• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రాజేంద్రనగర్‌ వెటర్నరీ కాలేజీలో కార్మికుడి మృతి

HYD: రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు వెటర్నరీ కాలేజీలో కార్మికుడిగా పనిచేస్తున్న యూసఫ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల ప్రకారం.. బుద్వేల్ బస్తీలో ఉంటున్న యూసఫ్ కొన్నేళ్లుగా వెటర్నరీ కాలేజీలో లేబర్‌గా పనిచేస్తున్నాడు. రోజులాగే విధులకు వచ్చిన అతడు కాలేజీ ఆవరణలో గేటుకు ఉరేసుకొని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

April 5, 2025 / 10:10 AM IST

GHMCలో తగ్గిన భవన నిర్మాణ అనుమతులు

HYD: GHMC పరిధిలో భవన నిర్మాణ అనుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. గత ఆర్థిక సంవత్సరంలో 13,641 భవన నిర్మాణాలకు అనుమతులివ్వగా, తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం(2024–25)లో అవి 13,421కి తగ్గాయి. అయినప్పటికీ ఆదాయం మాత్రం కొంత పెరిగింది. క్రితంసారి రూ.1107.29 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ.1138.44 కోట్ల ఆదాయం సమకూరింది. హై రైజ్ భవనాలు సైతం క్రితం కంటే తగ్గాయి.

April 5, 2025 / 10:06 AM IST

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌.. 10 రైళ్ల గమ్యస్థానాలు మార్పు

HYD: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునర్నిర్మాణ పనుల నేపథ్యంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు రాకపోకలు సాగించే సుమారు 10 రైళ్ల గమ్యస్థానాలను ఇతర స్టేషన్లకు మళ్లిస్తున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ క్రమంలో స్టేషన్‌కు వచ్చే రైళ్లను చర్లపల్లి, కాచిగూడకు తరలించనున్నారు.

April 5, 2025 / 09:02 AM IST

పాఠశాల వార్షికోత్సవంలో ఎమ్మెల్యే జియంఆర్

MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి, సమాజానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, పేదరికం నిర్మూలనకు చదువు ఒక ఆయుధమని అన్నారు.

April 5, 2025 / 07:58 AM IST

10 మందికి రూ.5,85,000 చెక్కులు

BDK: మెరుగైన వైద్యం పొందలేని పేదలకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా ఇస్తుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం సాయంత్రం బూర్గంపాడు మండలానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. పది మందికి గాను రూ.5,85,000 విలువ గల చెక్కులను అందజేశారు.

April 5, 2025 / 07:11 AM IST

‘సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించండి’

SRD: ప్రజలకు సైబర్ మోసాలు బెట్టింగ్ యాప్స్‌పై అవగాహన కల్పించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరగా పరిష్కరించాలని చెప్పారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. సివిల్ తగాదాలు తల దూర్చవద్దని సూచించారు.

April 4, 2025 / 08:10 PM IST

కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాని ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: జిల్లా కేంద్రంలోని రామ్ నగర్లోని LIC ఆఫీస్ పక్కన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే Dr. కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

April 4, 2025 / 06:26 PM IST

జేఎన్టీయూను తనిఖీ చేసిన ఉప కులపతి

SRD: చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ పరిధిలోని జేఎన్టీయూను ఉప కులపతి ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆర్డీవో పాండు చేతుల మీదుగా జయంతికి సంబంధించిన పత్రాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ప్రిన్సిపాల్ నరసింహ, ఫార్మసీ ప్రిన్సిపల్ సునీత రెడ్డి పాల్గొన్నారు.

April 4, 2025 / 06:14 PM IST

భూమి ఇవ్వలేదని కుల బహిష్కరణ

NLG: కట్టంగూర్ మండలం ఈదులూరు వాసి గద్దపాటి నరసింహను కుల సంఘానికి తన భూమి ఇవ్వలేదని 3 ఏళ్ల క్రితం కుల పెద్దలు కులం నుంచి బహిష్కరించారు. నరసింహ ఇంటికి ఎవరూ వెళ్లొద్దని, అతడు కూడా ఎవరింటికీ రావద్దని తీర్మానించారు. అప్పటి నుంచి నరసింహ మనస్తాపంతో ఉన్నాడు. ఇటీవల ఓ కార్యానికి నరసింహ రాగా కులపెద్దలు వెళ్లిపోమ్మన్నారు. శుక్రవారం బాధితుడు పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

April 4, 2025 / 05:53 PM IST

జోగిపేట మున్సిపాలిటీలో యువ వికాసం కేంద్రం ప్రారంభం

SRD: ఆందోలు జోగిపేట మున్సిపాలిటీలో రాజీవ్ యువ వికాసం సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తిరుపతి తెలిపారు. ఆందోలు జోగిపేట మున్సిపాలిటీలో యువ వికాసం సహాయ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు.

April 4, 2025 / 05:27 PM IST

అధికారులతో వీసీలో పాల్గొన్న కలెక్టర్

BHPL: ఉపాధి హామీ పథకం పనులు చేసేందుకు మంచి సీజన్ అని, పెద్ద ఎత్తున లేబర్ను తీసుకురావాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఎంపీడీవోలను ఆదేశించారు. గురువారం పలు మండల ప్రత్యేక అధికారులతో ఐడీవోసీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

April 4, 2025 / 05:12 PM IST

‘కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలి’

NLG: ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2014 కంటే ముందు ఉన్న దుర్భిక్షం నెలకొందని, కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని, జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్న సమీక్షలు లేవు, కొనుగోలు కేంద్రాలపై మాట్లాడడం లేదన్నారు.

April 4, 2025 / 05:04 PM IST

జిల్లాకి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం

MBNR: జిల్లా కేంద్రానికి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం మంజూరు అయింది. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఈ ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అతి త్వరలో ఇది ప్రారంభంకానుంది. ఇందులో నాణ్యమైన మందులు తక్కువ ధరలకు లభించనున్నాయి. దీంతో పేద ప్రజలకు మందుల ఖర్చులు తగ్గనున్నాయి.

April 4, 2025 / 04:54 PM IST

మండల బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం

NLG: చందంపేట మండలం పోలేపల్లి వద్ద బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు గుంటోజు వినోదాచారి ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ మండల సమావేశం నిర్వహించారు. ఈనెల 6న బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు, బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, 14న అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

April 4, 2025 / 04:48 PM IST

‘ఆరెళ్ల లోపు పిల్లలందరినీ అంగన్వాడిల్లో చేర్పించాలి’

KNR: ఆరు సంవత్సరాలలోపు పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తల్లిదండ్రులకు సూచించారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు.

April 4, 2025 / 02:23 PM IST