• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఉద్యమకారులు ముందస్తు అరెస్ట్

VKB: బొంరాస్‌పేట మండలంలోని వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లను శుక్రవారం ఉదయం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కొడంగల్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించనున్నారని సమాచారం వచ్చిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టబడింది. అక్రమ అరెస్టులు తమ ఉద్యమాన్ని ఆపలేవని, సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేవని ఆశా వర్కర్లు హెచ్చరించారు.

March 20, 2026 / 03:00 PM IST

ఉమ్మడి జిల్లాను విస్మరించారు: శ్రీనివాసరావు

WGL: రాష్ట్ర ప్రభుత్వం తరుపున శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాను విస్మరించారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు, కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమల ఊసే లేదని, వరంగల్ నగరంలోని మురికి వాడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక బడ్జెట్‌లో లేదని తెలిపారు.

March 20, 2026 / 02:55 PM IST

పోగొట్టుకున్న నగదు బాధితురాలికి అందజేత

KMM: మధిరకి చెందిన కనకమ్మ అనే వృద్ధురాలు పోగొట్టుకున్న రూ. 25 వేల నగదును పోలీసులు ఆమెకు అందజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో సీఐ దోమల రమేష్ ఆదేశాల మేరకు బ్లూకోట్ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. శుక్రవారం టీ తాగేందుకు వెళ్లిన సమయంలో ఆమె నగదును రోడ్డుపై జారవిడుచుకుందని గుర్తించారు. నగదు తీసుకున్న వ్యక్తిని గుర్తించి అతడి నుంచి స్వాధీనం చేసుకుని వృద్థురాలకి అందజేశారు.

March 20, 2026 / 02:48 PM IST

జిల్లా కాంగ్రెస్ సెక్రటరీగా రాములు యాదవ్

WNP: జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీగా శ్రీరంగాపురం మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాములు యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, కృషి గుర్తించి ఉన్నత నాయకత్వం ఈ బాధ్యతలు అప్పగించినట్లు వారు పేర్కొన్నారు.

March 20, 2026 / 02:44 PM IST

మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు భూమి పూజ..!

NLG: గుడిపల్లి మండల కేంద్రంలో సంఘసంస్కర్తలు, మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ప్రతిష్టాపన కోసం శుక్రవారం “విగ్రహాల నిర్మాణ కమిటి” ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, విగ్రహాల దాతలు మాజీ సర్పంచ్ శీలం శేఖర్ రెడ్డి, ఇటికాల జగన్ మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటి డైరక్టర్ భూతం సైదులు ఉన్నారు.

March 20, 2026 / 02:42 PM IST

ఘనంగా ఎద్దుల బండి పోటీ ప్రారంభం

NRPT: మరికల్ మండల ఎల్లిగండ్ల గ్రామంలో శుక్రవారం ఎద్దుల బండ్ల గిరిక పోటీలు సర్పంచ్ అశ్విని-నరేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మొదటి బహుమతి రూ.15,000, రెండో బహుమతి రూ.10,000, మూడో బహుమతి రూ.5,000 గా ప్రకటించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి 20 పైగా జోడెద్దుల బండ్లు పోటీపడనున్నాయి. నాయకులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సవాన్ని ఆస్వాదించారు.

March 20, 2026 / 02:40 PM IST

‘ఆత్మగౌరవం కోసం పోరాడిన ధీశాలి ఠాను నాయక్’

BDK: గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్మానాయక్, శ్రీరామ్ నాయక్ అధ్యక్షతన శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాటోతు ఠాను నాయక్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, గిరిజన బిడ్డల ఆత్మగౌరవం కోసం పోరాడిన ధీశాలి ఠాను నాయక్ అని ఆయన కొనియాడారు.

March 20, 2026 / 02:38 PM IST

హామీలను అమలు చేయాలని వినతిపత్రం అందజేత

BHPL: ఆరు గ్యారంటీలు, హామీలను అమలు చేయాలని కోరుతూ భూపాలపల్లి కలెక్టరేట్‌లో అధికారులకు బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ప్రజా సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.

March 20, 2026 / 02:35 PM IST

కంగ్టి తహసీల్దార్‌గా గంగా భవాని బాధ్యతల స్వీకరణ

SRD: కంగ్టి మండల తహసీల్దార్‌గా గంగా భవాని శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన తహసీల్దార్ భాస్కర్ బదిలీపై వెళ్లడంతో ఇంచార్జ్ తహసిల్దార్‌గా ముగ్నీ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సాధారణ బదులు భాగంగా ఆమెను తహసీల్దార్ బదిలీ చేస్తూ అధాకారులు ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా సంప్రదించాలని కోరారు.

March 20, 2026 / 02:31 PM IST

రాణిపేటలో పంచాయతీ సమావేశం

MBNR: మిడ్జిల్ మండలం రాణిపేటలో సర్పంచ్ మాధవి అధ్యక్షతన శుక్రవారం గ్రామపంచాయతీ సమావేశం జరిగింది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. వార్డు సభ్యులు తమ ప్రాంతాల్లోని సమస్యలను వివరించారు. ఈ సమావేశంలో కార్యదర్శి సుదర్శన్, సిబ్బంది పాల్గొన్నారు.

March 20, 2026 / 02:28 PM IST

గుంతలమయంగా బేల రహదారులు

ADB: బేల మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. ముఖ్యంగా కాప్సి గ్రామానికి వెళ్లే దారి పూర్తిగా గుంతలమయమై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ. కోట్లు వెచ్చించినా నాణ్యత లోపంతో రోడ్లు కంకర తేలుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో ఈ గుంతల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.

March 20, 2026 / 02:27 PM IST

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పెద్దపల్లి ఎమ్మెల్యే

KNR: ప్రభుత్వ విప్‌గా నియమితులైన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని నూతనంగా నియమితులైన ప్రభుత్వ విప్‌తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం నూతన విప్‌లకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఇందులో నూతన విప్లు, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు.

March 20, 2026 / 02:26 PM IST

జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

NZB: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలపారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నియమ నిష్ఠలతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు కొనసాగించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో కాలం వెళ్లదీయాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

March 20, 2026 / 02:26 PM IST

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన నేతలు

HNK: ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కోరుతూ హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్‌కు బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ, జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ… ఆరు గ్యారెంటీలను అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజా సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించి ప్రజా సంక్షేమంపై శ్రద్ధ చూపించాలన్నారు.

March 20, 2026 / 02:25 PM IST

నగరంలో మాయం కానున్న ఆటోలు?

HYD: హైదరాబాద్‌లో భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ఆటోలు కనిపించకుండా కొత్త బడ్జెట్‌లో ముఖ్య ప్రణాళికలు ప్రకటించారు. CURE (ORR) పరిధిలోని ఆటోలను రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం నిధులను కేటాయించింది. AI వినియోగాన్ని పెంచడం కూడా లక్ష్యంగా పెట్టారు. HILT పాలసీ ప్రకారం పరిశ్రమలను ORR పరిధి వెలుపల తరలించాలని నిర్ణయించారు.

March 20, 2026 / 02:22 PM IST