• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘రాజీవ్ యువ వికాసం సద్వినియోగం చేసుకోండి’

KMR: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పల్వంచ వర్కింగ్ ప్రెసిడెంట్ మజహార్ షరీఫ్ గురువారం సూచించారు. ఏప్రిల్ 14 వరకు రాష్ట్రంలోని యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని ఉపాధి పొందాలన్నారు.

April 3, 2025 / 04:27 PM IST

మద్యం, డ్రగ్స్ మత్తులోనే అఘాయిత్యాలు

NGKL: జిల్లాలో ఏదో ఒక చోట అత్యాచారం హత్యలు లాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఊర్కొండ దేవాలయం సమీపంలో వివాహితపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి కారణం మద్యం అని పోలీసులు నిర్ధారించారు. గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. మద్యం డ్రగ్స్ వల్లే జిల్లాలో రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

April 3, 2025 / 11:10 AM IST

బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి

SDR: బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 9సారి విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంబేడ్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు జగన్ ఆధ్వర్యంలో విష్ణువర్ధన్ రెడ్డిని జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం ఘనంగా సన్మానించారు. దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి, బ్యాక్వర్డ్ బీసీ సంఘాల జిల్లా అధ్యక్షుడు హనుమంతు, సురేశ్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

April 3, 2025 / 09:24 AM IST

లక్ష మల్లెలతో అమ్మవారికి అర్చన

WNL: వసంత నవరాత్రి మహోత్సవములు సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారికి లక్ష మల్లెపూలతో అర్చన చేశారు. వరంగల్‌లో భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి వసంత నవరాత్రి మహోత్సవం ఘనంగా జరుగుతున్నాయి. నాల్గో రోజు అమ్మవారికి లక్ష మల్లెపూలతో అర్చన చేశారు. మల్లెపూలతో అమ్మవారికి అర్చన చేస్తే ప్రశాంతమైన జీవితం గడుపుతారని అర్చకులు తెలిపారు.

April 3, 2025 / 07:13 AM IST

జిల్లాకు 4549 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు: కలెక్టర్

SRPT: జిల్లాలో 4549 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ తేజస్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అర్హత ఉన్నవారికి మంజూరి అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జరిగిన పనుల వివరాలు, మిగిలిన నిధులను నివేదిక ద్వారా సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

April 2, 2025 / 08:21 PM IST

సన్నబియ్యం పంపిణీని పరిశీలించిన కలెక్టర్ తేజస్

SRPT: సూర్యాపేటలో రేషన్ షాప్ నెం 14ను జిల్లా కలెక్టర్ తేజస్ పరిశీలించారు. కలెక్టర్ లబ్ధిదారులతో బియ్యం నాణ్యత బాగుందా అని అడిగి తెలుసుకున్నారు. రేషన్ షాప్ లో ఉన్న స్టాక్, బియ్యం నాణ్యత, ఈ పాస్ మిషన్‌లో జరుగుతున్న లావాదేవీలు పరిశీలించారు. రెండు రోజులలో 1.24 లక్షల మంది లబ్ధిదారులకి 2500 మెట్రిక్ టన్నుల పంపిణి చేయటం జరిగిందని పేర్కొన్నారు.

April 2, 2025 / 07:50 PM IST

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు

SRPT: రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూర్యపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం సూచించారు. సూర్యాపేట వాహన చోదకులకు రాంగ్ రూట్ ట్రాఫిక్ నిబంధనలు పలు వాటిపై ఎస్సై ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గత పది రోజుల్లో రాంగ్ ప్రయాణం చేసిన 150 మంది వాహన చోదకులకు జరిమానాలు విధించడం జరిగిందని తెలిపారు.

April 2, 2025 / 07:43 PM IST

రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తులు తేదీ పొడిగింపు

BHNG: రాజీవ్ యువ వికాస పథకం కింద దరఖాస్తు చేసుకునే ఈనెల 14 వరకు పొడగించినందున.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశంలో జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ది అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, MPDO లతో సమావేశము ఏర్పాటు చేసి రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేయుటకు సూచనలు చేశారు.

April 2, 2025 / 07:38 PM IST

మహనీయుల జయంతి ఉత్సవాల స్టిక్కర్లు ఆవిష్కరణ

BHNG: ఈనెల 5 నుంచి 14 వరకు వరకు జరిగే మహనీయులు బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గార్ల జయంతి ఉత్సవాలను సామరస్యపూర్వహక వాతావరణంలో జరుపుకోవాలని డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ అన్నారు. మహనీయుల జయంతోత్సవాల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం డీసీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉత్సవాల స్టిక్కర్లను డీసీపీ ఆవిష్కరించారు.

April 2, 2025 / 06:45 PM IST

‘ఒకే దేశం- ఒకే ఎన్నికతో దేశానికి మేలు’

SRPT: ఒకే దేశం-ఒకే ఎన్నిక కార్యక్రమంతో దేశానికి ప్రయోజనం కలుగుతుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా అన్నారు. బుధవారం తుంగతుర్తి మండలంలోని బండరామారం, సూర్యతండా, మంచ్యతండాలో ఒకే దేశం-ఒకే ఎన్నికపై నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దేశ ప్రయోజనమే ప్రధాని మోడీ లక్ష్యమన్నారు.

April 2, 2025 / 06:42 PM IST

“బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం”

MBNR: బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి కోరారు. ఏప్రిల్ 5వ తేదీన జగ్జీవన్ రామ్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కలెక్టరేట్లో బుధవారం సంబంధిత సంఘాల ప్రతినిధులు అధికారులతో సమావేశం అయ్యారు.

April 2, 2025 / 06:11 PM IST

లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLG: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా, బుధవారం నార్కట్ పల్లి పట్టణంలోని మాండ్ర రోడ్డులోని చౌకధరల దుకాణం వద్ద.. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్న బియ్యం పంపిణీ అనేది పేదలకు శుభపరిణామం అని చెప్పారు. మండల అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

April 2, 2025 / 05:46 PM IST

నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

NLG: చౌటుప్పల్ పట్టణంలో మంచినీటి సమస్యపై BJP మండల శాఖ అధ్యక్షురాలు కడారి కల్పన నాయకత్వంలో, స్థానిక మహిళలంతా ఖాళీ బిందెలతో బుధవారం రోడ్డెక్కారు. పట్టణంలోని మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి నిరసనలో పాల్గొన్నారు.

April 2, 2025 / 05:27 PM IST

రెవెన్యూలో కామారెడ్డి ఆర్టీఏ స్టేట్‌ టాప్‌

KMR: రెవెన్యూ వసూళ్లలో కామారెడ్డి ఆర్టీఏ రాష్ట్రంలోనే టాప్‌లో నిలిచింది. ఈ మేరకు డీటీవో శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి సంబురాలు జరుపుకున్నారు. గతేడాది లక్ష్యం రూ.63 కోట్లు ఉండగా, ఈసారి రూ.73 కోట్ల లక్ష్యానికిగాను రూ. 68.19కోట్లు (92.4 %) వసూలు చేసినట్లు పేర్కొన్నారు.

April 2, 2025 / 05:08 PM IST

పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డ్‌లను, సిబ్బంది నిర్వహిస్తున్న విదులను పరిశీలించారు. వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదు దారునితో సిబ్బంది గౌరవంగా మెలగాలని అన్నారు.

April 2, 2025 / 04:55 PM IST