• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పారిశుధ్య పనులు పరిశీలించిన మేయర్

MNCL: మంచిర్యాల శుభ్రత- ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రతలో భాగంగా శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్‌లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేశ్, కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ డివిజన్‌లో జరుగుతున్న పారిశుధ్య పనులు పరిశీలించారు. స్థానికుల సమస్యల గురించి తెలుసుకొని సిబ్బందికి పలు సూచనలు చేశారు.

March 20, 2026 / 10:48 AM IST

పట్టణంలో పెరుగుతున్న కుక్కల సమస్య

నారాయణపేట పట్టణంలోని వీధులలో అల్లరి కుక్కల సంఖ్య పెరగడం స్థానికులకు సమస్యగా మారింది. రాత్రి సమయంలో వీధుల్లో తిరిగే కుక్కలు చిన్నపిల్లలు, వృద్ధుల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వీధి మలుపులపై దాడులు జరిగే సంఘటనలు కూడా నమోదయ్యాయి. స్థానికులు వీధుల పరిసరాల్లో కుక్కల సమస్యలు తీర్చే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

March 20, 2026 / 10:46 AM IST

ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ASF: ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న 106 బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో ప్రొఫెసర్ (15), అసోసియేట్ (27), అసిస్టెంట్ ప్రొఫెసర్ (41) కాంట్రాక్ట్ పోస్టులతో పాటు 23 సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు మార్చి 24న ఉదయం 10 గంటలకు అసలు పత్రాలతో వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.

March 20, 2026 / 10:44 AM IST

కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా సర్దార్ సింగ్

KMR: జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా గాంధారి మండలం గండివేట్ తండాకు చెందిన నేనావత్ సర్దార్ సింగ్ నియమితులయ్యారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జిల్లా అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.

March 20, 2026 / 10:42 AM IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్తున్నారా..? జాగ్రత్త..!

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో మొబైల్ దొంగతనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాత్రి సమయంలో నిద్రించిన వారి మొబైల్స్ కొట్టేస్తున్నారు. కుర్చీల్లో కూర్చుని మొబైల్ ఆపరేట్ చేస్తుండగా, మొబైల్ దొంగతనాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా మరో దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని RPF టీం ప్రయాణికులకు సూచిస్తుంది.

March 20, 2026 / 10:40 AM IST

టాటా మ్యాజిక్ వాహనాన్ని తగులబెట్టిన దుండగులు

BDK: చర్ల మండలం తేగడ గ్రామానికి చెందిన అశోక్ కుమార్ రెడ్డి ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాన్ని నిన్న అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు తగలబెట్టేరని వాపోయారు. వారి కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీయడం కోసమే ఈ ఘటనకు పాల్పడ్డారని ఈ ఘటనకు పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులను పోలిస్ శాఖ కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులకు ఆశ్రయించినట్లు ఆయన వెల్లడించారు.

March 20, 2026 / 10:39 AM IST

మెట్రో ఫేజ్-2కు ‘కేంద్ర’ గండం.. బడ్జెట్‌లో నిధులెక్కడ?

HYD: మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్రం రూ. 28,740 కోట్లు ఇస్తామని చెబుతున్నా అదంతా ఒక ‘కండిషన్’ మీద ఆధారపడి ఉంది. ఫేజ్-1 నుంచి ఎల్ అండ్ టీ పూర్తిగా తప్పుకుని రాష్ట్ర ప్రభుత్వం పక్కా డీపీఆర్ సమర్పిస్తేనే పైసలు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈరోజు రాష్ట్ర బడ్జెట్‌లో మెట్రో కోసం కేటాయిస్తున్న నిధులు కేవలం ‘మ్యాచింగ్ గ్రాంట్స్’ గానే కనిపించనున్నాయి.

