీయంగా మాట్లాడాలని సూచించారు. ఎన్టీఆర్ అల్లుడు కాకపోతే చంద్రబాబు సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు.