KMM: కారేపల్లి మండలం ఉసిరికాయపల్లి సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శి అమీర్ ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గురువారం ఫోన్లో బాధిత కుటుంబ సభ్యులుతో మాట్లాడి పరామర్శించారు. అనంతరం దశదిన కార్యక్రమానికి కావలసిన 100 కేజీల బియ్యం, సరుకులను స్థానిక నాయకుల చేతులు మీదుగా నేడు అందజేశారు.
KNR: జిల్లాలోని మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31 వరకు నిర్వహించనున్న ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా బాలబాలికలకు పని నుంచి విముక్తి కల్పించి తల్లిదండ్రుల చెంతకు చేర్చాలని అన్నారు.
KNR: కరీంనగర్ జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ..నగరంలో అత్యాధునిక కెమెరాల సహాయంతో ట్రాఫిక్ను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. నిబంధనలు పాటించని వాహనదారులను ఈ కెమెరాలు ఆటోమేటిక్గా గుర్తిస్తాయని, వాహన యజమానులపై ట్రాఫిక్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
WGL: వ్యవసాయానికి వరంగల్ పెట్టింది పేరు. పత్తి, వరి, మిరప, మొక్కజొన్న, కూరగాయల సాగుతో ఉమ్మడి జిల్లా రైతులు మంచి లాభలు గడిస్తుంటారు. అయితే రసాయనాలు కాకుండా ప్రకృతి వ్యవసాయం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఫలితంగా భూ కాలుష్యం తగ్గడం, భూసారం పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటామన్నారు. పెట్టుబడి తగ్గుందని, పంటకు సైతం గిట్టుబాటు ధర ఉంటుందన్నారు.
BDK: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం డీఎంహెచ్వో కార్యాలయంలో వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎస్. విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై వైద్యులను సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..సమాజంలో వైద్యుల సేవలు అపూర్వమైనవి, వారు నిరంతరం ప్రజాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అహర్నిశలు కృషి చేయాలని కోరారు.
KMM: రాష్ట్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు అన్నారు. మంగళవారం నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొంగులేటి సిఫార్సు మేరకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.
KMM: సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే మట్ట రాగమయి ‘మీ ఇంటికి మీ ఎమ్మెల్యే’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ రూ.3,59,000 విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడే నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకునే ఆర్థిక సాయం పొందాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం వైద్యుల దినోత్సవం సందర్భంగా స్థానికులు వైద్యులను శాలువా పూలమాలతో సన్మానించారు. ప్రమాదాలు జరిగినప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు డాక్టర్లు చేసే సేవ మరువలేనిదని అన్నారు. అన్ని వృత్తుల కెల్లా వైద్య వృత్తి పవిత్రమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగన్ మోహన్, రంగయ్య, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
WGL: నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి బుధవారం నెక్కొండ మండలంలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నెక్కొండ-సంగెం, జల్లి – లింగగిరి రోడ్ల పనులు పూర్తవగా.. ఆయన రోడ్లను ప్రారంభిస్తారన్నారు. అనంతరం R&B బైపాస్ నుంచి సాయిరెడ్డిపల్లి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
HYD: పెండింగ్ స్కాలర్షిప్, మెస్ బకాయిల విడుదల చెయ్యాలని ఐక్య విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. అయితే.. HYD ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుల అక్రమ అరెస్టులను MSF OU అధ్యక్షులు నాగరాజు ఖండించారు. పెండింగ్ బకాయలు విడుదల చేయాలని, అప్పటి వరకు ఉద్యమం కొనసాగుతుందని తేల్చిచెప్పారు.
MDK: శివంపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లింపులు లేకపోవడంతో పూట గడవడం కష్టంగా తయారైందని కార్మికులు తెలిపారు. మంగళవారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
MDK: విద్యార్థులు తృప్తిగా భోజనం చేయాలంటే పకడ్బందీగా మెనూ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు అదేశించారు. ఇవాళ టేక్మాల్ షెడ్యూల్ ఎస్సీ, బీసీ బాలుర వసతి గృహాలను కలెక్టర్ పరిశీలించారు. హాస్టల్స్ను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల సామర్థ్యాలు పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు.
RR: తలకొండపల్లి ఎమ్మార్వో నాగార్జున రైతుదగ్గర రూ.10వేలు లంచం తీసుకుంటుండగా మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అంతారం గ్రామానికి చెందిన రైతు వద్ద పొలం మార్పిడి కోసం రూ.1,50,000 బేరం కుదుర్చుకొని అడ్వాన్సుగా రూ.10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
గ్రేటర్ HYD పరిధిలోని అనేక ప్రాంతాల్లో టాయిలెట్ల నిర్వహణ మూలకు పడింది. లక్షల రూపాయలు వెచ్చించి అనేక చోట్ల టాయిలెట్లు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. ఉప్పల్, చిల్కానగర్, నారాయణగూడ, ఎల్బీనగర్ సహా అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.