ADB: నేరడిగొండలోని రోలుమామడ మాజీ సర్పంచ్ హర్కా యాదవరావు, పలువురు నాయకులు MLA అనిల్ జాదవ్ సమక్షంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
HNK: నక్కలగుట్టలోని NPDCL భవన్ను సోమవారం సాయంత్రం తెలంగాణ SC, ST కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలు అత్యంత పారదర్శకంగా జరగాలని, గైడ్లైన్స్ ప్రకారం బ్యాక్ లాగ్ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో CMD వరుణ్ రెడ్డి ఉన్నారు.
MNCL: కార్మిక, గనుల శాఖ మంత్రి, చెన్నూరు MLA గడ్డం వివేక్ వెంకటస్వామిని, మందమర్రి పట్టణ యూత్ యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్ సోమవారం హైదరాబాద్ సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు కిరణ్ పేర్కొన్నారు.
NZB: రుద్రూర్లో తనపై దాడి జరిగిందని పేర్కొంటూ మహిళా న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బోధన్ బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సోమవారం రుద్రూర్ పోలీస్స్టేషన్కు వచ్చారు. అయితే ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రుద్రూర్ ఎస్సైపై బోధన్ ఏసీపీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.
MDK: మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ హంసి మనోహర్ తెలిపారు. గ్రామంలో విద్యుత్ శాఖ లైన్ మెన్ తో కలిసి గ్రామంలో పర్యటించారు. విద్యుత్ సమస్యలు గుర్తించడంతోపాటు విద్యుత్ స్తంభాల ఏర్పాటు అవసరాన్ని నమోదు చేశారు. ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్, వార్డు సభ్యులు బోనాల బాబు పాల్గొన్నారు.
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నారులు వేసిన దశావతార వేషధారణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విష్ణుమూర్తి పది రూపాలను ప్రతిబింబించేలా రంగురంగుల దుస్తులతో చిన్నారులు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంతో కళకళలాడింది. చిన్నారుల ప్రతిభను చూసి భక్తులు, ఆలయ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
NLG: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వన్ టైం రిజిస్ట్రేషన్(OTR) చేసుకోవడానికి ఈనెల 25 వరకు గడువు విధించారని ఆ యొక్క గడువును మరో 10 రోజులు పొడగించాలని కోరుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో విజ్ఞప్తి చేసినట్లు బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగం గౌడ్ తెలిపారు. ప్రభుత్వం స్పందించి మరో పది రోజులు గడువు పెంచాలని కోరారు.
KMR: ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేట గ్రామంలో జరిగిన భారీ దొంగతనం కేసును ఎల్లారెడ్డి పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఇంట్లో ఇనుప పెట్టెలో దాచిన సుమారు 40 తులాల వెండి ఆభరణాలు, 6 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2.16 లక్షల నగదును దొంగిలించిన కిలాడీ దొంగల జంటను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
KNR: నాగర్ కర్నూల్లోని కొమ్మెర గ్రామంలో రజక కుటుంబానికి చెందిన ఓ పసికందు మృతికి నిరసనగా శంకరపట్నం మండల కేంద్రంలో రజక సంఘం, బీసీ సంఘాల ధర్నా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చిన్నారి మృతికి కారణమైన అగ్రకుల నాయకుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అగ్ర వర్ణాల ఆగడాలను ఖండించారు. బీసీ సంఘం, రజక సంఘం నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
WGL: సైబరాబాద్ వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో పతకాలు సాధించిన వరంగల్ కమిషనరేట్ క్రీడాకారులకు సోమవారం అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీపీ సన్ ప్రీత్ సింగ్ క్రీడాకారులను అభినందించారు. విధి నిర్వహణలో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పతకాలు సాధించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలో కూడా పతకాలు సాధించగలమన్నారు.
WNP: మంత్రి జూపల్లి కృష్ణారావు రేపు పాల్గల్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో పర్యటించనున్నారు. పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులను ఆయన కోరారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి దేవత మూర్తులకు అర్చకులు పవళింపుసేవ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథంపై పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్తో పాటు పుర ప్రముఖులు పాల్గొన్నారు.
JGL: రైతుల ఆదాయం పెంపు, ఖర్చుల తగ్గింపు, ప్రకృతి వ్యవసాయం నానో ఎరువుల వినియోగంపై సోమవారం మండలంలోని ఎల్లాపూర్ రైతు వేదికలో వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ధర్మపురి, పెగడపల్లి ఏవోలు రాజకుమార్ శ్రీకాంత్ పాల్గొని సహజ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా భూసారాన్ని మెరుగుపరచడం, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు.
SRPT: ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 99 వినతులు స్వీకరించారు. ఇందులో 48 భూ సమస్యలే ఉన్నాయని తెలిపారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
GDWL: తక్కశిల బడిలో ప్రతిరోజూ విద్యార్థుల కంచంలో పురుగులు దర్శనమిస్తున్నాయి అని పిడిఎస్.యు జిల్లా కార్యదర్శి వెంకటేష్ పేర్కొన్నారు. ఎంఈఓ పర్యవేక్షణ లోపంతోనే విద్యార్థులు ఈ నరకాన్ని అనుభవిస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారికి సోమవారం వినతిపత్రం అందజేశారు. పేద పిల్లల ఆకలిని ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు.