SRPT: మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలోని కౌసర్, మదీనా మస్జిద్ల వద్ద గురువారం రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ కరీం ముఖ్య అతిథులుగా హాజరై పేద ముస్లిం కుటుంబాలకు ఈ కిట్లను అందజేశారు. రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీక అని వారు పేర్కొన్నారు.