• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కందుకూరులో మొదటిసారి ఓటేసిన యువతులు

RR: మూడో విడత పంచాయతీ ఎన్నికలు సైతం ముగింపు దశకు చేరుకుంది. ఇంకాస్తా సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఓటర్లు పరుగులు తీస్తున్నారు. కాగా, మండలంలోని బేగరికంచలో యువతులు మొదటిసారిగా పంచాయతి ఎన్నికల ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొని ఓటేశారు. సర్పంచ్ ఎనికల్లో మొదటిసారిగా ఓటేయడం చాలా సంతోషంగా ఉందని, గెలిచిన సర్పంచ్ అభ్యర్థి గ్రామ అభివృద్ధి చేయాలని కోరారు.

December 17, 2025 / 12:46 PM IST

‘కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యం’

MBNR: కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి ఘనవిజయం సాధించిన కాట్రావత్ వెంకటేష్, కోర్ర రాములు బుధవారం ఎమ్మెల్యేను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలకు అండగా ఉంటామన్నారు.

December 17, 2025 / 12:45 PM IST

ఓటు హక్కు వినియోగించుకున్న శతవృద్ధుడు

SDPT: మద్దూరు మండలం లద్నూర్ గ్రామంలో బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 100 ఏళ్ల వృద్ధుడు అబ్దుల్ షమీ తన ఓటు హక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన స్వగ్రామంలో ఓటు వేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. శతవృద్ధుడి ఉత్సాహాన్ని చూసి తోటి ఓటర్లు, అధికారులు ఆశ్చర్యపోతూ అభినందనలు తెలిపారు.

December 17, 2025 / 12:45 PM IST

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

జగిత్యాలలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఎండపల్లి మండలంలోని రాజారంపల్లి, గుల్లకోట, ధర్మపురి మండలం రాయపట్నం, జైన, రాజారామ్, వెల్గటూర్ మండల కేంద్రాలలో పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్ తదితర అధికారులు ఉన్నారు.

December 17, 2025 / 12:44 PM IST

పోలింగ్ కేంద్రాలు సందర్శించిన ఎస్పీ.!

MDK: కూల్చారం, కౌడిపల్లి మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఉన్న భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు అవసరమైన సూచనలు అధికారులకు, పోలీసు సిబ్బందికి ఇచ్చారు.

December 17, 2025 / 12:44 PM IST

మెస్ ఏర్పాటు చేయాలని విద్యార్థుల ధర్నా

SDPT: హాస్టల్లో మెస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలోని ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కళాశాల విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. కళాశాల ముందే ధర్నా నిర్వహించిన విద్యార్థులు.. అడ్మిషన్ల సమయంలో ఇచ్చిన హామీని అధికారులు విస్మరించారని మండిపడ్డారు. మెస్ ఉంటుందనే నమ్మకంతోనే తాము ఇక్కడ చేరామని, ఇప్పుడు భోజన సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.

December 17, 2025 / 12:44 PM IST

‘అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తాం’

RR: చేవెళ్ల మండలం హస్తెపూర్ సర్పంచ్ జ్యోతి భూపాల్ గౌడ్‌ను చేవెళ్ల పీఏసీఎస్ ఛైర్మన్ వెంకట్ రెడ్డి, నాయకులు అభినందించారు. నాయకులు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. గ్రామస్తులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సర్పంచ్‌కు మద్దతు తెలుపుతూ అభివృద్ధిలో పాలుపంచుకుంటామన్నారు.

December 17, 2025 / 12:42 PM IST

ఆపరేషన్ సిందూర్ చిత్రాలు తిలకించిన ఎంపీ

MDK: కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సహాయ మంత్రి సంజయ్ సేథీను మెదక్ ఎంపీ రఘునందన్ రావు బుధవారం దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంతో జార్ఖండ్ విద్యార్థులు గీసిన చిత్రకళా ప్రదర్శనను ఆయన తిలకించారు. విద్యార్థుల సృజనాత్మకత, వారిలో తొణికిసలాడుతున్న దేశభక్తిని చూసి గర్వంగా ఉందన్నారు.

December 17, 2025 / 12:39 PM IST

ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా అధ్యక్షురాలు

BHPL: భూపాలపల్లి జిల్లా BRS అధ్యక్షురాలు, WGL మాజీ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి ఇవాళ మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోవిందపురం గ్రామంలోని పోలింగ్ స్టేషన్లో ఆమె ఓటు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ముఖ్యమని, అర్హులందరూ తప్పకుండా ఓటు వేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో BRS నేతలు ఉన్నారు.

December 17, 2025 / 12:38 PM IST

ప్రశాంతంగా పోలింగ్.. కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

SRPT: మూడో విడత పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. బుధవారం పాలకీడు, కోమటికుంట, కల్మెట్ తండా, రాఘవాపురం పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాలకీడులో 56.69 శాతం, కోమటికుంటలో 73 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.

December 17, 2025 / 12:36 PM IST

ఎల్లారెడ్డిపేటలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ

SRCL: మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపుర్, రాచర్ల గొల్లపల్లి, రాచర్ల బొప్పపూర్, గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, ఎస్పీ మహేష్ బీ గితే సందర్శించారు. ఆయా గ్రామాలలో పోలింగ్ జరుగుతున్న తిరును పరిశీలించారు. విధులలో ఉన్న సిబ్బందికి భద్రత పరమైన పలు సూచనలు చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

December 17, 2025 / 12:35 PM IST

సమయం లేదు మిత్రమా.. ఓటేద్దాం పదండి!

KMR: జిల్లాల్లో GP ఎన్నికల పోలింగ్ అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే, పోలింగ్ సమయం ముగింపు దశకు చేరుకుంది. మరో 30 నిమిషాల్లో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. సమయం ముగియగానే పోలింగ్ కేంద్రాల గేట్లు మూసివేయనున్నారు. ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉంది.

December 17, 2025 / 12:34 PM IST

పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన.. అదనపు కలెక్టర్

BHPL: మల్హర్రావు మండలం తాడిచర్ల గ్రామంలో జరుగుతున్న మూడో విడత GP ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఇవాళ మధ్యాహ్నం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఓటింగ్ సాఫీగా సాగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధితులకు సూచించారు.

December 17, 2025 / 12:33 PM IST

16వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు

NGKL: చారకొండ మండలం ఎర్రవల్లి-గోకారం రిజర్వాయర్ నిర్వాసితుల నిరసనలు ఉద్ధృతమవుతున్నాయి. తమ ఇళ్లు, భూములు ముంపునకు గురికాకుండా రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా గ్రామస్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 16వ రోజుకు చేరాయి. పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

December 17, 2025 / 12:32 PM IST

‘ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి’

KMM: ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కూసుమంచిలోని తన క్యాంప్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఆయన శాలువాలతో ఘనంగా సత్కరించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు భారీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.

December 17, 2025 / 12:25 PM IST