MNCL: హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహాసభ శుక్రవారం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను జీసీసీ రాష్ట్ర చైర్మన్ కొట్నాక తిరుపతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివాసి గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని కార్గేను ఆయన కోరారు.