MDK: నార్సింగి మండల కేంద్రంలో విద్యుత్ షాక్ తగిలి వంజరి నరసింహులు (35) మృతి చెందినట్లు ఎస్సై అహ్మద్ మైనుద్దీన్ తెలిపారు. కాసులబాద్ గ్రామానికి చెందిన గణేష్ వద్ద కొన్నేళ్లుగా వ్యవసాయ పనుల కోసం కూలీగా పనిచేస్తున్నాడు. వ్యవసాయ బోరుకు విద్యుత్ సరఫరా కాకపోవడంతో మరమ్మత్తు చేస్తుండగా షాక్ తగినట్లు వివరించారు.
WNP: జిల్లాలో నిర్వహించే టోపోనమి సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. సర్వే ఆఫ్ ఇండియా నోడల్ అధికారి సురేష్ కుమార్ సర్వేపై మంగళవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..ఈ సర్వే ద్వారా జిల్లాకు సంబంధించిన నైసర్గిక స్వరూపం కచ్చితత్వంతో నమోదు జరిగే విధంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
SRPT: తిరుమలగిరి మండలం మాలిపురంలో ఈనెల 14న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో సభా స్థలాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి మంగళవారం పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్న సందర్భంగా సభ స్థలాలను పరిశీలించామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు.
KMR: జిల్లాలో రోడ్డు ప్రమాదాల గణనీయమైన తగ్గుదలపై పోలీసులు చేపట్టిన కట్టుదిట్టమైన చర్యల ఫలితమని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. గత 6 నెలల్లో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పలువురికి చలాన్లు విధించామన్నారు. 75,179 మంది లైసెన్స్ లేనివారికి, 43,348 అతివేగంగా వాహనం నడిపిన వారికి, మద్యం సేవించి వాహనం నడిపినందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
KMM: ఈనెల 9న నిర్వహించే అఖిలపక్ష సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని INTUCజిల్లా అధ్యక్షుడు సీతారాములు అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలని పిలుపునిచ్చారు.
MBNR: అర్హులైన జర్నలిస్ట్లకు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాలలో కీలకపాత్ర పోషిస్తున్న జర్నలిస్ట్లకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. హెల్త్ కార్డులు, పెన్షన్స్ సౌకర్యం, రైల్వే రాయితీ, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకోవాలన్నారు.
HYD: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను MIM ఎమ్మెల్సీ మిర్జా రెహమత్ బేగ్ మంగళవారం కలిశారు. మంత్రిని ఎమ్మెల్సీ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మైనారిటీ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలకు సంబంధించి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఖమ్మం నుంచి ద్రాక్షరామం-వాడపల్లి-ద్వారకాతిరుమల పుణ్య క్షేత్రాలకు ప్రత్యేకబస్సు నడుపుతున్నట్లు ఖమ్మం RTC రీజినల్ మేనేజర్ సరీరామ్ తెలిపారు. ప్రతి శుక్రవారం ఉ.4 గంటలకు ఈ సర్వీసు ప్రారంభమవుతుందన్నారు.పెద్దలకు టికెట్ ధర రూ.850, పిల్లలకు రూ.440గా నిర్ణయించామన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనెవారు 9136446666,73828580840 సంప్రదించాలన్నరు.
SRPT: నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మంగళవారం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కోదాడ నియోజకవర్గ డాక్టర్లకు జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..వైద్యం అంటే వృత్తిగా కాకుండా, మనుషులను బతికించే మహాశక్తిగా భావించాలన్నారు. ప్రజలకు సేవలు అందిస్తున్న డాక్టర్లకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు.
WGL: వరంగల్ ట్రై పరిధిలోని వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో మొత్తం 1,687 డ్రంక్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్రావు వెల్లడించారు. ఇందులో వరంగల్ ట్రాఫిక్ పరిధిలో 586 కేసులు నమోదు కాగా హనుమకొండ 537 కేసులు, అలాగే కాజీపేట ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో 564 కేసులు నమోదయ్యాయని చెప్పారు.
MBNR: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి చెందిన నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీరుగా చక్రధరం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆధికారులు, సిబ్బంది ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం స్వీట్లు తినిపిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు. ప్రాజెక్టు పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చక్రధరం తెలిపారు.
NRML: సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని మండల పోలీసులు సూచించారు. మంగళవారం స్థానిక బస్టాండ్ సమీపంలో మహిళలకు సైబర్ నేరాలు,చైన్ స్నాచింగ్ తదితర విషయాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పవద్దని, అనవసర లింకులు ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.
NZB: జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన రజక సంఘం సభ్యులు నేడు NZB రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. తమ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. అలాగే పూర్తయిన సంఘ భవనాన్ని కూడా ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ అధ్యక్షుడు విద్యాసాగర్, ఉపాధ్యక్షుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
NRPT: కోసం సందేహాల నివృత్తి చేసేందుకు ఈనెల 3న కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో ఫోన్ఇన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. ఫోన్ఇన్ కార్యక్రమం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని పేర్కొన్నారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9848848802, 8096907524, 9949931066