NRML: బైంసా మండల కేంద్రంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే రామారావు పటేల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నగేష్ మాట్లాడుతూ.. ప్రజలందరూ శాంతియుతంగా పండుగలు నిర్వహించుకోవడం గొప్ప విషయం అన్నారు. శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ADB: సోనాల మండల కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేయటం పట్ల వారిని ఎమ్మెల్యే అభినందించారు. చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
KMR: పిట్లం మండలంలోని తిమ్మానగర్ గ్రామానికి చెందిన విద్యార్థిని సాయిస్మరణ శ్రీరామ నవమినిపురస్కరించుకొని ఆకుపై సీతారాముడి చిత్రాలను చూడముచ్చటగా గీసింది. పిట్లంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సాయిస్మరణ గతంలో ట్యాబ్లెట్లపై, ఆకులపై అందమైన చిత్రాలు గీసింది. చదువుతోపాటు చిత్రకళారంగంలో విద్యార్థిని రాణించడంతో ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.
HYD: శ్రీ రామనవమి శోభాయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని HYD ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ వరకు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. ఈ మార్గంలో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ అమలులో ఉంటుంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకొని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
HYD: శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి తరలిస్తున్న సుమారు 300 కిలోల గంజాయిని సైబరాబాద్ SOT పోలీసులు పట్టుకుని, తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
SDPT: ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తెలిపారు. శనివారం జనగాం డిపోకు చెందిన బస్సులో ఎంఏ జావిద్, ఎస్కే షమీం సిద్దిపేటలో బస్సు ఎక్కి దుద్దెడ మసీదు వద్ద బస్సు ఆపమని అడిగారు. హైవేపై ఆపడం కుదరదని డ్రైవర్ బదులిచ్చాడు. దీంతో డ్రైవర్ నరసింహా రెడ్డిని దుర్భాషలాడుతూ దాడి చేశారు.
HYD: నగరం నేడు ‘జై శ్రీరామ్’ నినాదంతో హోరెత్తనుంది. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా నగరంలోని సీతారాంబాగ్ టెంపుల్, ఆకాశూరి హనుమాన్ టెంపుల్ నుంచి భారీ శోభయాత్రలకు సర్వం సిద్ధమైంది. హనుమాన్ టేక్తి వద్ద ఈ యాత్ర ముగుస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు.
MDK: శ్రీ రామనవమిని పురస్కరించుకొని ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాతకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం వేకువజామున ఆలయ అర్చకులు మంజీరా నదీజలాలతో అభిషేకం చేసి పట్టువస్త్రాలు, వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి, సహస్రనామార్చన, కుంకుమార్చన పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
NZB: పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తన సొంత మండలమైన భీంగల్లో ఆదివారం పర్యటించనున్నారు. పిప్రి గ్రామంలోని లొద్దిరామన్న ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే అంకురార్పణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు.
SRPT: రోడ్డు ప్రమాదంలో శనివారం పిల్లలమర్రి గ్రామానికి చెందిన దాసరి విజిత(23) మృతి చెందింది. సూర్యాపేట మండలం రాయినిగూడెం సమీపంలో 7 ఆర్ హోటల్లో పని చేస్తున్న విజిత విధులకు వెళ్తూ హోటల్ దగ్గర రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుండి సూర్యాపేట వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టగా అక్కడిక్కడే మృతి చెందింది.
MDK: తూప్రాన్ మండలం పడాలపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన భూపతిరెడ్డి పదవి విరమణ వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో రాధాకిషన్ పాల్గొన్నారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు సమయపాలన పాటించి విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చి దిద్దాలన్నారు.
MDK: స్వతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
SDPT: వేములవాడ రాజరాజేశ్వర సామిని శనివారం జిల్లా జడ్జి ఇండోమెంట్స్ అడిషనల్ కమిషనర్ కే.జ్యోతి దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు స్వస్తి వేదోక్త స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ వినోద్ లడ్డు ప్రసాదం అందజేశారు. వీరి వెంట ఏఈవోలు బ్రహ్మన్న గారి శ్రీనివాస్, జీ.అశోక్ కుమార్లు, పర్యవేక్షకులు ఉన్నారు.
ADB: చత్తీస్గడ్లో ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలో నాయకులతో సమావేశమై ఆయన మాట్లాడారు. ఆపరేషన్ కగార్ పేరిట వందలాది మందిని ఎన్ కౌంటర్ పేరిట హత్యలు చేస్తున్నారన్నారు. నిరసనగా ఈ నెల 8న హైదరాబాద్ ఇందిరా పార్కులో ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
RR: బాబు జగ్జీవన్ రామ్ లాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి ఊపిరి పోయాలి అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలో దళిత విభాగం నాయకులు జాంగారి రవి, అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై నివాళులర్పించారు.