JGL: శక్తివంతమైన, ద్రుడమైన భారత నిర్మాణానికి కృషి చేయాలని RSS జిల్లా కార్యవాహ గొల్కొండ నాగరాజు అన్నారు. రాయికల్ పట్టణంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ ఉగాది ఉత్సవానికి ఆయన హాజరయ్యారు. హిందూ పండుగలు ఖగోళ శాస్త్రం, ప్రకృతి మార్పులు, ధర్మం, అధర్మంపై సాధించిన విజయానికి ప్రతీకలని అన్నారు. జాతీయ సమైక్యత, విశ్వగురు భారత్ RSS ధ్యేయమని అయన పేర్కొన్నారు.
VKB: బొమ్మరాస్పేట మండలం మదన్పల్లిలో నిన్న ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. రహదారులన్నీ మంచు కురిసినట్లుగా తెల్లగా మారిపోయాయి. ఈ అకాల వర్షం వల్ల కూరగాయలు, ఇతర పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం చల్లబడినప్పటికీ, పంట నష్టం వారిని కోలుకోలేని దెబ్బ తీసింది.
HYD: ఆస్తి పన్ను పరిష్కార మేళా అన్ని GHMC సర్కిల్ కార్యాలయాల్లో ఈనెల 22న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. OTS సమస్యలు తలెత్తుతున్న వేళ, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
MNCL: జన్నారం మండలానికి నూతన ఎస్సైని నియమించాలని ప్రజలు కోరారు. ఎస్సైగా పనిచేసిన గొల్లపల్లి అనూషను రామగుండం కమిషనరేట్ వీఆర్కు బదిలీ చేశారు. ఆయన లక్షేట్టిపేట సీఐ జన్నారం పోలీస్ స్టేషన్కు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. మండలంలో ఇటీవల దొంగతనాలు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రచారం చేస్తున్నారు.
BHNG: మోత్కూర్ మున్సిపాలిటీ 6వ వార్డ్ అరేగూడెంలో సామలా రామస్వామి రెడ్డి గత 7 సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతూ మంచానికి పరిమితం కావడంతో బాధను చూడలేక వీల్ చైర్ వారికీ సహాయం చేసిన మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బద్దం నాగార్జున రెడ్డి, వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, యువకులు పాల్గొన్నారు.
KMR: డోంగ్లి మండలం లోని ఎన్ బూర గ్రామ సర్పంచ్గా ఉన్న యూనూస్ పటేల్ను TPCC వైస్ ప్రెసిడెంట్గా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్కు MLA లక్ష్మీ కాంత రావుకు, DCC మల్లికార్జున్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు
వనపర్తి జిల్లా డీసీసీ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలో (డీసీసీ) ప్రజా ప్రతినిధిగా K.రమేష్ గౌడ్ Ex ZPTC నూతనంగా ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వనపర్తి ఎమ్మెల్యే మేగా రెడ్డి, డీసీసీ అధ్యక్షులు శివసేన రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల మత సామరస్యాన్ని ప్రమోట్ చేసేందుకు ఇవాళ సాయంత్రం 6 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ముస్లింల మత పెద్దలు, ప్రముఖులు పాల్గొని భిన్న మతాల మధ్య ఐక్యతను చాటనున్నారు. మీడియా ప్రతినిధులు సాయంత్రం 5:45 గంటలకు కార్యక్రమ వేదికకు చేరుకోవాలని సూచించారు.
NLG: మిర్యాలగూడ పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. బాలవాటిక-3లో చేరేందుకు ఈ రోజు నుంచి ఏప్రిల్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రిన్సిపల్ నానిప్రసాద్ తెలిపారు. 9వ తరగతి విద్యార్థులు ఏప్రిల్ 2 నుంచి 8 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చెయ్యాన్నారు.
NZB: పసుపు రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర దక్కక కన్నీరు కారుస్తున్నారు. నెలల తరబడి సాగయ్యే ఈ పసుపు పంటను రైతు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పండిస్తే ఈ పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. మార్కెట్ మాయాజాలానికి, సిండికేటు వ్యాపారుల దెబ్బకు పసుపు రైతు దారుణంగా బలవుతున్నాడు.
WGL: జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న కీలక ప్రాజెక్టులకు బడ్జెట్లో భారీ నిధులు కేటాయించాలని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఐటీ పార్క్ అభివృద్ధి, కాకతీయ యూనివర్సిటీ విస్తరణ, మడికొండ డంపింగ్ యార్డ్ తరలింపు, కాజీపేట ఫాతిమా నగర్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
NLG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి NLG జిల్లా ప్రజలు, ముఖ్యంగా రైతులు భారీ ఆశలు పెట్టుకున్నారు. SLBC సొరంగం పనులు, డిండి ఎత్తిపోతల పథకం పూర్తికి వెయ్యి కోట్ల నిధుల కేటాయింపుపై ఎదురుచూస్తున్నారు. పెండింగ్లో ఉన్న బ్రాహ్మణ వెల్లంల, ఉదయసముద్రం ప్రాజెక్టులతో పాటు పట్టణాల్లో సమీకృత మార్కెట్లు, మిని ట్యాంక్బండ్ల నిర్మాణాలకు కూడా నిధులు వస్తాయని ఆశస్తున్నారు.
WGL: భద్రకాళి ఆలయ అర్చకుడు, వేద పండితులు సత్యమయ్యకు ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గురువారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సత్తమయ్యను శాలువతో సన్మానించారు.
MBNR: ఉగాది సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త అందించారు. తెలంగాణలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సాదాబైనామా భూసమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజుగా నిలపడం లక్ష్యమన్నారు. ఈ ప్రకటనతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పట్టాల కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
RR: యాసంగి పంట సాగుకు యూరియా బస్తాల పంపిణీ ఇవాళ ఉంటుందని కందుకూరు వ్యవసాయ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కందుకూరు మండల కేంద్రంలోని సొసైటీ ఆఫీస్ వద్ద యూరియా బస్తాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఉదయం 11 గంటలకు రైతులు యూరియా (ఫెర్టిలైజర్) ఆప్లో బుక్ చేసుకుని తర్వాత తమ పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు తీసుకుని జిరాక్స్ పత్రాలతో రావాలని సూచించారు.