WNP: ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. బుధవారం పెబ్బేరు, శ్రీరంగాపురం, కంచిరావుపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో ప్రత్యేక వసతులు కల్పించినట్లు తెలిపారు.