KMR: ఉగాది పండుగను కామారెడ్డి జిల్లాలో రైతన్నలు ప్రత్యేకంగా చేసుకుంటారు. ఉగాది తెలుగు నూతన సంవత్సరం కావడంతో రైతులు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది రోజు వేకువజామునే పంట పొలానికి ఎరువును, పసుపు కుంకుమ, టెంకాయతో పాటు పూజ సామగ్రి తీసుకుని వెళ్తారు. పంట భూమిలో తూర్పు దిక్కున ఎరువును ఐదు కుప్పలుగా ఉంచి పూజలు చేస్తారు.
KMR: ఉగాది పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉగాది, రంజాన్ సందర్భంగా వీక్లీ మార్కెట్లో ప్రజలు కిక్కిరిసారు. పచ్చడి తయారు చేసుకునేందుకు కుండలు, మామిడి కాయలు, వేప పువ్వు, కొబ్బరికాయలు, మామిడాకుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రంజాన్ సందర్భంగా వివిధ రకాల పండ్లు జోరుగా అమ్ముతున్నారు. పలు దుకాణాల్లో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
PDPL: రామగుండం కార్పొరేషన్ 30వ డివిజన్లోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. రంజాన్ పర్వదినం పురస్కరించుకుని ఎరువుల కర్మాగారం కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు నెలకంటి రాము ఆధ్వర్యంలో ముస్లిం కుటుంబాలకు కానుకలను పంపిణీ చేశారు. MLAరాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ ఆదేశాల మేరకు పంపిణీ చేశామన్నారు.
PDPL: న్యాయవాది ఇజ్రాయిల్ దారుణ హత్య ఘటనపై గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ప్రారంభించారు. ఈరోజుతో నిరసన దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. న్యాయవాదులు గొర్రె రమేష్, శైలజ, తిరుపతి రావు, కిషన్ రావు, మురళి, దాట్ల కిరణ్, కుషాన, రజిత పాల్గొన్నారు. వీరికి HMS నాయకులు జక్కుల నారాయణ, సంతోష్, నాన గౌడ్ పలువురు మద్దతు ఇచ్చారు.
కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గంలోని నీటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలని MLA కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం మిషన్ భగీరథ అధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి సమస్య పరిష్కరించాలన్నారు. నియోజకవర్గాల్లోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాలలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
KNR: దేశంలో మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయాలు చేస్తుందని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. వీణవంకలో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సన్నాహక సమావేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
JGL: జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పూడికతీత పనులు చేపడుతుండగా ఉపాధి హామీ కూలీ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ కుంట లక్ష్మినర్సు అనే మహిళ గ్రామ శివారులోని కాల్వ పూడికతీత పనులు చేపడుతుండగా ఉన్నట్టుండి కుప్పకూలి అక్కడిక్కడే మృతిచెందింది. మృతురాలి భర్త గత కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు.
JN: జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రజల జీవితాలు ఉగాది పచ్చడిలా షడ్రుచులతో నిండాలని, అందరూ కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
JN: జనగామ జిల్లాలో డా.బాబు జగ్జీవన్ రామ్, డా.బి.ఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ సంఘాలు, నాయకుల వద్ద నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు.
MHBD: కూరవి మండల కేంద్రంలో తక్షణమే ప్రభుత్వ జూనియర్ కలశాలను ఏర్పాటు చెయ్యాలని శనివారం PDSU,LSO జిల్లా నాయకులు బాణోతు దేవేందర్, గుగులోతూ శివ వర్మ తహసీల్దార్ సునీల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
హైద్రాబాద్: మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్.అమరేందర్ రెడ్డి రెండో సారి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా బాపిరెడ్డి, జాయింట్ సెక్రటరీగా పీవీ ధనలక్ష్మీ ఎన్నికయ్యారు. తనపై విశ్వాసంతో రెండోసారి అధ్యక్షుడిగా గెలిపించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సమస్యలపై నిరంతర పోరాటం చేసి అందుబాటులో ఉంటానన్నారు.
SDPT: విశ్వావసు నామ ఉగాది పండగ సందర్భంగా శాలివాహన కుమ్మరి సంఘం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులకు, ఇతర ముఖ్య నేతలకు ఉగాది పండగ ఉపయోగపడే కుండ మట్టి పాత్రలను పంపిణీ చేసిన బీసీ సంక్షేమ. ఇందులో మట్టి కుండా, మట్టి వాటర్ బాటిల్, జగ్,కప్స్,మట్టి పాత్రలు ఉన్నాయి.
SDR: నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని మెయిన్ రోడ్ సమీపంలో మురికి కాలువ కల్వర్టును, సీసీ రోడ్ల నిర్మాణ పనులను శనివారం మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ దారం శంకర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి సహకారంతో ప్రజలకు అందుబాటులో ఉండి పనులు చేపడుతున్నామని తెలిపారు.
ADB: బోథ్ మండలంలోని బాబేర గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను శనివారం ఎంపీడీఓ రమేశ్ పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న చెరువు నిర్మాణ పనుల కొలతలు తీసుకున్నారు. రోజువారి కూలీల హాజరును పరిశీలించారు. భూగర్భజలాల నిలువ కోసం చేపట్టవలసిన పనుల గురించి వివరించారు. కూలీల చేస్తున్న హార్డ్ వర్క్ చూసి ప్రోత్సహించడానికి స్వీట్స్ పంచిపెట్టారు.
ADB: బజార్ హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన తంగడిపల్లి గంగాధర్ గారికి మంజూరు అయిన రూ. 42 వేల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఆయన నివాసంలో శనివారం అందజేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం అయిన పత్రాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమర్పించి సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందాలని ప్రజలకు అనిల్ జాదవ్ సూచించారు.