NRML: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన రితీష్ రాథోడ్ ఆదివారం జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వారు తెలిపారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఇందులో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
NZB: ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ ఆకాంక్షించారు. ఆదివారం హిందూ ధర్మం ప్రచురించిన విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఉగాది పర్వదినం పురస్కరించుకుని పంచాంగం ముద్రించడం గొప్ప విషయమన్నారు.
ADB: ఆదివాసి గిరిజనుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎస్కే అబ్దుల్లా కోరారు. ఆదివారం మధ్యాహ్నం దండపల్లి మండలంలోని రాజుగూడ గ్రామంలో నిర్వహించిన ఆదివాసి గిరిజన సంఘం సమావేశంలో పాల్గొన్నారు. ఆదివాసులకు సరైన ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.
KMR: మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం.. ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్సీవో అంజలి కుమారి తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31 వరకు అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ 20న పరీక్ష జరుగుతుందని తెలిపారు.
KMR: సదాశివనగర్ మండలం కుప్రియాల్ శివారులో 44వ జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లాకు చెందిన రాజశేఖర్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు రోడ్డు కిందికి దూసుకెళ్లింది. దీంతో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు కాగా వారిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.
BDK: అన్నపురెడ్డిపల్లి మండలం కేంద్రంలో ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం (శివాలయం)ను ఎమ్మెల్యే దర్శించుకున్నారు. అనంతరం నూతన ఛైర్మన్గా ఎన్నికైన మల్లేల నరసింహారావుకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేక అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరించి, సంబంధిత పత్రాలను అందజేశారు.
KMM: జూలూరుపాడులో శాశ్వత ఉప మార్కెట్ యార్డును నిర్మించాలని కోరుతూ గిరిజన కార్మిక రైతు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు గండుగులపల్లి గ్రామంలో ఆదివారం వినతిపత్రం అందజేశారు. జూలూరుపాడు మండలంలో అధికంగా పత్తి పంటను రైతులు పండిస్తారని తెలిపారు. పత్తిని అమ్ముకునేందుకు శాశ్వత ఉప మార్కెట్ యార్డును నిర్మించాలని మంత్రిని కోరారు.
MNCL: బెల్లంపల్లి పట్టణం పాత బస్టాండ్ ఏరియాలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది తెలుగు సంవత్సరాది (శ్రీ విశ్వావసు) పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం పంచాంగ శ్రవణ పఠనం ఏర్పాటు చేశారు. వేద పండితులు అప్పల శ్యాం ప్రణీత్ శర్మ పంచాంగ పఠనం హాజరైన పట్టణ ప్రజలకు వినిపించారు. ప్రజలందరూ శాంతియుత మార్గంలో భక్తిశ్రద్ధలతో కలిగి ఉండాలని సూచించారు.
PDPL: రామగుండం సింగరేణి సంస్థ జీఎం ఆఫీస్లో కార్మిక సంఘ నాయకులతో పాటు వివిధ శాఖ అధికారులతో జీఎం లలిత్ కుమార్ స్ట్రక్చర్ సమావేశం నివసించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. గతంలో తీసుకున్న నిర్ణయాలను కొన్ని పరిష్కరించామని మరికొన్ని సమస్యలు పరిష్కరించవలసి ఉందని అన్నారు. కార్మిక సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఈ సమావేశంలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
MHBD: సీరోల్ మండల కేంద్రానికి చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఆదివారం చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గనిని వెంకన్న చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంగాపురం సైదులు అనే లబ్ధిదారుడికి 40 వేల ఎల్వోసీ చెక్కును అందజేసినట్లు వెంకన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
JN: ప్రధాని మోడీ నిర్వహించిన మన్కి బాత్ కార్యక్రమాన్ని దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామంలో బీజేపీ నేతలు వీక్షంచారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న వారు ఆయన సూచనలు తమ జీవితాలలో అమలు చేస్తామని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువత భవిష్యత్పై మోదీ చేసిన ప్రస్తావనలు ప్రత్యేకంగా ఆకర్షించాయి.
NGKL: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాలలో ఆదివారం మహనీయుల జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26న జిల్లా కేంద్రంలో మహనీయుల జాతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ అన్నారు.
MBNR: పేదరికంతో బాధపడుతున్న విద్యార్థికి ల్యాప్టాప్ అందించి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి గొప్ప మనసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే కౌకుంట్ల మండలం ముచింతల గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి అనే విద్యార్థి బీటెక్ మూడవ సంవత్సరం చదువుకున్నాడు. ప్రస్తుతం ల్యాప్ టాప్ కొనలేని పరిస్థితిలో ఎమ్మెల్యేను సంప్రదించగా ఆదివారం ఆయన వెంటనే ల్యాప్ టాప్ ఇచ్చారు.
WGL: కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి వారిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని, నర్సంపేట నియోజకవర్గాన్ని స్వామివారి అనుగ్రహంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.
NGKL: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న గతంలో లాగులు పంపిణీ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతి విద్యార్థులకు ప్యాంట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 825 మంది ప్రభుత్వ పాఠశాలలో 69500 మంది విద్యార్థులకు వీరందరికీ లబ్ది చేకూరనుంది.