KMR: పోచారం ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదల కొనసాగుతోంది. గురువారం యాసంగి పంటల కోసం 247 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఎటువంటి ఇన్ ఫ్లో లేదని, మరో 25 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోందని వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.725 టీఎంసీల నీరు నిల్వ ఉంది.