WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని MLA కెఆర్ నాగరాజు అన్నారు. అభివృద్ధిలో భాగంగా ఏ అధికారి, నాయకుడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా 8096107107కి ఫిర్యాదు చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు.
WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కాజీపేట ఏసీపీ బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) తిరుమల్ హైడ్రా డీఎస్పీగా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఆయనను నియమిస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.
HYD: సమ్మర్లో నగరంలోని స్విమ్మింగ్ పూల్స్కు డిమాండ్ పెరిగింది. వేసవి సెలవుల్లో ఈతకోసం నగరవాసులు క్యూ కడుతున్నారు. ఇది స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులకు వరంగా మారింది. డిమాండ్కు తగ్గట్లుగానే ఒక్కో కస్టమర్కు గంటకు రూ.100 నుంచి రూ.200గా ధరలు నిర్ణయించారు. సమ్మర్ ప్యాకేజీ పేరిట నెలకు రూ.2 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారు.
NGKL: శ్రీశైలం ఎడమగట్టు SLBC సొరంగంలో గల్లంతైన ఆరుగురి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సహాయక బృందాలు గాలింపు నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి శుక్రవారం తెలిపారు. సాంకేతిక నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకోనున్నారు.
KMR: కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు గురువారం తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారని.. ముఖ్య నాయకులు సమావేశానికి హాజరు కావాలని సూచించారు.
ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి భారీ ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం రైతాంగానికి తీరని నష్టాన్ని మిగిల్చింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారడంతో కల్లల్లో ఆరేసిన మిర్చి, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయింది. అసలే పంటకు ధర లేదని ఇబ్బంది పడుతున్న సమయంలో మళ్ళీ అకాల వర్షం రైతులను నష్టాల్లోకి నెట్టింది.
KNR: తెలంగాణలో ఆస్తి పన్ను 5% రిబేట్లో జమ్మికుంట మున్సిపాలిటీ 55.04% వసూళ్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజలు, అధికారుల సహకారంతో ఇది సాధ్యమైందన్నారు. సీడీఎంఏ అభినందనలు తెలిపిందని, అభివృద్ధి కోసం మూడు కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అధికారులకు, ప్రజలకు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.
KNR: కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఇన్ గేట్ వద్ద పోగొట్టుకున్న బ్యాగును బాధితురాలికి అందించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తీగలగుట్టపల్లికి చెందిన శైలజ కొంత నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును బస్టాండ్ ఇన్గెట్ వద్ద పోగొట్టుకున్నారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న అశ్విని అనే మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ బ్యాగుని అందజేశారు.
BNR: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నూతన ఈవోగా వెంకట్రావు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. గురువారం హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
JGL: నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేరాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పి భీమ్ రావు, డీఎస్పీలు రఘు చంధర్, రాములు, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీఖాన్, రఫీక్ ఖాన్, శ్రీనివాస్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు, పాల్గొన్నారు.
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి గురువారం ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో భాగంగా ప్రధాన బుకింగ్ రూ.1,48,200, VIP దర్శనాలు రూ.5,40,000, బ్రేక్ దర్శనాలు రూ.3,35,400, ప్రసాద విక్రయాలు రూ.11,61,040 కార్ పార్కింగ్ రూ.4,35,000, వ్రతాలు రూ. 1,52,700 తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.32,67,774 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
HYD: ఇంటిని అద్దెకిస్తున్న ఓనర్లకు హెచ్చరిక. ఇటీవల TO-LET బోర్డు పెట్టిన సికింద్రాబాద్కు చెందిన ఓ మహిళ మోసపోయింది. అడ్వాన్స్ చెల్లిస్తానని నమ్మించిన ఓసై బర్ నేరగాడు ‘Reverse Mode Payment’ పేరిట రూ.1.31 లక్షలు కొట్టేశాడు. ఓనర్ అకౌంట్లోనే ఆ డబ్బులు పడతాయని చెప్పి ముఖం చాటేశాడు. దిక్కుతోచని స్థితిలో బాధితురాలు CCSను ఆశ్రయించింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు....
NGKL: తాడూరు మండలం తుమ్మలసూరులో గురువారం విషాదం చోటు చేసుకుంది. పిండిగిర్ని దుకాణంలో విద్యుత్ షాక్తో తల్లి జయమ్మ(40), కొడుకు శ్రీకాంత్(15) మృతి చెందారు. పిండిగిర్ని నడుపుతుండగా శ్రీకాంత్ విద్యుత్ షాక్కు గురైన నేపథ్యంలో కొడుకును రక్షించుకునే ప్రయత్నంలో తల్లి జయమ్మ కూడా షాక్కు గురికావడంతో కొడుకుతోపాటు తల్లి మృతి చెందారు.
KMM: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించిన ఖమ్మం పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ సంక్షేమ ఉన్నత పాఠశాల విద్యార్థులను స్కూల్ చైర్ పర్సన్ నిష్టాశర్మ అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయులు దిక్సూచి పాత్ర పోషించారని చెప్పారు. పరీక్షలకు మొత్తం 54 మంది హజరు కాగా 51 మంది విద్యార్థులు ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణత సాధించారన్నారు.