KMM: కాంగ్రెస్ పార్టీ కృషితోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణనకు శ్రీకారం చుట్టిందని వరంగల్ ఎమ్మెల్యే రాజేందర్ అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, TPCC చీఫ్ మహేష్ గౌడ్, DY CM భట్టి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
JN: స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త తాటికొండ (బండల) రాజయ్య (55) గుండెపోటుతో శుక్రవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆయన ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. రాజయ్య మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
WGL: జిల్లాలో దాదాపు 2.30 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే నిర్దేశించిన కొలతల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం సూచిస్తోంది. 8 పిల్లర్లతోనే 400 చదరపు అడుగుల స్లాబ్ ఏరియాను నిర్మించుకోవాలి. ఇందులో 10.5X12.5 చదరపు అడుగులతో బెడ్ రూమ్, 6.9X10తో కిచెన్ రూమ్, 9X10తో హాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది.
WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని MLA కెఆర్ నాగరాజు అన్నారు. అభివృద్ధిలో భాగంగా ఏ అధికారి, నాయకుడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా 8096107107కి ఫిర్యాదు చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు.
WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కాజీపేట ఏసీపీ బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) తిరుమల్ హైడ్రా డీఎస్పీగా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఆయనను నియమిస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.
HYD: సమ్మర్లో నగరంలోని స్విమ్మింగ్ పూల్స్కు డిమాండ్ పెరిగింది. వేసవి సెలవుల్లో ఈతకోసం నగరవాసులు క్యూ కడుతున్నారు. ఇది స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులకు వరంగా మారింది. డిమాండ్కు తగ్గట్లుగానే ఒక్కో కస్టమర్కు గంటకు రూ.100 నుంచి రూ.200గా ధరలు నిర్ణయించారు. సమ్మర్ ప్యాకేజీ పేరిట నెలకు రూ.2 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారు.
NGKL: శ్రీశైలం ఎడమగట్టు SLBC సొరంగంలో గల్లంతైన ఆరుగురి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సహాయక బృందాలు గాలింపు నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి శుక్రవారం తెలిపారు. సాంకేతిక నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకోనున్నారు.
KMR: కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు గురువారం తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారని.. ముఖ్య నాయకులు సమావేశానికి హాజరు కావాలని సూచించారు.
ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి భారీ ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం రైతాంగానికి తీరని నష్టాన్ని మిగిల్చింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారడంతో కల్లల్లో ఆరేసిన మిర్చి, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయింది. అసలే పంటకు ధర లేదని ఇబ్బంది పడుతున్న సమయంలో మళ్ళీ అకాల వర్షం రైతులను నష్టాల్లోకి నెట్టింది.
KNR: తెలంగాణలో ఆస్తి పన్ను 5% రిబేట్లో జమ్మికుంట మున్సిపాలిటీ 55.04% వసూళ్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజలు, అధికారుల సహకారంతో ఇది సాధ్యమైందన్నారు. సీడీఎంఏ అభినందనలు తెలిపిందని, అభివృద్ధి కోసం మూడు కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అధికారులకు, ప్రజలకు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.
KNR: కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఇన్ గేట్ వద్ద పోగొట్టుకున్న బ్యాగును బాధితురాలికి అందించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తీగలగుట్టపల్లికి చెందిన శైలజ కొంత నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును బస్టాండ్ ఇన్గెట్ వద్ద పోగొట్టుకున్నారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న అశ్విని అనే మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ బ్యాగుని అందజేశారు.
BNR: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నూతన ఈవోగా వెంకట్రావు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. గురువారం హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
JGL: నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేరాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పి భీమ్ రావు, డీఎస్పీలు రఘు చంధర్, రాములు, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీఖాన్, రఫీక్ ఖాన్, శ్రీనివాస్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు, పాల్గొన్నారు.
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి గురువారం ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో భాగంగా ప్రధాన బుకింగ్ రూ.1,48,200, VIP దర్శనాలు రూ.5,40,000, బ్రేక్ దర్శనాలు రూ.3,35,400, ప్రసాద విక్రయాలు రూ.11,61,040 కార్ పార్కింగ్ రూ.4,35,000, వ్రతాలు రూ. 1,52,700 తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.32,67,774 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.