WGL: గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన గురువారం రాయపర్తి మండలం ఆర్ఆర్ కాలనీ వద్ద జరిగింది. ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారిపై బిక్షాటన చేస్తూ జీవిస్తున్న గుర్తు తెలియని వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది అతడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.
WGL: వరంగల్- నిజామాబాద్ రూట్లో డీలక్స్ బస్ ఛార్జీలపై 10 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి. విజయభాను తెలిపారు. ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో మెరుగైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తగ్గింపు ఛార్జీలను మే 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
KNR: స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలో బ్యూటీషియన్ సర్టిఫికెట్ కోర్సు కోసం అడ్మిషన్ తేదీని మే 5 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. బ్యూటీషియన్ సర్టిఫికెట్ కోర్సు వలన వచ్చే సర్టిఫికెట్ ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయవచ్చని అన్నారు. తరగతులు మే 5 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.
PDL: పెద్దపల్లి మండలం కొత్తపల్లి 37వ నంబర్ రైల్వే గేట్ మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకోవాలని బుధవారం గేట్ ముందు టెంట్ వేసుకొని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 39వ నంబర్ గేట్ మూసివేయడం వల్ల విద్యార్థులు పాఠశాలకు, రైతులు పొలాలకు సుమారు 3 కిలోమీటర్ల తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, వెంటనే రైల్వే అధికారులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
SRPT: కుక్కల దాడిలో 31 గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నడిగుడెం గ్రామానికి చెందిన వట్టె సతిష్ గొర్రె పిల్లలు మేతకు గ్రామ వెలుపలకు వెళ్లగా కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో 31 గొర్రె పిల్లలు చనిపోయాయని, వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు.
BHNG: అక్షయ తృతీయ సందర్భంగా వాసవి క్లబ్ భువనగిరి వారి ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయ గోశాలకు, బుస్స ఈశ్వర్, పులిగిల్ల ప్రకాష్ ఆర్థిక సహాయంతో ఒక ట్రాక్టర్ గడ్డి, రెండు బస్తాల దాణా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బిజ్జాల మహేశ్, కోశాధికారి జంగాల హనుమంతరావు, జోన్ ఛైర్మన్ ఆకుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
NLG: గుండ్లపల్లి(డిండి) మండలం బ్రాహ్మణపల్లి గ్రామ సమీపంలో వ్యవసాయ పొలం వద్ద బుధవారం సాయంత్రం పిడుగు పడి రెండు ఎడ్లు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. జబ్బు పెద్దయ్యకు చెందిన రెండు ఎడ్లు మృతి చెందడంతో రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మండలంలో అకాల వర్షానికి పలుచోట్ల పంటలు దెబ్బతిన్నట్లు తెలిపారు.
KMM: తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో బుధవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా మధిర నియోజకవర్గం చింతకాని మండలం కొదుమూరులో జరిగిన కన్నేటి సురేష్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
HYD: మిస్ వరల్డ్-2025 పోటీల సందర్భంగా నగరంలో సెక్యూరిటీ పెంచుతున్నారు. అతిథుల కోసం ఎయిర్ పోర్టు, వారు బస చేసే హోటళ్లు, కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని CM పోలీసులను ఆదేశించారు. ఈవెంట్కు మరో వారం రోజులే ఉండడంతో వందలాది మంది మోడల్స్, మేకప్ ఆర్టిస్టులు HYDకు క్యూ కట్టారు.
ADB: తాంసి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించింది. బుధవారం మధ్యాహ్నం విడుదలైన ఫలితాల్లో భాగంగా 576 మార్కులతో గిజ్జా అనూసరి ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 73 మంది విద్యార్థులు 35 మంది విద్యార్థులు 500 పైన మార్కులు సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని HM ఆనంద్ పేర్కొన్నారు.
SRD: సంగారెడ్డి జిల్లాలో మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు. నిబంధనలు ఉల్లంగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
SRD: పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈనెల 16వ తేదీలోపు సప్లమెంటరీ ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ. 50 రూపాయల అపరాధ ఫీజుతో ఈనెల 20వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు సప్లమెంటరీ పరీక్షల జరుగుతాయని తెలిపారు.
SRD: సంగారెడ్డి జిల్లా పదవ తరగతి ఫలితాలను విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. మొత్తం 22,374 మంది విద్యార్థులు పరీక్ష రాయగావ్22,170 మంది ఉత్తీర్ణత సాధించి 99.09 సాధించినట్లు చెప్పారు. రాష్ట్రంలో జిల్లా ద్వితీయ స్థానం సాధించినట్లు పేర్కొన్నారు .ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
SRCL: భూ భారతి, నూతన ఆర్ఓఆర్ చట్టంను రైతులు సద్విని చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని, చట్టంలోని వివిధ అంశాలను, ప్రయోజనాలను ప్రెజెంటేషన్ ద్వారా రైతులు, ప్రజలకు క్లుప్తంగా జిల్లా కలెక్టర్ వివరించారు.