• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘భూముల అమ్మకాలపై వెనక్కి తగ్గాలి’

NZB: ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో గిరిరాజ్ డిగ్రీ కాలేజ్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల యూనివర్సిటీ భూములను వేలం ద్వారా విక్రయించే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

April 2, 2025 / 04:53 PM IST

మహిళలకు ఎలాంటి సమస్యలున్న షీ టీంను సంప్రదించాలి: ఎస్పీ

ADB: మహిళలకు ఎలాంటి సమస్యలున్న ఆదిలాబాద్ షీ టీం బృందాలను సంప్రదించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం తెలిపారు. మహిళలు కళాశాలలు, ఉద్యోగ స్థలాల నందు వేధింపులపై నిరభ్యంతరంగా ఫిర్యాదు చేయాలన్నారు. బాధితులు షీటీం నెంబర్ 8712659953 ను సంప్రదించాలని సూచించారు. మహిళా చట్టాలు, సైబర్ నేరాలు వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

April 2, 2025 / 04:53 PM IST

సన్న బియ్యం పథకం ప్రారంభించిన అదనపు కలెక్టర్

NRPT: పేద ప్రజలకు ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యం అందజేస్తున్నదని అదనపు కలెక్టర్ రెవెన్యూ బెన్ షాలోమ్ తెలిపారు. బుధవారం కృష్ణా మండల కేంద్రంలోని చౌక ధర దుకాణంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం అందజేస్తామని తెలిపారు.

April 2, 2025 / 04:48 PM IST

ఈనెల 14 వరకు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ

NLG: దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలోని ప్రజా పాలన సేవ కేంద్రం ద్వారా రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వై. సుదర్శన్ బుధవారం తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఈనెల 14 వరకు దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని, సంబంధిత పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

April 2, 2025 / 04:40 PM IST

సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో

NLG: చిట్యాల పట్టణంలో బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక భువనగిరి రోడ్డుపై రాస్తారోకో, నల్ల జెండాల ప్రదర్శన నిర్వహించారు. HCU భూమిని ప్రైవేటు వారికి అప్పగించాలనే ప్రభుత్వ యోచన విరమించుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 400 ఎకరాల HCU భూములను చౌకగా అక్రమ పద్ధతుల్లో కొళ్ళగొడుతున్నారన్నారు.

April 2, 2025 / 04:33 PM IST

‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి’

NLG: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సామేలు అన్నారు. బుధవారం శాలిగౌరారం మండల కేంద్రంలోని వసాయ మార్కెట్ యార్డ్ నందు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీవో అశోక్ రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు.

April 2, 2025 / 04:24 PM IST

సన్న బియ్యం ఇస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వానిదే

SRD: ప్రజలకు సరఫరా చేస్తున్న సన్నబియ్యం ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని దేనిని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. రామచంద్రపురంలోని రేషన్ దుకాణాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే.. ఒక్క కిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు.

April 2, 2025 / 03:28 PM IST

సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరపాలి: కలెక్టర్

NRML: సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మామడ మండల కేంద్రంలోని రేషన్ షాపును కలెక్టర్ బుధవారం సందర్శించి, లబ్దిదారులకు స్వయంగా సన్న బియ్యం పంపిణీ చేశారు. రేషన్ దుకాణానికి కేటాయించిన సన్న బియ్యం నాణ్యతను పరిశీలించి, రేషన్ యజమానులకు పలు సూచనలు సలహాలు చేశారు.

April 2, 2025 / 02:28 PM IST

‘సన్న బియ్యం పథకం పేదల గుండెల్లో నిలిచిపోతుంది’

KNR: సన్న బియ్యం పథకం పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బుధవారం రామడుగు మండలం వేదిర గ్రామంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి సన్న బియ్యం ఉచిత పంపిణి ప్రారంభించారు. దేశ చరిత్రలో సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మకంగా చేపట్టారన్నారు.

April 2, 2025 / 02:20 PM IST

పాపన్న వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

JN: సర్దార్‌ సర్వాయి పాపన్న జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సర్దార్‌ సర్వాయి పాపన్న 315వ వర్ధంతిని పురస్కరించుకుని లింగాల ఘన్‌పూర్ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన త్యాగాన్ని ఎమ్మెల్యే ప్రజలకు గుర్తు చేశారు.

April 2, 2025 / 01:42 PM IST

‘ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు సిద్ధం’

PDPL: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నారని అదనపు కలెక్టర్ &రామగుండం కార్పొరేషన్ ఇంఛార్జ్ కమిషనర్ అరుణ శ్రీ పేర్కొన్నారు. డివిజన్లలో ఉన్న సమస్యలను తీర్చేందుకు ఆన్లైన్ ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉందన్నారు. అలాగే కార్యాలయంలో ప్రత్యేక సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 14420 నెంబర్‌కి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

April 2, 2025 / 01:33 PM IST

‘రాజీవ్ యువ వికాసంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి’

ఖమ్మం: రాజీవ్ యువ వికాసం పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్‌ను టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టులు కోరారు. బుధవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందించారు. జర్నలిస్టులు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు కాబట్టి వారి ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలన్నారు.

April 2, 2025 / 01:33 PM IST

‘ఆరు గ్యారెంటీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి’

KMM: ఆరు గ్యారెంటీ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి గోపాల్ రావు అన్నారు. బుధవారం బోనకల్లో మండల కమిటీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పరిశ్రమల స్థాపన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం HUCభూములను ప్రైవేట్ తరం చేయడం సరికాదన్నారు. అనంతరం తహసీల్ధార్‌కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.

April 2, 2025 / 01:08 PM IST

ట్యాంకర్ బుకింగ్.. డెలివరీలపై ఎండీ జూమ్ మీటింగ్

HYD: టాంకర్ బుకింగ్.. డెలివరీలపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జీఎంలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. వరుసగా వచ్చిన సెలవులతో కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ బుకింగ్‌ల పెండింగ్ పెరిగినట్టు రానున్న 2 రోజులు అదనపు గంటలు పనిచేయడానికి ఏర్పాట్లు చేయాలి అధికారులను ఆదేశించారు. రెండు షిఫ్టుల్లో ట్యాంకర్ డెలివరీ చేయడానికి ఏర్పాటు చేసుకోవాలన్నారు. 

April 2, 2025 / 11:17 AM IST

మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్ట్ నియామకం

PDPL: మంథని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్టును నియమించినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన డాక్టర్ బి.సోని విధుల్లో చేరినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలో స్త్రీ వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పరిసర ప్రాంత మహిళలు సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

April 2, 2025 / 11:08 AM IST