SDPT: జగదేవపూర్ మండల కేంద్రంలో బోళ్ల కనకమ్మ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం సర్పంచ్ పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ గుమ్మడికాయ కొట్టి ఇంటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మచ్చ గణేష్, వివిధ వార్డుల సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
BHNG: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సతీమణి శ్రీనిత శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమెతోపాటు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
MBNR: దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిని శుక్రవారం కలెక్టర్ ఖుష్భూ గుప్తా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారులకు అందుతున్న వసతులు, పెండింగ్ పనులపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ యుగంధర్ రెడ్డి, కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
WNP: నిరుద్యోగ యువత, తమ స్వయం ఉపాధిని సొంతంగా కల్పించుకుని ఇతరులకు కూడా ఉపాధిని కల్పించాలని శ్రీరంగాపూర్ మండల ఎస్సై హిమబిందు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో స్వయం ఉపాధిలో భాగంగా నాగరాజు ఫ్లెక్సీ ప్రింటింగ్ యూనిట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మద్దిలేటి, రాజేంద్రప్రసాద్, మాలిక్, అందెల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
NZB: రాష్ట్రంలో 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల కోసం నేటి రాష్ట్ర బడ్జెట్లో రూ.500 కోట్లను ప్రతిపాదించారు. ఈ నిధులతో NZB జిల్లాలోని కందకుర్తితో పాటు TGలోని బాసర, ధర్మపురి, కాలేశ్వరం, భద్రాచలం ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పించి కుంభమేళా తరహా పుష్కరాలు జరుపనున్నారు.
ASF: అగ్నివీర్ 2027 రిజిస్ట్రేషన్ ప్రారంభమైనట్లు ఎస్పీ నితికా పంత్ తెలిపారు. దీంతో జిల్లాలో అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జీడీ, మహిళా మిలిటరీ పోలీస్, క్లర్క్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయన్నారు. అభ్యర్థుల అవగాహన కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కళాశాలల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు.
HNK: నర్మెట్ట రైతు ఉత్సవాల కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాజీపేట 62వ డివిజన్ నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. కార్పొరేటర్ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. రైతు ఉత్సవాలకు హాజరైన రైతులు పంట సాగు పద్ధతులు, ఆధునిక వ్యవసాయ విధానాలు, కొత్త సాంకేతికతల గురించి తెలుసుకోవాలని, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.
SRPT: మునగాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత ప్రత్యేక వైద్య శిబిరాన్ని సర్పంచ్ ప్రమీల శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ఇవి కీలకమని సర్పంచ్ పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని మునగాల మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూచించారు.
WGL: రాయపర్తి మండల కేంద్రంలో రాజేష్ (28) అనే వ్యక్తి శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భవన నిర్మాణ కార్మికుడైన అతను ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించగా, కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
SRD: సిర్గాపూర్ మండలం అంతర్గాం, పత్యా నాయక్ తండ గ్రామాల్లో శుక్రవారం పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలను ఇచ్చినట్లు పశువైద్యాధికారి డాక్టర్ జెస్సీ క్రాంతి తెలిపారు. ఈ మేరకు పశువులకు సాధారణ వైద్యం చికిత్సలు, సీజనల్ వారీగా వ్యాపించే వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్ పాటిల్ సిబ్బంది ఉన్నారు.
SRCL: విద్యార్థులు నిత్యం శ్రద్ధగా చదవాలని, ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆకాంక్షించారు. ఇవాళ తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల& కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల, సిబ్బంది హాజరు రిజిస్టర్, కిచెన్, స్టోర్ రూం పరిశీలించారు. అనంతరం స్టోర్ రూమ్లో సరుకుల నాణ్యత తనిఖీ చేశారు.
PDPL: శాసనమండలిలో ప్రభుత్వ విప్గా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన వెంకట్ గతంలో NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా రెండుసార్లు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా విద్యార్థుల సమస్యలపై పోరాడారు. 2024లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం విప్గా నియమించబడ్డారు.
SRCL: జనాభా గణన కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లను ఉపాధ్యాయుల సీనియార్టీ ఆధారంగా నియమించాలని PRTUTS రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల కిషన్ కోరారు. ఈ మేరకు చందుర్తి మండల తహసీల్దార్కు, PRTUTS అధ్యక్షుడు పుప్పాల శ్రీనివాసచారి నాయకులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.
HYD: నగరంలో జీవన శైలి వేగంగా మారుతున్న నేపథ్యంలో స్లీపింగ్ టైం రోజురోజుకు తగ్గిపోతోందని ఉప్పల్కు చెందిన డా.సుహాసిని పేర్కొన్నారు. ఉద్యోగ ఒత్తిడి, ట్రాఫిక్, మొబైల్ వినియోగం, రాత్రి జీవనం పెరగడం వంటి కారణాలు నిద్రలేమికి దారితీస్తున్నాయని తెలిపారు. సరిపడ నిద్ర లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆరోగ్యకరమైన జీవనానికి 7-8 గంటలు నిద్రించాలన్నారు.
RR: ఐక్యత, సోదరభావంతో పండుగలు జరుపుకోవాలని యాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి సూచించారు. రంజాన్, శ్రీరామనవమి పండుగలను.. మన సంప్రదాయాలను గౌరవిస్తూ శాంతియుత, ఆహ్లాదకర వాతావరణంలో భక్తిభావంతో నిర్వహించుకోవాలని ఆయన కోరారు. శాంతిభద్రతల పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని అన్నారు. ఎవరైనా ఉత్సవాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.