KMM: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బోదులబండలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. క్వింటాకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు.
పెద్దపల్లి: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా కేంద్రంలోని బస్టాండ్కు వచ్చే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వ ఐటీఐ పెద్దపల్లి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని శుక్రవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ ఛైర్మన్ ఈర్ల స్వరూప, పాల్గొన్నారు.
WGL: ఎనుమాముల మార్కెట్లో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకు గురువారం రూ.13,150 పలకగా.. నేడు రూ.12,900 పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.11,500 ధర రాగా.. నేడు రూ.11,200 ధర వచ్చింది. మరోవైపు వండర్ హాట్(WH) రకానికి నిన్నటిలాగే రూ.14వేల ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
SRCL: వేములవాడ, శ్రీ రాజరాజేశ్వర స్వామిని శుక్రవారం ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుస్రం నీలా దేవి, కొంకటి లక్ష్మీనారాయణ, రేణికుంట ప్రవీణ్లు దర్శించుకున్నారు. మిషన్ ఛైర్మన్, సభ్యులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు లడ్డు ప్రసాదం అందజేశారు.
BDK: నిన్న కురిసిన వర్షానికి కొత్తగూడెం టౌన్ నాగయ్య గడ్డలో విద్యుత్ స్తంభం నేలకు ఒరిగింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఆ విద్యుత్ స్తంభం పై విద్యుత్ తీగలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నెల రోజుల క్రితం కొత్త లైన్ కోసం వేసిన విద్యుత్ స్తంభానికి నేటికి కనెక్షన్ ఇవ్వలేదని మాజీ కౌన్సిలర్ రూప అన్నారు.
BDK: శ్రీరామచంద్ర స్వామికి తిరువీధి సేవ ఘనంగా జరిగింది. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం బేరి పూజ, దేవత ఆహ్వానం వేడుకలు జరగనున్నాయి. ఏప్రిల్ 5న సాయంత్రం సీతారాములకు ఎదుర్కోలు మహోత్సవం, ఏప్రిల్ 6న ఉదయం 10:30 నిమిషాల నుంచి 12:30 నిమిషాల వరకు మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.
SRPT: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలం హనుమంతుల గూడెం గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు గరిడేపల్లి మండలం కల్మల్ చెరువు గ్రామానికి చెందిన యాతం సైదులుగా గుర్తించారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్యం హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
PDPL: ఉత్తరప్రదేశ్లోని జైతాపూర్కు చెందిన వరుణ్ కుమార్ సింగ్(30) అనే యువకుడు కూలీ పని చేసేందుకు హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో రామగుండం రైల్వే స్టేషన్లో రైలు దిగే సమయంలో కాలుజారి పడిపోయాడు. వెంటనే రైలు కదలడంతో వరుణ్ కుమార్ అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
VKB: ధారూర్ మండలంలోని సంగయేపల్లి తండ అటవీ ప్రాంతంలో కొందరు జీడి గింజలతో నాటుసారా తయారు చేస్తున్నారు. ధారూర్ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ రాజేందర్ సిబ్బందితో కలిసి దాడిచేసి సామాగ్రిని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు. జీడి గింజలతో తయారు చేస్తున్నట్లు పరిశీలనలో ఆనవాళ్లు లభ్యమయ్యాయని, ఓ వ్యక్తి అడవిలో పారిపోవడం గమనించామన్నారు. ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
PDPL: గోదావరిఖని మారుతి నగర్కు చెందిన చుక్క సత్తమ్మ (65) గుండెపోటుతో మరణించగా కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు సదాశయ ఫౌండేషన్ ద్వారా నేత్రదానం చేశారు. LV ప్రసాద్ ఆసుపత్రి టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ మృతురాలి కార్నియా సేకరించి HYD-ఐ బ్యాంకుకు తరలించారు. కుటుంబ సభ్యులు రాజేశ్వరరావు, పద్మ, రవి కుమార్, ప్రణీత, కృపాకర్, ప్రశాంత్, సుష్మ, తదితరులు పాల్గొన్నారు.
NZB: జిల్లా జనసేన పార్టీ ఇంఛార్జ్ గుండా సంతోష్ ఆధ్వర్యంలో గురువారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను ఆయన ఛాంబర్లో జనసేన నాయకులు కలిశారు. ఈ సందర్భంగా గుండా సంతోష్ పలు అంశాలపై సీపీతో చర్చించారు. అనంతరం పార్టీ ఇంఛార్జ్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. సీపీను కలిసిన వారిలో పార్టీ కార్యదర్శి మహేశ్, ఉపాధ్యక్షుడు శ్రీను ఉన్నారు.
NZB: సదాశివనగర్ మండల కేంద్రంలో బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సవిత్రీ బాయి ఫూలే దంపతులు, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ & రమాబాయి దంపతుల మహనీయుల విగ్రహాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం, విద్య, హక్కుల సాధన కోసం ఈ మహనీయుల జీవితాలు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
NZB: హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో CDMA శ్రీదేవి చేతుల మీదుగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ప్రశంసా పత్రం అందుకున్నారు. కమిషనర్ రాజు మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ ప్రశంసా పత్రం అందజేశారని తెలిపారు.
JGL: గొల్లపల్లి మండలం చిలువకోడూరు ఉన్నత పాఠశాలలో గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రీజనల్ నార్కోటిక్ కంట్రోల్ సెల్ డీఎస్పీ ఉపేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ మత్తు పదార్థాల నియంత్రణ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి కె.రాము హాజరయ్యారు.
KMR: RTC డిపో మేనేజర్ కరుణ శ్రీ గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎంను కలెక్టర్ అభినందించారు. జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ఆర్టీసీ కృషి చేయాలని ఆయన సూచించారు. డీఎం మాట్లాడుతూ.. జిల్లాలో ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు తమవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.