• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

లంచం తీసుకుంటూ పట్టుబడిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

SDPT: దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నర్సింహారెడ్డి రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సిద్దిపేటలోని ఓ టీ పాయింట్‌లో లంచం స్వీకరిస్తుండగా బుధవారం అతన్ని అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు దుబ్బాక తహశీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 13, 2025 / 06:35 AM IST

సర్పంచ్ పోటీకి అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి

MDK: స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొగడంతో యువతలో ఉత్సాహం పెరిగింది. విదేశాలలో ఉండే యువకులు సైతం పల్లెలకు పరుగులు పెడుతున్నారు. మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ శంకరప్ప గత 25 సంవత్సరాలు పాలించి శంకరంపేటను అభివృద్ధి చేశారని, ఆయనను స్ఫూర్తి తీసుకొని ఆయన మనవడు కంచర్ల చంద్రశేఖర్ అమెరికా నుంచి ఉద్యోగం వదిలీ చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చేరుకున్నారు.

February 13, 2025 / 06:21 AM IST

పౌష్టికాహారంపై అవగాహన సదస్సు

SRCL: రాజన్న సిరిసిల్ల పట్టణంలో పౌష్టికాహారం, వాష్ కార్యక్రమాలపై బుధవారం అవగాహన నిర్వహించినట్టు డీఆర్డీవో గొట్టే శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళ గర్భం దాల్చిన నుంచి 1,000 రోజుల ప్రణాళిక చేతుల శుభ్రంగా కడుక్కోవడం, పెరటి కోళ్ల పెంపకం వంటి వాటిపై శిక్షణ ఇచ్చామని స్పష్టం చేశారు.

February 12, 2025 / 07:31 PM IST

పేదింటి అమ్మాయి వివాహానికి ఆర్థిక సహాయం

JGL: మెట్ పల్లి పట్టణంలోని డీడీ నగర్‌లో నివసిస్తున్న రమ్య తండ్రి సంపంగి ఎల్లయ్య సాయమ్మ వారిది నిరుపేద కుటుంబం. ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ వారు తెలుసుకొని వివాహానికి ట్రస్ట్ సహకారంతో 69వ పేదింటి అమ్మాయి పెళ్లికి కావాల్సిన పుస్తె, మట్టెలు, పట్టు చీర, రైస్ బుధవారం సీఐ నిరంజన్ రెడ్డి అందజేశారు.

February 12, 2025 / 07:06 PM IST

ఘనంగా ముగిసిన మండల స్థాయి టాలెంట్ టెస్ట్ పోటీలు

KMM: మధిర మండల కేంద్రంలోని టీవీఎం ప్రభుత్వ పాఠశాలలో బుధవారం పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ టెస్ట్ పోటీలలో మధిర టీవీఎం ప్రభుత్వ పాఠశాల, మడుపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించినట్లు పోటీల నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలియజేశారు.

February 12, 2025 / 06:56 PM IST

బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కేటాయించాలి

BDK: బీసీల హక్కులను రక్షించేందుకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కేటాయిస్తూ చట్టం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొదమూరు సత్యనారాయణ ప్రభుత్వాన్ని బుధవారం డిమాండ్ చేశారు. బీసీలు జనాభాలో అధిక శాతం ఉన్నప్పటికీ రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని అన్నారు. వెంటనే ప్రభుత్వం రిజర్వేషన్ అమల దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

February 12, 2025 / 06:55 PM IST

హీరాసుక జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే

ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో బుధవారం ఆదివాసీ పురోహిత్ ప్రధాన్ సమాజ్ సంఘ్ ఆధ్వర్యంలో ధర్మగురు హీరాసుక జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మాజీ జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాథోడ్ హాజరయ్యారు. అనంతరం తమ సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, ఆదివాసీలు తదితరులున్నారు.

