BHNG: మోత్కూరు మున్సిపాలిటీ సాయినగర్ కాలనీకి చెందిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు గొప్ప మనస్సు చాటుకున్నారు. కాలనీకి చెందిన మధు(భాష ) ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. కాలనికి చెందిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు తలో రూపాయి కూడబెట్టి, 9,001 రూపాయలు, 50 కేజీల బియ్యంను బాధిత కుటుంబనికి అందించారు.
NRML: తునికాకు సేకరణకు టెండర్లు పిలవాలని టీఏజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శంభు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఏటా డిసెంబర్ జనవరి నుంచి సేకరణ ప్రత్యేక సంబంధించి పనులను అటవీశాఖ మొదలు పెట్టేదని, ఈ ఏడాది మాత్రం ఆ ప్రక్రియ నత్తనడకను తలపిస్తున్నదని అన్నారు. టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తిచేసి గిరిజన పేదలకు ఉపాధి కల్పించాలన్నారు.
SRPT: పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని సీపీఐ పార్టీ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కటైన రుణమాఫీ నేటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు.
NRML: జిల్లాలోని 19 మండలాలలో ఎంపికైన 256 మందికి సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ రుణాల సబ్సిడీని వెంటనే మంజూరు చేయాలని సీపీఎమ్ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ అన్నారు. శుక్రవారం వారు మాట్లాడుతూ బ్యాంకు మేనేజర్ ద్వారా ఎంపిక చేసిన 2020-21 సంవత్సరానికి సంబంధించి లబ్ధిదారులకు సంబంధించి సబ్సిడీ రుణాలను ఇప్పటివరకు మంజూరు చేయలేదని వాపోయారు
KMM: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే బీసీల ఎదుగుదలకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండి కొట్టే విధంగా, రాజకీయంగా అణిచివేసే విదంగా ఉన్నదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసి వినతిపత్రం అందజేశారు.
KMM: జిల్లాలో మామిడి సాగును 32,105 ఎకరాలలో సాగుచేస్తున్నారని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి యం.వి. మధుసూదన్ తెలిపారు. ప్రస్తుతం మామిడి పూత నుంచి పిందె దశలో ఉన్నందున రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిక్కుడు పురుగు, తేనె మంచు పురుగు, తామర, బూడిద రోగం, పక్షి కన్ను తెగులు వంటి నివారణకు సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు.
KMM: కూసుమంచి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం జిల్లా వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు. మండల వైద్యాధికారిపై ఆర్థిక ఆరోపణల నేపథ్యంలో విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా గత సంవత్సరం పల్స్ పోలియో నిధులు పల్లెదావఖాన నిధుల అక్రమ వినియోగంపై విచారణ జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
SRPT: చేరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అగ్నిగుండంపై నడిచారు. వారు సమర్పించిన కట్నాలు రూ.1,03,350, హుండీ ఆదాయం రూ.60,580 వచ్చినట్లు ఆలయ ఈవో నవీన్ కుమార్ తెలిపారు.
KMM: నగరపాలక సంస్థ కార్యాలయం ఇంజనీరింగ్ విభాగంలో డీబీ సెక్షన్కు సంబంధించి కొన్ని ఫైళ్లు కనిపించడం లేదని ఇటీవల గుర్తించారు. ఓ వర్క్ ఇన్స్పెక్టర్ ఫైళ్లను బయటకు తెప్పించినట్లు తెలియగా, అందుకు అటెండర్ రాజేశ్వరిని అధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం. అలాగే, వర్క్ ఇన్స్పెక్టర్ పై చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది.
NLG: ఎమ్మెల్సీ నామినేషన్లకు ఈ నెల 7, 10వ తేదీల్లోనే అవకాశం ఉండటంతో ఈ 2 రోజుల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు ప్రధాన సంఘాల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. శుక్రవారం TSUTF తరఫు ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలుగుబెల్లి నర్సిరెడ్డి, అలాగే TPUS అభ్యర్థి సరోత్తం రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి కూడా నామినేషన్లు సమర్పించనున్నారు.
SRCL: మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు చంపుతానని బెదిరించిన బోయినపల్లికి చెందిన రాజుకు జడ్జి ఏడాది జైలు శిక్ష, రూ. 7వేలు జరిమానా విధించినట్లు SI పృథ్వీధర్ గౌడ్ గురువారం తెలిపారు. గ్రామానికి చెందిన స్వప్న తనపై రాజు అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు ఆమెను, ఆమె కుటుంబసభ్యులను చంపుతానని బెదిరించినట్లు 2016, జనవరి 4న పోలీసులకు ఫిర్యాదు చేసింది.
SRPT: హుజూర్ నగర్లోని శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబు కానున్నది. శనివారం నుంచి నాలుగు రోజులపాటు అధ్యయనోత్సవాలు, 11వ తేదీ నుంచి వారం రోజులు వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా కొనసాగనున్నాయి. వేడుకలను సాంప్రదాయబద్ధంగా, ఘనంగా జరిపేందుకు సన్నాహాలు పూర్తి చేశామని ఈవో గుజ్జుల కొండారెడ్డి తెలిపారు.
MDK: మెదక్ నుంచి మిర్జాపల్లి రైల్వే స్టేషన్ వరకు కొత్త రైల్వే లైన్ను మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యులు కె.ఆర్.సురేష్ రెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మొత్తం ఖర్చు ప్రాజెక్టులో 50 శాతం భరించిన విషయాన్ని గుర్తు చేశారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి లేఖ రాసినట్లు తెలిపారు.
SRPT: చేనేత వస్త్రాలను, హస్త కళారూపాలను ఆదరించి కార్మికులను ఆదుకోవాలని సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. గురువారం కోదాడలో టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రావణ్, వినోద్ కుమార్, గురుమూర్తి, పబ్బా గీత, సైదారావు, లోకేష్, వెంకటేశ్వర్లు ఉన్నారు.
BDK: బూర్గంపాడు మండలం గొమ్మూరు ఇసుక ర్యాంపు సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్రలతో వెళుతున్న ట్రాక్టర్ను వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి ఢీకొట్టాడని స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు అయ్యాయని తెలిపారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.