• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అడవిలో నాటు సారా.. ఫారెస్ట్ అధికారుల దాడి

VKB: ధారూర్ మండలంలోని సంగయేపల్లి తండ అటవీ ప్రాంతంలో కొందరు జీడి గింజలతో నాటుసారా తయారు చేస్తున్నారు. ధారూర్ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ రాజేందర్ సిబ్బందితో కలిసి దాడిచేసి సామాగ్రిని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు. జీడి గింజలతో తయారు చేస్తున్నట్లు పరిశీలనలో ఆనవాళ్లు లభ్యమయ్యాయని, ఓ వ్యక్తి అడవిలో పారిపోవడం గమనించామన్నారు. ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

April 4, 2025 / 08:02 AM IST

పుట్టెడు దుఃఖంలోనూ నేత్రదానం

PDPL: గోదావరిఖని మారుతి నగర్‌కు చెందిన చుక్క సత్తమ్మ (65) గుండెపోటుతో మరణించగా కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు సదాశయ ఫౌండేషన్ ద్వారా నేత్రదానం చేశారు. LV ప్రసాద్ ఆసుపత్రి టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ మృతురాలి కార్నియా సేకరించి HYD-ఐ బ్యాంకుకు తరలించారు. కుటుంబ సభ్యులు రాజేశ్వరరావు, పద్మ, రవి కుమార్, ప్రణీత, కృపాకర్, ప్రశాంత్, సుష్మ, తదితరులు పాల్గొన్నారు.

April 4, 2025 / 07:52 AM IST

సీపీని కలిసిన జనసేనా నాయకులు

NZB: జిల్లా జనసేన పార్టీ ఇంఛార్జ్ గుండా సంతోష్ ఆధ్వర్యంలో గురువారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను ఆయన ఛాంబర్‌లో జనసేన నాయకులు కలిశారు. ఈ సందర్భంగా గుండా సంతోష్ పలు అంశాలపై సీపీతో చర్చించారు. అనంతరం పార్టీ ఇంఛార్జ్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. సీపీను కలిసిన వారిలో పార్టీ కార్యదర్శి మహేశ్, ఉపాధ్యక్షుడు శ్రీను ఉన్నారు.

April 3, 2025 / 08:10 PM IST

మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

NZB: సదాశివనగర్ మండల కేంద్రంలో బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సవిత్రీ బాయి ఫూలే దంపతులు, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ & రమాబాయి దంపతుల మహనీయుల విగ్రహాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం, విద్య, హక్కుల సాధన కోసం ఈ మహనీయుల జీవితాలు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

April 3, 2025 / 07:53 PM IST

ప్రశంస పత్రం అందుకున్న ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్

NZB: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో CDMA శ్రీదేవి చేతుల మీదుగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ప్రశంసా పత్రం అందుకున్నారు. కమిషనర్ రాజు మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ ప్రశంసా పత్రం అందజేశారని తెలిపారు.

April 3, 2025 / 07:38 PM IST

‘మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు’

JGL: గొల్లపల్లి మండలం చిలువకోడూరు ఉన్నత పాఠశాలలో గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రీజనల్ నార్కోటిక్ కంట్రోల్ సెల్ డీఎస్పీ ఉపేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ మత్తు పదార్థాల నియంత్రణ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి కె.రాము హాజరయ్యారు.

April 3, 2025 / 07:37 PM IST

కలెక్టర్‌ను కలిసిన నూతన ఆర్టీసి డీఎం

KMR: RTC డిపో మేనేజర్ కరుణ శ్రీ గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎంను కలెక్టర్ అభినందించారు. జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ఆర్టీసీ కృషి చేయాలని ఆయన సూచించారు. డీఎం మాట్లాడుతూ.. జిల్లాలో ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు తమవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

April 3, 2025 / 07:35 PM IST

‘లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం’

JGL: గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టరిత్య నేరమని మాత శిశు సంరక్షణ జిల్లా అధికారి ముస్కు జైపాల్ రెడ్డి అన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పట్టణంలోని స్కానింగ్ సెంటర్లను గురువారం తనిఖీ చేశారు. ఈ మేరకు స్కానింగ్ సెంటర్లలోని స్కానింగ్ మిషన్లను, డాక్టర్ల అర్హత ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు.

April 3, 2025 / 06:24 PM IST

‘నిబంధనల మేరకు వరి ధాన్యం కొనుగోలు చేయాలి’

NRPT: ప్రభుత్వ నిబంధనల మేరకు వరి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ శిక్త పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో వరి కొనుగోళ్ల పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. సన్న రకం, దొడ్డు రకం వరి ధాన్యాన్ని వేరువేరుగా కొనుగోలు చేయాలని చెప్పారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలు పక్కగా నమోదు చేసుకోవాలని సూచించారు.

April 3, 2025 / 06:23 PM IST

“రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువు పెంపు”

MBNR: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పెంచినట్టు కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి వార్షికాదాయం 1.5 లక్షలకు మించరాదని, పట్టణ ప్రాంతాల వారికి రెండు లక్షలకు మించరాదని తెలిపారు.

April 3, 2025 / 06:12 PM IST

47% సన్న బియ్యం పంపిణీ పూర్తి: కలెక్టర్

KMR: జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 47 శాతం మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. రామారెడ్డిలో గురువారం సన్నం బియ్యం పంపిణీ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సన్నం బియ్యం నాణ్యత, తూకంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూస్తామని తెలిపారు.

April 3, 2025 / 06:03 PM IST

జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ సమరసత పాదయాత్ర

KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర 3వ వార్డులో DCC అధ్యక్షులు కైలస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం KMR మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో KMR మండలం షాబ్దీపూర్, క్యాసంపల్లి గ్రామాల్లో జై బాపు, జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర నిర్వహించారు.

April 3, 2025 / 05:57 PM IST

‘గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి’

KMR: రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం అమ్మబడి కార్యక్రమం నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ విజయ మహాలక్ష్మి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. గర్భిణులకు వైద్య, రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు చెప్పారు. రక్తహీనత లేకుండా గర్భిణులు జాగ్రత్త పడాలన్నారు. పౌష్టికారం తీసుకోవాలని గర్భిణులకు సూచించారు.

April 3, 2025 / 04:48 PM IST

“బీఆర్ఎస్ నాయకులకు బెయిల్ మంజూరు”

MBNR: అక్టోబర్ 30న కేంద్రంలోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమానికి దిగిన కేసులో 18 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గురువారం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో బెయిల్ లభించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అప్పట్లో కేసు నమోదు చేయడం జరిగిందని, తాము ఆ రోజున న్యాయమైన పోరాటమే చేశామని తెలిపారు.

April 3, 2025 / 04:37 PM IST

“రెడ్ క్రాస్ డయాగ్నస్టిక్ సెంటర్ కోసం భూమి కేటాయించండి”

MBNR: రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెడ్ క్రాస్ డయాగ్నస్టిక్ సెంటర్ కోసం భూమి కేటాయించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మని గురువారం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆపత్కాలంలో సేవలు అందిస్తుందన్నారు.

April 3, 2025 / 04:33 PM IST