మేడ్చల్: ఫ్రీడం ఆయిల్ కంపెనీ ఎండీ ప్రదీప్ చౌదరిను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కలిసి వారిని శాలువాతో సన్మానించారు. గతంలో తనకు ఇచ్చిన మద్దతు, సీఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా బాలాజీ నగర్లో సుమారు 2.5 ఎకరాలలో ఫ్రీడం పార్కును అభివృద్ధి చేశారని గుర్తుచేశారు.
HYD: బన్సీలాల్ పేటకు చెందిన సిల్వరి పరమేష్ కుమార్తె వర్షిత ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ నేపథ్యంలో గురువారం వెస్ట్ మారేడ్పల్లిలోని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో వర్షితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో మున్ముందు మంచి విజయాలు సాధించాలని అభినందించారు.
GDWL: అలంపూర్ మండల పరిధిలోని ర్యాలంపాడు బ్రిడ్జి దిగువన తుంగభద్రా నదిలో గురువారం గుర్తుతెలియని శవం లభ్యమైనట్లు అలంపూర్ పోలీసులు తెలిపారు. ఎవరైనా మృతుడిని గుర్తించినట్లయితే అలంపూర్ పీఎస్ 8712670285 నంబర్కు కాల్ చేయాలన్నారు. మృతుడి వయస్సు దాదాపు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.
GDWL: జోగులాంబ ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలని NSUI జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాదులోని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్య కార్యదర్శి సోమరాజుకు వినతిపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాల నుంచి జోగులాంబ ఆలయం, పాగుంట ఆలయాలకు అధికారిగా పనిచేస్తూ అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపించాడు.
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో, పార్కింగ్ ప్రదేశాల్లో ఆలయంలోకి వచ్చి వెళ్లే దారులు, క్యూ లైన్లలో, కళ్యాణ కట్ట, ధర్మ గుండం, ఆలయ ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లను పోలీస్, ఆలయ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శివరాత్రి వేడుకను ఘనంగా నిర్వహించాలని సూచించాడు.
PDPL: సింగరేణి నర్సరీలలో పనిచేస్తున్న కార్మికులకు జీఓ ప్రకారం వేతనాలు, సీఎంపీఎఫ్, బోనస్, వైద్యం చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్- ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న, రాష్ట్ర నాయకులు నరేష్ సింగరేణి సీఎండీ బలరాంనాయక్ను కోరారు. గురువారం గోదావరిఖనిలో సీఎండీని కలిసి వినతిపత్రం అందజేశారు.
MNCL: వేమనపల్లి మండలంలోని నీల్వాయి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం పరిధి కాటేపల్లి అటవీ బీట్ పరిధిలో అక్రమంగా చెట్లు నరికిన మానేపల్లి రాజన్న, మానేపల్లి నరేష్ పై కేసు నమోదు చేసి చెన్నూరు కోర్టులో హాజరు పరిచినట్లు నీల్వాయి ఎఫ్ఆర్ఓ అప్పలకొండ తెలిపారు. అక్రమంగా చెట్లను నరికి భూమి చదును చేసినందుకు అటవీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
KNR: మానకొండూరు మండలం ఊటూరులోని ఇసుక రిచ్ పాయింట్ వద్ద రవాణా, రెవిన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు గురువారం తనిఖీలు చేశారు. రీచ్ రికార్డులను పరిశీలించారు. ఇసుక యార్డుకు వాహనాలు వెళ్లే దారిని పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. అనుమతి కంటే ఎక్కువ లోడును తరలిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
BDK: చండ్రుగొండలోని కేజీబీవీ బాలికల వసతి గృహంలో గురువారం విద్యార్థులపై ఎలుకలు దాడి చేసి గాయపరిచాయి. ఎంఈవో సత్యనారాయణ వివరాల ప్రకారం.. పడుకొని ఉన్న ఇద్దరు బాలికలపై ఎలుకలు దాడి చేసి స్వల్పంగా గాయపరిచాయని చెప్పారు. వసతి గృహాన్ని సందర్శించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
KMM: బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంతు సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గ స్థాయిలో ఈనెల 15వ తేదీన కూసుమంచి కేంద్రంలో నిర్వహించబోయే, జయంతి ఉత్సవాల కోసం గురువారం కూసుమంచి తహసీల్దార్ కరుణ ఉత్సవాల స్థలాన్ని స్థానిక బంజారాలతో కలిసి పరిశీలించారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
JGL: కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామశివారులో ఓ వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్టు గ్రామస్థులు గురువారం గుర్తించారు. మృతుడికి 30 ఏళ్ళు ఉంటాయన్నారు. బావి ఒడ్డు పై అంగీ, చెప్పులు ఉండగా.. మృతుడి ఒంటిపై పాయింట్ ఉంది. ఇది హత్యనా.. లేక ఆత్మహత్యనా తెలియాల్సి ఉందని గ్రామస్థులు పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
BDK: సింగరేణి ఇల్లందు ఏరియాలో SAP ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ పై గురువారం ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేట్ ERP విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏరియా జీఎం వి.కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్వరలోనే మాన్యువల్ ఫైల్ డిస్పాచ్ నుంచి ఆన్లైన్ విధానానికి మారుతామని అన్నారు. ఈ మార్పు సమయం, శ్రమను ఆదా చేస్తుందని తెలిపారు.
NLG: బర్డ్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు సరిహద్దు ప్రాంతాలలో తనిఖీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు ఎగుమతి అవుతున్న కోళ్ల వాహనాలను తెలంగాణ పోలీసులు, పశు వైద్య శాఖ అధికారులు గురువారం కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద వాహనాలు నిలిపి తనిఖీలు నిర్వహించారు.
NLG: చిట్యాల మండలం ఏపూరులో మహిళలు, గ్రామస్థులు మద్య అమ్మకాలు నిషేధించాలని ర్యాలీ చేసిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన ఓ యువకుడు మద్యం తాగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు, మహిళలు తెలిపారు. ఈ నేపథ్యంలో మద్యం విక్రయిస్తే రూ.లక్ష, తాగితే రూ.20వేలు జరిమానా విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
MDK: వేసవిలో విద్యుత్ సమస్యలుంటే 1912కు కాల్ చేయాలని చీఫ్ ఇంజినీర్ బాలస్వామి వినియోగదారులకు సూచించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బుధవారం సాయంత్రం మెదక్ విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ శంకర్తో కలిసి డిఈ,ఎడిఎ, ఏఈలతో సమీక్షించారు. మెదక్, బాలనగర్లో కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.