KNR: సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఈనెల 22న జరిగే రైతు ఉత్సవాలలో పాలకుర్తి మండలంలోని రైతులు పాల్గొనాలని మండల AOబండి ప్రమోద్ కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. రైతు మేళాలో వ్యవసాయ అనుబంధ విభాగాలకు చెందిన 150 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 22న CM రేవంత్ రెడ్డి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించనున్నారని అన్నారు.
NRML: సారంగాపూర్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ జాం పాఠశాలలో శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉప అటవీ క్షేత్రాధికారి మహమ్మద్ నజీర్ ఖాన్ పాల్గొని పిచ్చుకల ప్రాముఖ్యత, వాటి అంతరించడానికి కారణాలు, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్రపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ ఆర్టీసీ బస్ స్టాండ్ మలుపు వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు ఢీకొని దగుల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించడంతో అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తల్లాడ ఎస్సై ఎన్ వెంకటకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ADB: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. ఈ మేరకు బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్తో కలిసి కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందజేశారు. రైతులందరికీ రుణమాఫీ జరగలేదన్నారు. రైతు భరోసా సకాలంలో అందకపోవటంతో రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.
VKB: బొంరాస్పేట మండలంలోని వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లను శుక్రవారం ఉదయం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కొడంగల్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించనున్నారని సమాచారం వచ్చిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టబడింది. అక్రమ అరెస్టులు తమ ఉద్యమాన్ని ఆపలేవని, సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేవని ఆశా వర్కర్లు హెచ్చరించారు.
WGL: రాష్ట్ర ప్రభుత్వం తరుపున శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాను విస్మరించారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు, కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమల ఊసే లేదని, వరంగల్ నగరంలోని మురికి వాడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక బడ్జెట్లో లేదని తెలిపారు.
KMM: మధిరకి చెందిన కనకమ్మ అనే వృద్ధురాలు పోగొట్టుకున్న రూ. 25 వేల నగదును పోలీసులు ఆమెకు అందజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో సీఐ దోమల రమేష్ ఆదేశాల మేరకు బ్లూకోట్ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. శుక్రవారం టీ తాగేందుకు వెళ్లిన సమయంలో ఆమె నగదును రోడ్డుపై జారవిడుచుకుందని గుర్తించారు. నగదు తీసుకున్న వ్యక్తిని గుర్తించి అతడి నుంచి స్వాధీనం చేసుకుని వృద్థురాలకి అందజేశారు.
WNP: జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీగా శ్రీరంగాపురం మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాములు యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, కృషి గుర్తించి ఉన్నత నాయకత్వం ఈ బాధ్యతలు అప్పగించినట్లు వారు పేర్కొన్నారు.
NLG: గుడిపల్లి మండల కేంద్రంలో సంఘసంస్కర్తలు, మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ప్రతిష్టాపన కోసం శుక్రవారం “విగ్రహాల నిర్మాణ కమిటి” ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, విగ్రహాల దాతలు మాజీ సర్పంచ్ శీలం శేఖర్ రెడ్డి, ఇటికాల జగన్ మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటి డైరక్టర్ భూతం సైదులు ఉన్నారు.
NRPT: మరికల్ మండల ఎల్లిగండ్ల గ్రామంలో శుక్రవారం ఎద్దుల బండ్ల గిరిక పోటీలు సర్పంచ్ అశ్విని-నరేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మొదటి బహుమతి రూ.15,000, రెండో బహుమతి రూ.10,000, మూడో బహుమతి రూ.5,000 గా ప్రకటించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి 20 పైగా జోడెద్దుల బండ్లు పోటీపడనున్నాయి. నాయకులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సవాన్ని ఆస్వాదించారు.
BDK: గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్మానాయక్, శ్రీరామ్ నాయక్ అధ్యక్షతన శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాటోతు ఠాను నాయక్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, గిరిజన బిడ్డల ఆత్మగౌరవం కోసం పోరాడిన ధీశాలి ఠాను నాయక్ అని ఆయన కొనియాడారు.
BHPL: ఆరు గ్యారంటీలు, హామీలను అమలు చేయాలని కోరుతూ భూపాలపల్లి కలెక్టరేట్లో అధికారులకు బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ప్రజా సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
SRD: కంగ్టి మండల తహసీల్దార్గా గంగా భవాని శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన తహసీల్దార్ భాస్కర్ బదిలీపై వెళ్లడంతో ఇంచార్జ్ తహసిల్దార్గా ముగ్నీ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సాధారణ బదులు భాగంగా ఆమెను తహసీల్దార్ బదిలీ చేస్తూ అధాకారులు ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా సంప్రదించాలని కోరారు.
MBNR: మిడ్జిల్ మండలం రాణిపేటలో సర్పంచ్ మాధవి అధ్యక్షతన శుక్రవారం గ్రామపంచాయతీ సమావేశం జరిగింది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. వార్డు సభ్యులు తమ ప్రాంతాల్లోని సమస్యలను వివరించారు. ఈ సమావేశంలో కార్యదర్శి సుదర్శన్, సిబ్బంది పాల్గొన్నారు.
ADB: బేల మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. ముఖ్యంగా కాప్సి గ్రామానికి వెళ్లే దారి పూర్తిగా గుంతలమయమై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ. కోట్లు వెచ్చించినా నాణ్యత లోపంతో రోడ్లు కంకర తేలుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో ఈ గుంతల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.