• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న, ఎమ్మెల్యే మదన్ మోహన్

KMR: ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఈద్గాలో ముస్లిం మత పెద్దలను, ముస్లిం సోదరులను కలిసిను ఎమ్మెల్యే మదన్ మోహన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు వారి నివాసాలకు వెళ్లి ఆతిథ్యం స్వీకరించడం జరిగింది. రంజాన్ వేడుకలలో ముస్లిం సోదరులతో ఈద్గా కిక్కిరిసిపోయింది. అనంతరం ఒకరినొకరు ఆలింగనం తీసుకొని శుభాకాంక్షలు తెలిపారు.

March 31, 2025 / 01:37 PM IST

చిట్యాలలో రోడ్డు ప్రమాదం

NLG: చిట్యాల పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మునుగోడు మండలం చోల్లేడు గ్రామానికి చెందిన పరమేశ చిట్యాలలోని మార్కెట్ నుంచి దోసకాయల బస్తాలు తీసుకొని బైక్‌పై పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డు దాటుతున్నాడు. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి నార్కెట్ పల్లి వైపు వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది.

March 31, 2025 / 01:36 PM IST

నిరుపేద ముస్లింలకు నిత్యావసర సరుకులు అందజేత

KMR: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామం 12వ వార్డులో రంజాన్ పండుగను పురస్కరించుకుని సోమవారం సుమారు 20మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు మాజీ కౌన్సిలర్ కాసర్ల గోదావరి స్వామి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దోల్ల శశిధర్ రావు, నీలం రాజలింగం, ద్యావరి నరేష్, బాలస్వామి, భాను, గణేష్, చిన్న నరేష్ తదితరులు పాల్గొన్నారు.

March 31, 2025 / 01:23 PM IST

‘HCU భూముల వేలాన్ని వెంటనే ఆపాలి’

MNCL: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్న ఆందోళనను విచ్చిన్నం చేసి అక్రమ అరెస్టులు చేయడం హేయమైన చర్య అని AIFDS రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ అన్నారు. సోమవారం బెల్లంపల్లిలో మాట్లాడుతూ.. అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను తక్షణమే విడుదల చేయాలన్నారు. HCU భూముల వేలాన్ని వెంటనే ఆపాలన్నారు.

March 31, 2025 / 01:04 PM IST

నెమలిని అప్పగించిన పోలీసులు

PDPL: ఓదెల మండలంలోని జీలకుంట గ్రామంలో నెమలి ప్రవేశించగా గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న బ్లూ కోర్ట్స్ పోలీసులు శంకర్, రామకృష్ణ నెమలిని స్వాధీనం చేసుకొని వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్టు ఆఫీసర్ తిరుపతి ఆదివారం రాత్రి నెమలిని స్వాధీనం చేసుకున్నారు.

March 31, 2025 / 11:11 AM IST

కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు

SRPT: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మరియు సభను హుజూర్‌నగర్‌లో  విజయవంతం చేసిన హుజూర్‌నగర్ కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సోమవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. హుజూర్‌నగర్ కోదాడ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు.

March 31, 2025 / 08:09 AM IST

సాటాపూర్ గేట్ వద్ద వడ్ల లారీ బోల్తా

NZB: ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద ఆదివారం రాత్రి వడ్ల లారీ బోల్తా పడింది. ఎడపల్లి వైపు వెళ్తున్న ధాన్యం లారీ పెట్రోల్ బంక్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న వరి ధాన్యం బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను డైవర్ట్ చేశారు.

March 31, 2025 / 07:39 AM IST

జర్నలిస్టుల సమస్యల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి

NLG: జర్నలిస్టులు తమ సమస్యల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలని TUWJ(IJU) జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న అన్నారు. ఉగాదిని పురస్కరించుకొని ఆ సంఘ నాయకులు ఆదివారం చండూరులో వెంకన్నను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పంచాంగం అందజేశారు. ఈ జర్నలిస్టుల సంక్షేమానికి అంత ఐక్యమత్యంగా పనిచేయాలని నిర్ణయించారు.

March 31, 2025 / 06:57 AM IST

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మేయర్

HNK: ముస్లిం సహోదరులకు గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఈద్-ఉల్-ఫితర్(రంజాన్) పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దాతృత్వం, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసమని, ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదిన వేడుకలను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో సంతోషంగా జరుపుకోవాలన్నారు.

March 30, 2025 / 07:27 PM IST

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వరంగల్ పోలీస్ కమిషనర్

WGL: రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లీం సోదరులంతా తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల నడుమ రంజాన్ జరుపుకోవాలని అన్నారు. రంజాన్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలను కలగాలని సీపీ ఆకాంక్షించారు.

March 30, 2025 / 07:19 PM IST

నగర ప్రజలకు కమిషనర్ సూచనలు

WGL: LRS 25% రిబెట్ సువర్ణ అవకాశం కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని GWMC కమిషనర్ ఆశ్విని తానాజీ వాఖడే ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31న సెలవు ఉన్నప్పటికీ బల్దియా పరిధిలో ఏర్పాటు చేసిన 10LRS హెల్ప్ డెస్క్లు పనిచేస్తాయని, 25% రిబేట్ 31న సోమవారం వరకు పని చేస్తాయని ఆమె పేర్కొన్నారు.

March 30, 2025 / 07:07 PM IST

‘లక్ష్యానికి మించిన బ్యాంకు లింకేజీ రుణాలు అందజేశాం’

MNCL: మండల సమైక్య ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో లక్ష్యానికి మించిన బ్యాంకు లింకేజీ రుణాలు అందజేశామని APM విజయలక్ష్మి అన్నారు. ఆదివారం నెన్నెల మండల IKP కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. రూ 24.32 కోట్ల లక్ష్యం కాగా రూ.27.69 కోట్లు అందజేశామన్నారు. రుణాలు సక్రమంగా తిరిగి చెల్లించిన 471 సంఘాలకు రూ.62.98లక్షల వడ్డీమాఫీ వారి ఖాతాల్లో జమ చేశామన్నారు.

March 30, 2025 / 05:15 PM IST

షబ్బీర్ అలీని కలిసిన కాంగ్రెస్ నాయకులు

KMR: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి పలువురు నాయకులు ఉన్నారు.

March 30, 2025 / 05:12 PM IST

‘రంజాన్ వేడుకలను సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలి’

NRML: ముస్లిం సోదరులు రంజాన్ పండుగను సంతోషంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద నిర్వహించే ప్రార్థనా స్థలాన్ని సీఐ ప్రవీణ్ కుమార్, నూతన అడహాక్ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. పోలీస్ శాఖ తరపున ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు.

March 30, 2025 / 05:10 PM IST

‘కాంగ్రెస్ పార్టీతోనే గిరిజన గ్రామాల అభివృద్ధి’

ADB: బోథ్ మండల పరిధిలోని అందూర్ గ్రామపంచాయతీలో నారాయణపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ.7 లక్షల సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే గిరిజన గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు.

March 30, 2025 / 04:43 PM IST