• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం

JN: జనగామ జిల్లాలో డా.బాబు జగ్జీవన్ రామ్, డా.బి.ఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ సంఘాలు, నాయకుల వద్ద నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు.

March 29, 2025 / 06:13 PM IST

‘తక్షణమే ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చెయ్యాలి’

MHBD: కూరవి మండల కేంద్రంలో తక్షణమే ప్రభుత్వ జూనియర్ కలశాలను ఏర్పాటు చెయ్యాలని శనివారం PDSU,LSO జిల్లా నాయకులు బాణోతు దేవేందర్, గుగులోతూ శివ వర్మ తహసీల్దార్ సునీల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

March 29, 2025 / 05:33 PM IST

మేడ్చల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అమరేందర్ రెడ్డి

హైద్రాబాద్: మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్.అమరేందర్ రెడ్డి రెండో సారి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా బాపిరెడ్డి, జాయింట్ సెక్రటరీగా పీవీ ధనలక్ష్మీ ఎన్నికయ్యారు. తనపై విశ్వాసంతో రెండోసారి అధ్యక్షుడిగా గెలిపించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సమస్యలపై నిరంతర పోరాటం చేసి అందుబాటులో ఉంటానన్నారు.

March 29, 2025 / 01:30 PM IST

‘మట్టి పాత్రలు వాడండి ఆరోగ్యాన్ని రక్షించుకోండి’

SDPT: విశ్వావసు నామ ఉగాది పండగ సందర్భంగా శాలివాహన కుమ్మరి సంఘం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులకు, ఇతర ముఖ్య నేతలకు ఉగాది పండగ ఉపయోగపడే కుండ మట్టి పాత్రలను పంపిణీ చేసిన బీసీ సంక్షేమ. ఇందులో మట్టి కుండా, మట్టి వాటర్ బాటిల్, జగ్,కప్స్,మట్టి పాత్రలు ఉన్నాయి.

March 29, 2025 / 12:35 PM IST

సీసీ రోడ్ల నిర్మాణ పనులు పరిశీలన

SDR: నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని మెయిన్ రోడ్ సమీపంలో మురికి కాలువ కల్వర్టును, సీసీ రోడ్ల నిర్మాణ పనులను శనివారం మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ దారం శంకర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి సహకారంతో ప్రజలకు అందుబాటులో ఉండి పనులు చేపడుతున్నామని తెలిపారు.

March 29, 2025 / 12:16 PM IST

‘చెరువు నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీఓ’

ADB: బోథ్ మండలంలోని బాబేర గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను శనివారం ఎంపీడీఓ రమేశ్ పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న చెరువు నిర్మాణ పనుల కొలతలు తీసుకున్నారు. రోజువారి కూలీల హాజరును పరిశీలించారు. భూగర్భజలాల నిలువ కోసం చేపట్టవలసిన పనుల గురించి వివరించారు. కూలీల చేస్తున్న హార్డ్ వర్క్ చూసి ప్రోత్సహించడానికి స్వీట్స్ పంచిపెట్టారు.

March 29, 2025 / 11:28 AM IST

‘CMRF చెక్కును అందజేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్’

ADB: బజార్ హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన తంగడిపల్లి గంగాధర్ గారికి మంజూరు అయిన రూ. 42 వేల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఆయన నివాసంలో శనివారం అందజేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం అయిన పత్రాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమర్పించి సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందాలని ప్రజలకు అనిల్ జాదవ్ సూచించారు.

March 29, 2025 / 11:15 AM IST

పార్వతీ సంగమేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు

SRD: అమావాస్య సందర్భంగా సంగారెడ్డి పట్టణం పాత బస్టాండ్ సమీపంలోని పార్వతీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు శివలింగానికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాన్ని వేదమంత్రాలతో జరిపించారు. భక్తులే స్వయంగా శివలింగానికి అభిషేకం చేసే అవకాశాన్ని కల్పించారు.

March 29, 2025 / 10:48 AM IST

వన దుర్గామాతకు అమావాస్య పూజలు

MDK: పాపన్నపేట మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాభవాని మాతకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం వేకువజామున ఆలయ అర్చకులు అమ్మవారికి మంజీరా నదీజలాలతో అభిషేకం చేసి పట్టువస్త్రాలు, వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి, సహస్రనామార్చన, కుంకుమార్చన పూజలు నిర్వహించి మంగళహారతి ఇచ్చారు.

March 29, 2025 / 10:01 AM IST

తడ్కల్ మైనార్టీ అధ్యక్షుడిగా డాక్టర్ హమీద్

SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో జామ మసీదుల్లో షబ్- ఏ- ఖదర్ వేడుకలు సందర్భంగా మనటి అధ్యక్షుడిగా డాక్టర్ హమీద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 20 సంవత్సరాల నుంచి అధ్యక్షులుగా ఆయన కొనసాగుతున్నారు. మైనారిటీ సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షబ్బీర్ సాబ్, శంశోద్దిన్ , రహీం, బాబు సాబ్, అజీజ్, ఉన్నారు.

March 29, 2025 / 08:00 AM IST

మత సామర్థ్యానికి ప్రత్యేక ఇఫ్తార్: దామోదర్

SRD: మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జోగిపేటలో ఇఫ్తార్ విందు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ముస్లింలు రంజాన్ మాసాన్ని అతి పవిత్రంగా భావిస్తారని చెప్పారు. అనంతరం ముస్లింలు ఉపవాస దీక్షను విరమించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

March 29, 2025 / 04:21 AM IST

కానిస్టేబుల్ రాజుకు ప్రశంసా పత్రం అందజేసిన SP

ASF: కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేస్తున్నట్లు గమనించి, చాకచక్యంగా పట్టుకున్న ID పార్టీ కానిస్టేబుల్ రాజును జిల్లా SP శ్రీనివాసరావు శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రశంసా పత్రం అందజేశారు. ప్రతి ఒక్కరు రాజును ఆదర్శంగా తీసుకొని శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు.

March 28, 2025 / 07:38 PM IST

విద్యార్థులు వేసవి సెలవులలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి: ఎస్ఐ

KMR: విద్యార్థులు వేసవి సెలవులలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎస్సై బొజ్జ మహేష్ అన్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ బాలికల విద్యాలయంలో కళాబృందం కళను ప్రదర్శించారు. వేసవి సెలవులలో ఇంటికి వెళ్ళినప్పుడు అపరిచిత వ్యక్తులతో (గుడ్ టచ్ బాడ్ టచ్) విషయంలో జాగ్రత్తగా వుండాలని అన్నారు.

March 28, 2025 / 04:47 PM IST

సీఎం సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఉత్తంకుమార్

SRPT: ఈనెల 30న సీఎం రేవంత్ రెడ్డి హుజూర్ నగర్‌కు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం సభా ఏర్పాట్లను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఉగాది పండుగనాడు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి సీఎం వస్తున్నారని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

March 28, 2025 / 04:45 PM IST

యువత డ్రగ్స్ జోలికి వెళ్లొద్దని వినూత్న ప్రచారం

SRPT: మాదక ద్రవ్యాలు వాడటం ఆరోగ్యానికి హానికరం అని ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్. డ్రగ్స్ వద్దు ప్రాణం ముద్దు అని నినాదంతో ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ సంతలో కరపత్రాలు పంచి పుర్రె ఎముకలు గూడు చిత్రాలు కలిగిన నల్లని దుస్తులను ధరించి మైక్ పట్టుకొని ప్రజలకు అవగాహన కల్పించారు.

March 28, 2025 / 04:44 PM IST