• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అర్హులందరికీ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం: కలెక్టర్

NZB: అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. దరఖాస్తుదారులకు ఈ పథకం కింద రూ. 20,000 ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) వర్తిస్తుందని అన్నారు.

March 28, 2025 / 04:34 PM IST

మాదకద్రవ్యాలు నియంత్రించాలని ఎస్పీకి వినతి

MHBD: జిల్లాను డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ రహిత జిల్లాగా మార్చాలని లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (LSO) సభ్యులు నేడు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో LSO జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ నాయక్, మండల అధ్యక్షులు మాలోత్ రమేష్ నాయక్, సీరోల్ మండల అధ్యక్షులు జవహర్లాల్ నాయక్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

March 28, 2025 / 03:35 PM IST

ఫీజు కట్టలేదని విద్యార్థులను బయట నిలబెట్టారు

ASF: కాగజ్‌నగర్‌లోని సెయింట్ క్లారిటీ స్కూల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్కూల్ ఫీజులు చెల్లించలేదన్న కారణంగా కొందరు విద్యార్థులను తరగతులకు అనుమతించకుండా బయట నిలబెట్టడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకొని ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. ఫీజులు ఆలస్యమవ్వడం వల్ల విద్యార్థులను బయట నిలబెట్టడమేంటని వారు ప్రశ్నించారు.

March 28, 2025 / 02:28 PM IST

రాష్ట్ర అభివృద్ధి తోడ్పాటునందించాలి: ఎంపీ

MNCL: పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, ఇతర సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతితో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజాసంబంధిత అంశాలతో పాటు ఇతర కీలక విషయాలపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కేంద్రం యొక్క తోడ్పాటు అందించాలని కోరారు.

March 28, 2025 / 02:13 PM IST

ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేసిన CI

MNCL: ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా రాబోయే ఉగాది, రంజాన్ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని మందమర్రి CI శశిధర్ రెడ్డి అన్నారు. మందమర్రి పట్టణంలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముస్లిం కుటుంబాలకు సీఐ రంజాన్ తోఫా అందజేశారు. హిందూ ముస్లిం భాయి భాయి అని చాటి చెప్పే గొప్ప సాంప్రదాయం రాష్ట్రంలో నెలకొందని అయన పేర్కొన్నారు.

March 28, 2025 / 01:36 PM IST

గుడుంబా విక్రయించిన వ్యక్తి బైండోవర్

మంచిర్యాల: మందమర్రి పట్టణం దొర్ల బంగ్లా ఏరియాకి చెందిన మానుపాటి సంపత్ అనే వ్యక్తి గుడుంబా అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి అతని దగ్గర 2 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ASI శ్రీనివాస్ తెలిపారు. అతను మళ్లీ ఎలాంటి నేరం చేయకుండా సత్ప్రవర్తనతో ఉండుటకు గాను శుక్రవారం MRO ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగిందన్నారు.

March 28, 2025 / 01:26 PM IST

‘వడ్డిపై రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవాలి’

మంచిర్యాల: లక్షెట్టిపేట మున్సిపాలిటీకి బకాయి ఉన్న పన్నుల అసలుపై వేసిన వడ్డీ విషయంలో ఇచ్చే రాయితీని పట్టణ ప్రజలు, వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి కట్టని పన్నులపై వడ్డీ వేయడం జరుగుతుందన్నారు. ఆ వడ్డీ విషయంలో 90 శాతం రాయితీ పొందే అవకాశం ఉందని ఆయన వివరించారు.

March 28, 2025 / 01:25 PM IST

జీహెచ్ఎంసీ అధికారుల్లో టాక్స్ టెన్షన్

HYD: మార్చి నెల ముగియడానికి సమయం దగ్గరకు వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2వేల కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయాలని గ్రేటర్ అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు రూ.1,720 కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.280 కోట్లు కావాలి. దాదాపు 5.75 లక్షల మంది నుంచి ఈ మొత్తం వసూలు చేయాలి. ఉగాది, రంజాన్ ఎలాగైనా అనుకున్న లక్ష్యం సాధించాలని అధికారులు భావిస్తున్నారు.

March 28, 2025 / 11:20 AM IST

ఉరేసుకొని యువకుడి మృతి

MBNR: ఉరేసుకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. గురుకుల పాఠశాల సమీపంలో ఉండే మణిదీప్ (18) ఉదయం పూట పేపర్ బాయ్‌గా పని చేస్తూ.. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాడు. ఏమైందో కారణం తెలియదు కానీ.. ఈరోజు తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

March 28, 2025 / 11:19 AM IST

“ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోండి”

 MBNR: పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షుడు మల్లె పోగు శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు.హైదరాబాద్ లోని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీని రాష్ట్ర నాయకుడు యాంకీ రమేశ్ మాదిగతో కలిసి ఫిర్యాదు చేశారు.

March 28, 2025 / 11:16 AM IST

ఒంటిపై పెట్రోల్ పోసుకున్న వ్యక్తి మృతి

NLG: మిర్యాలగూడకు చెందిన గుంటోజు మధుబాబు (41) మద్యానికి బానిస అవడంతో భార్య వదిలేసింది. తరచు మద్యానికి డబ్బు అడగడంతో విసుగు చెందిన తల్లి మధుబాబుపై  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపానికి గురైన మధుబాబు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.

March 28, 2025 / 10:43 AM IST

యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఆదాయ వివరాలు ఈవో భాస్కరరావు వెల్లడించారు. గురువారం 1400 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.70,000, ప్రసాదాలు రూ.8,23,400, VIP దర్శనాలు రూ.1,35,000, బ్రేక్ దర్శనాలు రూ.96,600, కార్ పార్కింగ్ రూ.1,97,000, వ్రతాలు రూ.77,600, యాదరుషి నిలయం రూ.52,172 తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.39,62,875 ఆదాయం వచ్చిందని తెలిపారు.

March 28, 2025 / 08:18 AM IST

ప్రశ్నలు లీక్.. ఈ ప్రభావం ఏ పరీక్ష కేంద్రాల్లో లేదు

KMR: జుక్కల్ ZPHS లో గణితం ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినా విషయం తెలిసిందే. దీనిపై సబ్ కలెక్టర్ కిరణ్మయి, పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి మాల్ ప్రాక్టీస్ కేస్ గా నిర్ధారించినట్లు కామారెడ్డి జిల్లా విద్యాధికారి రాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. దీని ప్రభావం మరి ఏ పరీక్ష కేంద్రాల్లో లేదని స్పష్టం చేశారు.

March 28, 2025 / 08:04 AM IST

సెర్ఫ్ లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు

KMR: సెర్ఫ్ సంస్థ లక్ష్యసాధనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకార్యదర్శి లోకేష్ కుమార్ అన్నారు. గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, సెర్ఫ్ కార్యక్రమాలపై సెర్ఫ్ సీఈఓ డి.దివ్యతో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాసంగి మార్కెటింగ్ సీజన్లో సెర్ఫ్ ఏర్పాటు చేయబోయే ఐకేపి కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలని నిర్ణయించారు

March 28, 2025 / 07:27 AM IST

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీడిమెట్ల ఏఈ

మేడ్చల్: టీజీఎస్పీడీసీఎల్ జీడిమెట్ల డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్ ఎస్.సురేందర్ రెడ్డి రూ. 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 11 KV లైన్ షిఫ్ట్ చేయడం, కొత్త భవనానికి కేబుల్ వేయడం కోసం పని అంచనా నివేదిక అందించేందుకు ఈ లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు. పక్కా ప్లాన్ వేసిన అధికారులు డబ్బులు తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు.

March 27, 2025 / 08:17 PM IST