February 12, 2025 / 05:06 PM IST

శిలాఫలకం ధ్వంసంపై బీఆర్‌ఎస్ నాయకుల ఆగ్రహం

SRD: నారాయణఖేడ్ పట్టణంలోని 13వ వార్డులో గతంలో శంకుస్థాపన చేసిన శిలాఫలకం కూల్చి వేయడంపై పట్టణ బీఆర్ఎస్ నాయకులు ముజామిల్, రవీందర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిసి రోడ్లు, సైడ్ ట్రెండ్ నిర్మాణం కోసం, అప్పటి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి స్థానికంగా శంకుస్థాపన చేశారని తెలిపారు. 

February 12, 2025 / 04:45 PM IST

ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ

MNCL: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది విధుల్లో సమర్థవంతంగా వ్యవహరించాలని మంచిర్యాల అదనపు కలెక్టర్ మోతిలాల్ సూచించారు. మంచిర్యాల కలెక్టరేట్‌లో స్టేజ్ 1, 2 ఆర్‌వోలు, ఏఆర్వోలు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో ఎన్నికల ప్రక్రియపై శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.

February 12, 2025 / 04:13 PM IST

కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల అభివృద్ధి: ఆడే గజేందర్

ADB: గుడిహత్నూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఈద్గా, ఖబ్రస్థాన్ అభివృద్దికి రూ.5 లక్షలు కేటాయించినందుకు గాను ముస్లింలు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని గజేందర్ పేర్కొన్నారు.

February 12, 2025 / 01:46 PM IST

దేవాలయంలో ఘనంగా యజ్ఞ హోమాలు

MNCL: జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో ఉన్న శ్రీ నర నారాయణస్వామి వారి దేవాలయంలో యజ్ఞ హోమాలు నిర్వహిస్తున్నారు. ఆ దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా బుధవారం మధ్యాహ్నం దేవాలయం ఆవరణలో వేద పండితులు వివిధ యజ్ఞ హోమాలు చేస్తున్నారు. అంతకు ముందు దేవాలయంలోని శ్రీ నారా నారాయణ స్వామి వారి మూల విగ్రహాన్ని వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.

February 12, 2025 / 01:35 PM IST

రేప రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం

SRD: కంగ్టి మండల ఎంపీపీ సమావేశం మందిరంలో గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సత్తయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున మండల పరిధిలోని పార్టీల నాయకులు విధిగా హాజరుకావాలని కోరారు. స్థానిక ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

February 12, 2025 / 01:27 PM IST

చుక్కల దుప్పిపై వీధి కుక్కల దాడి

MNCL: ముల్కల్ల అటవీ బీట్ పరిధి నుంచి చుక్కల దుప్పి గుడి పేట గ్రామ శివారులోని ఎస్సీకాలనీలోకి రాగా కాలనీలోని వీధి కుక్కలు ఒక్కసారిగా మంగళవారం రాత్రి దాడి చేశాయి. గమనించిన స్థానికులు వాటిబారీ నుంచి కాపాడి అటవీ అధికారులకు సమాచారం అందించారు. పాత మంచిర్యాల అటవీ బీట్ సెక్షన్ అధికారి అతావుల్లా గ్రామానికి చేరుకొని దుప్పిని ఎల్లంపల్లి ప్రాజెక్టు వైపు వెళ్లేలా చేశారు.

February 12, 2025 / 01:25 PM IST

మున్నూరు కాపుల ముందస్తు అరెస్ట్

సిద్దిపేట: రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో బీసీల రిజర్వేషన్, మున్నూరు కాపుల జనాభాను తగ్గించి చూపెట్టారని కాపు కులస్తులు డిమాండ్ చేశారు.బీసీల రిజర్వేషన్ రీసర్వే చేయాలని రాష్ట్ర మున్నూరు కాపు పిలుపుమేరకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి కార్యక్రమంలో భాగంగా ముందస్తుగా హుస్నాబాద్ పోలీసులు హుస్నాబాద్ మున్నూరు కాపు కులస్తులను అరెస్టు చేశారు.

February 12, 2025 / 12:56 PM IST

వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే

ADB: ఇచ్చోడ మండల కేంద్రంలో నిర్వహించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందంబా కళ్యాణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులు సమిష్టిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించుకోవడం గొప్ప విషయమని అనిల్ జాదవ్ పేర్కొన్నారు.

February 12, 2025 / 12:44 PM IST