• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బీసీ సాధికారిక సంఘం అధ్యక్షులు ఎన్నిక

SRCL: చందుర్తి మండల బీసీ సాధికారిత సంఘం మండల అధ్యక్షులుగా ముద్ర కోల వెంకన్న నియామకమయ్యారు. ఈ మేరకు వేములవాడలో గురువారం జరిగిన సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షులు కొండ దేవయ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్‌లు వెంకన్నకు నియామక పత్రం అందజేశారు. బీసీల హక్కుల కోసం పోరాడనున్నట్టు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకన్నకు అభినందనలు తెలిపారు.

February 6, 2025 / 01:25 PM IST

‘పనులను త్వరగా పూర్తి చేయాలి’

ASF: ఆసిఫాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన పనులను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ ఇన్‌ఛార్జి అధికారి ఇమ్మానియల్, హెచ్ఎంలతో కలసి సమీక్ష నిర్వహించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

February 6, 2025 / 09:10 AM IST

బోనస్ డబ్బులు రాక ఇబ్బంది పడుతున్న రైతులు

ADB: జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వానాకాలం సీజనుకు సంబంధించి అమ్మిన ధాన్యానికి బోనస్ డబ్బులను బ్యాంకు ఖాతాలలో వేయాలని రైతులు కోరారు. సన్న వడ్లు పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ను ఇస్తామని ప్రకటించింది. ధాన్యం అమ్మి రెండు నెలలు కావస్తున్న తమకు బోనస్ డబ్బులు రాలేదని రాంపూర్, తిమ్మాపూర్, తపాలాపూర్ గ్రామాల రైతులు వాపోయారు.

February 6, 2025 / 08:56 AM IST

మరికొన్ని మండలాల్లో ధాన్యం కొనుగోళ్లకు అనుమతి

KMM: జిల్లాలోని వైరా, బోనకల్ మండలాల్లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. గత నెల 31వ తేదీతో ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగిశాయని అధికారులు ప్రకటించారు. అయితే, వైరా, సిరిపురం, ఉప్పలమడక, బ్రాహ్మణపల్లి, గ్రామాల్లో ఇంకా ధాన్యం మిగలగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం అనుమతి జారీచేయగా ఆయా గ్రామాల్లో ఏర్పాట్లు చేశారు.

February 6, 2025 / 08:41 AM IST

దత్తాచల క్షేత్రంలో ప్రత్యేక పూజలు

SRD: మాఘమాసం మొదటి గురువారం పురస్కరించుకొని హత్నూర మండలం మధురలోని దత్త చల క్షేత్రంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దత్తాత్రేయస్వామికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు దత్త నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.

February 6, 2025 / 08:25 AM IST

భద్రాద్రి జిల్లాలో ‘టైగర్ భద్ర’ సంచారం

BDK: జిల్లాలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. పులి మూడేళ్లుగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నా కొద్దిరోజులకే జిల్లా దాటుతోంది. దీంతో 2 నెలల క్రితం వచ్చిన పులి తిరిగి వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రెండు నెలలుగా పులి జిల్లా దాటకపోవడంతో మగ పులిగా నిర్ధారించి ‘భద్ర’ అని నామకరణం చేశామని డీఎఫ్ఎ కృష్ణాగౌడ్ తెలిపారు.

February 6, 2025 / 08:04 AM IST

కుటుంబ సర్వేపై సీఐడీ విచారణ జరిపించాలి: షబ్బీర్​ అలీ

KMR: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో అవకతవకలపై సీఐడీ విచారణ చేయించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఆ లేఖలో సమగ్ర కుటుంబ సర్వే లేదా ఐహెచ్ఎస్ 2014 పేరుతో ఎస్సీ, ఎస్టీలు, బీసీలతో సహా వివిధ కుటుంబాలకు సంబంధించి తెలిపారు.

February 5, 2025 / 07:33 PM IST

జిల్లా అధ్యక్షున్ని కలిసిన మండల నాయకులు

NZB: ఇటీవల నిజామాబాద్ జిల్లా BJP జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన దినేష్ కులచారిని NZB జిల్లా కార్యాలయంలో బుధవారం ముగ్పాల్ బీజేపీ నాయకులు కలిశారు. అనంతరం ఆయను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్పాల్ మండల నాయకులు మాట్లాడుతూ.. రెండోసారి ఏకగ్రీవంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టడం హర్షనీయమన్నారు.

February 5, 2025 / 07:09 PM IST

బావిలో పడి మూడేళ్ల బాలుడు మృతి

JGL: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో బిసగోని గంగయ్య ఇంటి ఆవరణలో బుధవారం మంచినీళ్ల బావిలో పడి వేదాన్ష్(3) అనే బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన మంతెన శిరీషా-రంజిత్ దంపతుల చిన్న కుమారుడైన వేదాన్ష్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. తల్లి బాలుని ఆచూకీ కోసం గాలిస్తుండగా బావిలో శవమై తేలాడు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 5, 2025 / 06:49 PM IST

కాలేశ్వరం ఆలయంలో ఈనెల 7 నుంచి 9 వరకు మహా కుంభాభిషేకం

PDPL: కాళేశ్వరంలో ఈనెల 7 నుంచి 9 వరకు జరిగే మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు, కాలేశ్వరం ఆలయ ఉప ప్రధాన అర్చకులు ఫణింద్ర శర్మ అన్నారు. తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి వారి కరకమలములతో శతచండీ మహారుద్ర సహిత సహస్రఘటాభిషేకం నిర్వహిస్తారని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కుంభాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

February 5, 2025 / 06:49 PM IST

సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మార్వో

NZB: ముప్కాల్ మండల నూతన ఎమ్మార్వో గజానన్ను మండల రేషన్ డీలర్ల అసోసియేషన్ సంఘం సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మార్వో మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ కార్యాలయం సిబ్బంది, రేషన్ డీలర్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

February 5, 2025 / 06:29 PM IST

సుల్తానాబాద్ మండల తాహసీల్దార్‌గా రామచంద్ర రావు బాధ్యతల స్వీకరణ

PDPL: సుల్తానాబాద్ మండల నూతన తహశీసీల్దార్‌గా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు. బాధ్యతలకు ఎటువంటి ఆటంకం కలుగకుండా మండల ప్రజలు సహకరించాలని కోరారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

February 5, 2025 / 06:24 PM IST

బీజేపీ మండలాధ్యక్షుల నియామకం

కామారెడ్డి: బీజేపీ సంస్థాగత మార్పుల్లో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల అధ్యక్షులను బుధవారం నియమించారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ కామారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని 22 మండలాలకు నూతన అధ్యక్షులు నియమితులయ్యారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రకటన విడుదల చేశారు. 

February 5, 2025 / 05:58 PM IST

పాఠశాల గ్రంథాలయాన్ని సందర్శించిన ఛైర్మన్

NZB: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ రాజ రెడ్డి, తెలంగాణ విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ యాదగిరి రావు సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు ఛైర్మన్ హామి ఇచ్చారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ బి.సీతయ్యను ఇరువురు అభినందించారు.

February 5, 2025 / 03:47 PM IST

నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

NZB: నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ బుధవారం జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను సీఐ రవీందర్ నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. దొంగతనాలు జరగకుండా గ్రామాల్లో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శాంతి పద్ధతుల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు.

February 5, 2025 / 03:42 PM IST