NLG: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం వర్ధంతి సందర్భంగా ఇవాళ సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి నివాళులర్పించారు. భూమి, వెట్టిచాకిరి విముక్తి కోసం 16 ఏళ్లకే తుపాకీ పట్టిన ఆమె, రజాకార్ల పాలిట సింహస్వప్నంగా నిలిచారని కొనియాడారు. ఎమ్మెల్యేగా సమస్యలపై అసెంబ్లీని గడగడలాడించారని, సారా వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా పనిచేశారన్నారు.
BDK: పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో మార్చి 19 నుండి 27 వ తేదీ వరకు నిర్వహిస్తున్న శ్రీ దేవి వసంత నవరాత్రి ఉత్సవాలకు గురువారం రాత్రి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేను ఆలయ ఈవో, అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
MNCL: జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ముస్లిం కుటుంబాలకు గురువారం రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. అనంతరం మసీదు ప్రాంగణంలో వాటర్ షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, నియోజకవర్గంలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
WGL: సంగెం మండలం గవిచర్లలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్టు షాపులపై ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ఆకస్మిక దాడి నిర్వహించారు. పలు షాపుల్లో విక్రయిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని గుండ బ్రహ్మయ్య ఆలయంలో జాతర జరగనున్న నేపథ్యంలో మద్యం విక్రయాలను నిలిపివేయాలని హెచ్చరించినప్పటికీ వినకపోవడంతో దాడి చేపట్టినట్లు తెలిపారు.
SRPT: ముస్లింల పవిత్ర పండగ రంజాన్ను పురస్కరించుకుని మఠంపల్లి(మం) పెదవీడులో గల కౌసర్, మదీన మస్జీద్ల ఆవరణలో రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు, హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ కరీం పాల్గొన్నారు. పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను పంపిణీ చేయండం ఎంతో భాగ్యమన్నారు.
ADB: సోనాల మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే సస్పెండ్ చేస్తారా? అని బత్తుల రమేష్ అన్నారు. ఇవాళ మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అహర్నిశలు కష్టపడి పార్టీని కాపాడుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు గౌరీభట్ల నృసింహరామ శర్మ, ఉగాది పునస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశిష్ట పురస్కారం అందుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా ఈ పునస్కారాన్ని గురువారం అందుకున్నారు.
ఖమ్మం భూధాన్ భూముల్లో భారీమోసం వెలుగులోకి వచ్చింది. 38 మంది భూధాన్ బాధితుల నుంచి సుమారు 54.13 లక్షలు వసూలు చేసినట్లు ACP కార్యాలయంలో గురువారం ఫిర్యాదు నమోదైంది. ఒక్కొక్కరి నుంచి రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు వసూలు చేసి నకిలీ రసీదులు సృష్టించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు పోలబోయిన ముత్తయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
KNR: తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం గ్రామంలో నూతన వివో భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. గ్రామ అభివృద్ధికి ఈ భవనం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
SRD: వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో దోహదపడతాయని కంగ్టి ఎస్సై దుర్గా రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని దెగులవాడి గ్రామంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక సర్పంచ్ పద్మావతి బసిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ప్రధాన కూడలిలో చలివేంద్రం ఉంటే రహదారిన వెళ్లే వాహనదారులు ఎండలో పనికి వెళ్ళిన వారికి దోహదపడుతుందన్నారు.
PDPL: తెలంగాణ ప్రభుత్వ విప్గా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుండే ప్రభుత్వ విప్గా నియమితులయ్యే సమాచారంతో సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయింది. అనుకున్నట్టుగానే ప్రభుత్వం ఆయనను విప్గా నియమించింది. తనకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.
MBNR: గండీడ్ మండలంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శుక్రవారం విస్తృతంగా పర్యటించనున్నారు. పర్యటన వివరాలు.. మధ్యాహ్నం 3 గంటలకు రైతు వేదికలో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేయనున్నారు. అనంతరం జెడ్పీ హైస్కూల్లో కొత్త గదులు, సైన్స్ ల్యాబ్ ప్రారంభిస్తారు. అలాగే స్థానిక సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు కాంగ్రెస్ట్ నాయకులు తెలిపారు.
GDWL: గద్వాల మండలం పరుమాల గ్రామానికి చెందిన జమ్మన్న కుమార్తె గురువారం ప్రమాదవశాత్తు వేడి నీళ్ల హీటర్లో పడి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారికి చర్మం పూర్తిగా కాలిపోవడంతో పాటు శ్వాస తీసుకోవడం కష్టతరంగా మారింది. దీంతో డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం అత్యవసరంగా హైదరాబాద్కు తరలించాలని సూచించారు.
ఖమ్మం DCC నూతన కార్యవర్గాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కసరత్తు చేసిన పీసీసీ జిల్లాలోని కీలక నేతలందరికీ ప్రాధాన్యత ఇస్తూ సమతుల్యమైన కమిటీని వెల్లడించింది. ఈ నూతన కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్షులు, 22 మంది ప్రధాన కార్యదర్శులు, 26 మంది కార్యదర్శులకు చోటు కల్పించారు.
WNP: గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి పాల్గొన్నారు. కొత్త ఆశలతో, కొత్త ఆశయాలతో తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతో, రైతన్నల ఇంట పాడిపంటలతో, అభివృద్ధి పథంలో రాష్ట్రం ముందుండాలని కోరుకున్నట్లు తెలిపారు.