KMR: కలెక్టరేట్ సముదాయంలోని సమావేశం హాలులో నేడు ఎల్లారెడ్డి డివిజన్లోని వైద్యాధికారులతో జాతీయ, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాల పనితీరుపై డీఎంహెచ్వో డా.చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ముఖ్యంగా గర్భిణులు, మహిళల వైద్య సేవలపైన, టీబీ, NCD సేవలను మరింత విస్తృతం చేయడం పైన సమీక్ష ఉంటుందనీ డిప్యూటీ డీఎంహెచ్వో తెలిపారు
KMR: సదాశివ నగర్లోని మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5 నుంచి 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. MPC, BIPC, CEC, హెచ్ఈసీ గ్రూపులు ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదని, వివరాలకు కళాశాలను సంప్రదించాలని పేర్కొన్నారు.
MDK: మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్లో అడ్మిషన్లకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రేగోడ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రవీణ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. టెన్త్ పాసైన విద్యార్థులు ఈ నెల 5 నుంచి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరిట్ ప్రాతిపదికన ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రదర్శిస్తామని తెలిపారు.
HYD: టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ నూతన SHOగా బాధ్యతలు స్వీకరించిన బీ.అభిలాష్ ఈరోజు ఛార్జ్ తీసుకున్నారు. పీఎస్ పరిధిలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో అంతఃకరణ శుద్ధితో తన విధులు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా ఏ సమయంలోనైనా తన నంబర్కు కాల్ చేసి సమాచారం అందిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని ప్రజలను కోరారు.
NZB: జిల్లా రుద్రూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న సిద్దిరాం చిన్నయ్య (2135) కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో మరో కానిస్టేబుల్పై వేటు పడడం కలకలం రేపింది.
మేడ్చల్: కూకట్పల్లి PS పరిధిలోని దారువాల వైన్షాప్ పర్మిట్ రూమ్లో ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల ప్రకారం.. గత నెల 5న కేశవ్, ధనుష్ ఇద్దరు దారువాల వైన్స్ పరిమిట్ రూంలో మద్యం తాగుతుండగా గొడవ జరిగింది. ధనుశ్పైన కేశవ్ అతడి స్నేహితులు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. గాయాలపాలైన అతడు ఇవాళ మృతి చెందాడు.
KMR: జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరగడంతో వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని చల్లని ప్రదేశాల్లో ఉండాలన్నారు. బయటకు వెళ్తే టోపీ, తలపాగా వాడాలని సూచించారు. మజ్జిగ, గ్లూకోజ్ నీరు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు.
KMR: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన విజయవంతంగా చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే దేశవ్యాప్త కులగణన చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మదన్ మోహన్ రావు ఉన్నారు.
NZB: ప్రతి ఒక్కరూ ఆలోచించి లక్ష్యం వైపు అడుగులు వేయాలని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య విద్యార్థులకు సూచించారు. ఫ్రీ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. సెల్ ఫోన్ ఎంత దూరం ఉంచితే అంత మంచిదన్నారు. మనిషిని మనిషిగా గౌరవించాలని హితవు పలికారు.
NZB: మహిళా సహకార సంఘాలు సమిష్టి కృషితో అన్ని రంగాల్లో రాణిస్తున్నాయని డీపీఎం మారుతి అన్నారు. నూతనంగా ఎన్నికైన జనరల్ బాడీ సభ్యులు అంకితభావంతో నిబద్ధతతో అందరూ కలిసికట్టుగా పనిచేసే సహకార సంఘాల అభివృద్ధికి సహకరించాలని ఆయన పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలోని వడ్యాట్ గ్రామంలో మండల మహిళా సమైక్య 19వ సాధారణ సమావేశం శుక్రవారం నిర్వహించడం జరిగింది.
KMR: జిల్లా కేంద్రంలోని నర్సన్నపల్లి గ్రామంలో గత నెల 30న జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే చేదించారు. శుక్రవారం కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గత నెల 30న దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సన్నపల్లి గ్రామ శివారులో వ్యవసాయ క్షేత్రం వద్ద చిదుర కవిత(44) అనే మహిళను చీరతో ఉరి వేసి హత్య చేశాడు.
KMR:పెద్దమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. శుక్రవారం పాల్వంచ మండలంలోని వాడి గ్రామంలో వనదుర్గ పెద్దమ్మ కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొని అమ్మవారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ ముదిరాజ్ సంఘ సభ్యులు ఎమ్మెల్యేను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
WNP: వనపర్తి జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నేరస్తునికి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, 25 వేల జరిమానా విధించడంలో, జిల్లాలో వివిధ కేసులో నేరస్తులకు శిక్ష పడడంలో కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస చారీని వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ శాలువాతో సన్మానించి అభినందించారు.
WNP: జిల్లాలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మఇళ్ల నిర్మాణంలో త్వరగా గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలుచేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో శుక్రవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నిర్మాణం పనులు ప్రారంభించని లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి.. ఇంటి నిర్మాణంపై ఆసక్తిలేని లబ్ధిదారులను గుర్తించాలన్నారు.
RR: మైలార్దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని కాటేదాన్ శాంతినగర్ గవర్నమెంట్ స్కూల్ పదో తరగతిలో రంగారెడ్డి డిస్టిక్ టాపర్గా మార్కులు సాధించిన పాపిశెట్టి కార్తీక్ అనే విద్యార్థిని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంఛార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. మన డివిజన్ విద్యార్థి జిల్లా టాపర్ కావడం చాలా ఆనందదాయకమన్నారు.