March 20, 2026 / 10:38 AM IST

చోరీ కేసు.. నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్

MDCL: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం-01లో దోపిడీ కేసులో పాల్గొన్న నిందితుడిని RPFSC అదుపులోకి తీసుకుంది. అనంతరం అతనిని GRP పోలీసులకు అప్పగించగా, న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రయాణికుల భద్రత కోసం RPF ఎల్లప్పుడూ అప్రమత్తంగా పని చేస్తున్నట్లుగా తెలిపారు.

March 20, 2026 / 10:36 AM IST

క్రీడాకారుని హరి చందనకు శుభాకాంక్షలు వెల్లువ

MHBD: తెలంగాణ రాష్ట్ర మహిళా త్రోబాల్ జట్టు జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ప్రతిష్టాత్మకమైన ఫెడరేషన్ కప్ జాతీయ త్రోబాల్ పోటీల్లో ద్వితీయ స్థానం (రన్నరప్) సాధించి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. డోర్నకల్ మండలం, ఉయ్యాలవాడకి చెందిన తల్లూరి హరిచందన జట్టులో కీలక పాత్ర పోషించింది. దీంతో ఆమెపై ప్రశంసలు విలువెత్తుతున్నాయి.

March 20, 2026 / 10:33 AM IST

రైల్వే స్టేషన్‌లో సూట్‌కేస్ దొంగ అరెస్ట్

RR: లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో RPF, GRP పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో సూట్‌కేస్ దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.1,50,000 విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పాత కేసులతో కూడా సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ప్రయాణికుల భద్రత కోసం RPF నిరంతరం అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు.

March 20, 2026 / 10:33 AM IST

స్కూల్ లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ భవనాలకు భూమి పూజ

NRPT: నర్వ మండల పాతర్చెడ్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ భవనాల భూమిపూజ గురువారం సర్పంచ్ లింగమ్మ, ఎంపీడీవో శ్రీనివాసులూ కలిసి నిర్వహించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచే లక్ష్యంతో కొత్త లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆంజనేయులు, మండల అధ్యక్షుడు చెన్నయ్య పాల్గొన్నారు.

March 20, 2026 / 10:33 AM IST

400 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

NLG: యాసంగి వరి కోతలు ప్రారంభం కావడంతో జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి 14 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు, గతంలో ఉన్న 375 కేంద్రాలను 400కు పెంచాలని నిర్ణయించారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. అధికారుల కసరత్తుతో రైతులు హర్షం వ్యక్తమవుతోంది.

March 20, 2026 / 10:31 AM IST

DR.BR అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ

WGL: ఖానాపురం (M) కొత్తూరు గ్రామంలో భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నేడు భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అడ్వకేట్ వీరేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ సంఘాల నాయకులు, పూలే అభిమానులు, సామాజిక-రాజకీయ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినప్పుడు తెలిపారు.

March 20, 2026 / 10:30 AM IST

మేత కోసం కాపరుల వలసలు ప్రారంభం..

MBNR: ఎండలు పెరుగుతుండటంతో గొర్రెల కాపరులు వలస బాట పట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వేలాది గొర్రెలతో జోగులాంబ గద్వాల నడిగడ్డకు చేరుతున్నారు. నల్లరేగడి పొలాల్లో మేత పుష్కలంగా లభిస్తుందని, మూడు నెలలు ఇళ్లకు దూరంగా ఉండి గొర్రెలను మేపుతామని చెబుతున్నారు. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల నుంచి ఎక్కువగా కాపరులు వస్తున్నారు.

March 20, 2026 / 10:27 AM IST

దేవరకద్ర మున్సిపాలిటీకు షోకాజ్ నోటీసులు

MBNR: దేవరకద్ర మున్సిపాలిటీ మేనేజర్, ఏడో వార్డు అధికారులు ఇందిరమ్మ ఇండ్ల ఫొటోలు యాప్‌లో దశల వారీగా నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. కలెక్టర్ స్వయంగా 7వ వార్డు ఇండ్లను పరిశీలించి యాప్‌లో టెక్నికల్ సమస్యలేదని పేర్కొన్నారు.

March 20, 2026 / 10:25 AM IST