NGKL: నాగర్కర్నూల్ జిల్లాలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి వెంకట్ రాములు డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన భూ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో ఎంతో మంది రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వాటి పరిష్కారానికి అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు.
WNP: కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ ఇవ్వాలని సీపీఐ పట్టణ కార్యదర్శి రవీందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం అమారచింత మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, భాస్కర్, శ్యాం సుందర్, పలువురు పాల్గొన్నారు.
KMR: గాంధారి మండలంలోని వివిధ పెస్టిసైడ్ షాప్లలో శుక్రవారం ఎల్లారెడ్డి వ్యవసాయ శాఖ అధికారి నదీమ్, మండల వ్యవసాయ అధికారి రాజలింగం, స్థానిక ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ.. అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
MBNR: మిడ్జిల్ మండలం రాణిపేట్లో డ్రైడే-ఫ్రైడే కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ కార్యదర్శి సుదర్శన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్, అంగన్వాడీ టీచర్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
WGL: సంగెం మండలం గవిచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంను కలెక్టర్ సత్య శారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల పంట రుణాల వివరాలు తెలుసుకుని ఒక్క రైతుకు ఎన్ని బస్తాలు యూరియా ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. యూరియా బస్తాలను ఎమ్మార్పీ ధరకే విక్రయించాలి స్టాక్ ఎప్పటికప్పుడు అందుబాటులోకి ఉంచుకోవాలని సూచించారు.
BDK: ఆర్టీసీ బస్టాండ్లో పెట్రోల్ బంక్ నిర్మిస్తే సహించబోమని దమ్మపేట బస్టాండ్ సాధన కమిటీ సభ్యులు అన్నారు. పెట్రోల్ బంక్ నిర్మాణానికి వ్యతిరేకంగా నల్ల మాస్కులు ధరించి శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ఆర్టీసీ ఆదాయం కోసం దిగజారుడు పనులు చేస్తుందని విమర్శించారు. ప్రయాణీకుల కోసం బస్టాండ్ను పునరుద్ధరించాలి కోరారు.
HYD: రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు లబ్దిదారులకు 426 షాదీముబారక్, 75 కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకొని ఆర్థికంగా లబ్దిపొందాలన్నారు. పేదింటి వివాహానికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో లబ్ధిచేకూరుస్తుందన్నారు.
KMR: బిచ్కుంద మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తున్నాయని (AISB)జిల్లా అధ్యక్షుడు రవీందర్ గౌడ్, (TNSF) రాష్ట్ర నాయకుడు పుట్ట భాస్కర్ ఆరోపించారు. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. అర్హత లేని టీచర్లతో బోధన, కనీస వసతులు లేకపోవడంపై చర్యలు తీసుకోవాలని డీఈవోకు వినతిపత్రం అందజేశారు.
MDK: తూప్రాన్ డివిజన్ పరిధిలో వివాదాస్పదంగా ఉన్న రెవెన్యూ, అటవీ భూముల హద్దులను వెంటనే నిర్ధారించాలని తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి ఆదేశించారు. శుక్రవారం డివిజన్ స్థాయి రెవెన్యూ, అటవీ అధికారుల సమావేశం నిర్వహించారు. అవసరమైతే జాయింట్ సర్వే నిర్వహించి హద్దులను గుర్తించాలని పేర్కొన్నారు.
HYD: నగరంలో మెగా మాస్టర్ ప్లాన్-2050 వేగం పుంజుకుంటుందని HMDA అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిపాదించిన కామన్ మొబిలిటీ, ఎకనామికల్ డెవలప్మెంట్ బ్లూ, గ్రీన్ ఏరియా ప్లాన్ తుది దశకు చేరుకున్నాయి. మరోవైపు లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ ప్రిపేర్ చేసేందుకు కన్సల్టెన్సీ ప్రపోజల్ రిక్వెస్ట్ కోసం HMDA ప్రకటన విడుదల చేసింది. ఈనెల 18వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది.
KMR: కామారెడ్డి పరిధిలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో 100 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. డీఈవో రాజు వందో అడ్మిషన్ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు గంగా కిషన్ను, ఉపాధ్యాయ బృందం పని తీరును డీఈవో అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఆయన అన్నారు.
MBNR: మహబూబ్నగర్ పోలీసు కార్యాలయంలో శుక్రవారం మాజీ సీఎం రోశయ్య జయంతి నిర్వహించారు. ఎస్పీ జానకి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రోశయ్య పరిపాలనలో నిష్ఠ, నియమం,సేవా తత్వంతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో AR అదనపు ఎస్పీ సురేశ్ కుమార్, AO రుక్మిణిబాయి, RIలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
HNK: భద్రకాళి దేవస్థానం ఆవరణలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ పరిశీలించారు. కార్యకర్తలతో కలిసి శుక్రవారం భద్రకాళి మాతను దర్శించుకున్నారు చెరువులో జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించి క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
HNK: దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా BRS ఆఫీసులో ఆయన చిత్రపటానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు వినయ్ భాస్కర్, నేతలు నివాళులర్పించారు. పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా కొమురయ్య పోరాడి అమరుడయ్యాడని అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన మహనీయులకు గుర్తింపును ఇచ్చి, వారి జయంతులను, వర్ధంతులను అధికారికంగా నిర్వహించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ADB: అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ(ATMA) నూతన డైరెక్టర్గా నేరడిగొండ మండలం తేజపూర్ గ్రామానికి చెందిన సింగారపు స్వామి శుక్రవారం నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.