• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలి’

కామారెడ్డి జిల్లాలోని అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 141 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజావాణిలో అందిన దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అధికారులు జవాబుదారీగా విధులు నిర్వర్తించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.

June 30, 2025 / 08:18 PM IST

పదవి విరమణ పొందిన పలువురు ఆలయ ఉద్యోగులు

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులు సోమవారం పదవి విరమణ పొందారు. తాండ్ర రాజయ్య- మణెమ్మ, పిట్టల భద్రమ్మ, కుమ్మరి భూదమ్మలు పదవీవిరమణ పొందారు. వీరికి ఆలయ ఉద్యోగులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.

June 30, 2025 / 08:09 PM IST

ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుంది: BRS

KNR: బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ నల్లబాలు అరెస్టును కరీంనగర్ BRS నేతలు సోమవారం ఖండించారు. కరీంనగర్ సైబర్ క్రైమ్ తీసుకు వెళ్లిన ఆయన్ను జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్లు ఏనుగు రవీందర్ రెడ్డి, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ కలిసేందుకు ప్రయత్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టు చేయడం ఏమిటని మండిపడ్డారు.

June 30, 2025 / 07:57 PM IST

జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ Xl ప్రారంభం

NLG: జూలై 1నుంచి 31వరకు బాల కార్మిక నిర్మూలన కోసం SP శరత్ చంద్ర సూచనలతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. చిన్నపిల్లలతో వెట్టి చాకిరి చేపిస్తే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని, బాల కార్మికుల కనిపిస్తే వెంటనే 1098 లేదా డయల్ 100కు చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జీ. రమేష్, చైల్డ్ వెల్ఫేర్ ఛైర్మన్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

June 30, 2025 / 07:33 PM IST

పోలీస్ ప్రజావాణికి 28 ఫిర్యాదులు

NZB: నగరంలో పోలీస్​శాఖ ఆధ్వర్యంలో సీపీ కార్యాలయంల ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. సీపీ సాయిచైతన్య ఈ సందర్భంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని చట్టపరంగా వాటికి పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడారు.

June 30, 2025 / 07:31 PM IST

‘మిషన్ పొందిన విద్యార్థులు హాజరు కావాలి’

NLG: దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన కళాశాల అల్మనక్‌ను సోమవారం ప్రిన్సిపల్ డా. రమావత్ రవి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడ్మిషన్ పొందిన ప్రథమ సంవత్సర విద్యార్థులు తమ తమ తరగతులకు హాజరు కావాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ జీ. కోటయ్య తదితరులున్నారు.

June 30, 2025 / 06:44 PM IST

రంజిత్ సింగ్‌కు అప్రిసియేషన్ అవార్డు

NZB: రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ మాజీ అధ్యక్షుడు రంజిత్ సింగ్ ఠాకూర్ అప్రిసియేషన్ అవార్డు అందుకున్నారు. ఈ సంవత్సరం క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు అత్యధిక ఫండ్ సమకూర్చిన రంజిత్ సింగ్‌ను పలువురు ప్రశంసించారు. 2025 సంవత్సరానికి హైదరాబాద్‌లో జరిగిన అవార్డ్స్ నైట్లో డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి అవార్డును అందజేశారు.

June 30, 2025 / 06:34 PM IST

కంజర్ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

NZB: మోపాల్ మండలం కంజర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో చేపట్టిన పనుల గురించి ప్రధానోపాధ్యాయుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూ. 11. 20 లక్షల నిధులు మంజూరు కాగా, తాగునీటి వసతి, విద్యుత్, ఫ్లోరింగ్ తదితర ప్రతిపాదిత పనులన్నీ పూర్తి అయ్యాయని హెచ్.ఎం గోపాలచారి తెలిపారు.

June 30, 2025 / 06:18 PM IST

బహిరంగ సభను విజయవంతం చేయండి: ఎమ్మెల్యేలు

HNK: జూలై 4న ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ కాంగ్రెస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించబోయే ఆత్మీయ సమావేశానికి కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కష్టపడ్డ కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు.

June 30, 2025 / 05:22 PM IST

‘భూ కబ్జాదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి’

MHBD: గార్ల మండలం పెద్ద చెరువు కబ్జా చేసిన భూ కబ్జాదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోని అక్రమంగా పట్టాలు చేయించుకున్న పట్టాలను రద్దు చేయాలని సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీఆర్ఎస్, టీడీపీ నాయకులు సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని రైతుల భూములను కాపాడాలని కోరారు.

June 30, 2025 / 05:18 PM IST

గ్రీవెన్స్ దరఖాస్తులను పరిశీలించాలి: కలెక్టర్

MHBD: ప్రజలు తమ సమస్యలకై ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో నేడు నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. 148 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

June 30, 2025 / 04:43 PM IST

జిల్లాలో వర్షపాత వివరాలు..

MBNR: గడిచిన 24 గంటల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా బాలానగర్ మండలం ఉడిత్యాలలో 12.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నవాబుపేటలో 6.8, హన్వాడ 5.5, కౌకుంట్ల 4.8, మహమ్మదాబాద్ 3.5, గండీడ్ 3.0, అడ్డాకుల, రాజాపూర్‌లో 1.5 మిల్లీమీటర్లు నమోదైనట్లు వాతావరణ శాఖ వెళ్లడించింది.

June 30, 2025 / 02:25 PM IST

‘మన ఊరు- మన బాధ్యత’ పోస్టర్లు

KNR: పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో నుంచి ‘మన ఊరు-మన బాధ్యత’ పేరుతో మత్తుపదార్థాలు, ఆన్‌లైన్ బెట్టింగ్‌పై అవగాహన కార్యక్రమాలు మంగళవారం నుంచి నిర్వహిస్తున్నారు. చెడువ్యసనాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ చర్యల్లో భాగంగా ప్రత్యేక పోస్టర్లను సోమవారం ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తున్నారు.

June 30, 2025 / 01:31 PM IST

MH ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన సోయం బాపురావు

ADB: మహారాష్ట్ర రాజ్యసభ ఎంపీ అనిల్ బొండేను జిల్లా మాజీ ఎంపీ సోయం బాపురావు సోమవారం నాగ్ పూర్‌లో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని పంచుకోవడం జరిగింది. అనిల్ బొండే యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రస్తుత రాజకీయాలను ఆయనతో చర్చించినట్లు బాపూరావు పేర్కొన్నారు.

June 30, 2025 / 11:25 AM IST

జాతీయ స్థాయి హాకీ పోటీలకు జిల్లా విద్యార్థిని

నిజామాబాద్: జాతీయ స్థాయి హాకీ పోటీలకు సిరికొండ మండలం తూంపల్లి క్రీడాకారిణీ జశ్విత ఎంపికయ్యారు. తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 25 నుంచి 30 వరకు నిర్వహించిన క్యాంపులో జశ్విత ప్రతిభ కనబరిచిందని పీడీ సడక్ నగేశ్ తెలిపారు. కాగా ఈ జాతీయ స్థాయి పోటీలు జులై 3 నుంచి 8వరకు జార్ఖండ్‌లో జరగనున్నాయని ఆయన వెల్లడించారు.

June 30, 2025 / 11:23 AM IST