GDWL: తక్కశిల బడిలో ప్రతిరోజూ విద్యార్థుల కంచంలో పురుగులు దర్శనమిస్తున్నాయి అని పిడిఎస్.యు జిల్లా కార్యదర్శి వెంకటేష్ పేర్కొన్నారు. ఎంఈఓ పర్యవేక్షణ లోపంతోనే విద్యార్థులు ఈ నరకాన్ని అనుభవిస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారికి సోమవారం వినతిపత్రం అందజేశారు. పేద పిల్లల ఆకలిని ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు.