KMM: ఖమ్మం నగరంలోని VDO’S కాలనీలో ఉన్న రామాలయంలో శనివారం నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి పొంగులేటికి ముందుగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ADB: కారును లారీ ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలైన ఘటన శుక్రవారం రాత్రి భైంసా పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..నిర్మల్ నుంచి వస్తున్న కారును భైంసా పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద కారును లారీ ఢీకొంది, కారులో ఉన్న భైంసా పట్టణానికి చెందిన శంకర్కు గాయాలు కాగా భైంసా ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.
ADB: ఇటీవల భారత రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంఅవ్వగా… ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల భాజపా నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీ అభిమానులు లెక్కింపును ఉదయం నుంచే వీక్షిస్తున్నారు. ఢిల్లీలో త్వరలో భాజపా జెండా ఎగరనుందని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నారు.
W.G: జిల్లా వ్యాప్తంగా మొదటి విడుత ఇంటర్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీధర్ సుమన్ తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రయోగ పరీక్షలు ఐదు రోజులు నిర్వహించారన్నారు. ప్రతిరోజు ఉ.9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు వేళల్లో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటాలని, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కేవీ. రమణారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాబీజేపీ ఆఫీసులో జిల్లాబీజేపీ అధ్యక్షుడిగా నీలం చిన్నరాజులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, బీజేపీ నేతలు మురళీధర్ గౌడ్, నెరేళ్ల ఆంజనేయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
BDK: కిన్నెరసాని నుంచి పాల్వంచ కేటీపీఎస్కు నీటిని సరఫరా చేసే కాల్వలో శుక్రవారం ఓ మొసలి ప్రత్యక్షమయ్యింది. అది రిజర్వాయర్ నుంచి కాల్వలోకి ప్రవేశించడాన్ని కొందరు పర్యాటకులు గుర్తించి వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. రేంజర్ కవితా మాధురి సిబ్బంది కిషన్, రాములు తదితరులతో వెంటనే వచ్చి వలలతో మొసలిని బంధించారు. అనంతరం జలాశయంలోకి వదిలారు.
KMM: ముదిగొండ మండలంలోని ప్రతి గ్రామంలో రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని మండల తహశీల్దార్ సునీతా ఎలిజబెత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక మీసేవా కేంద్రాల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్తగా పెళ్లి అయిన వారు నేరుగా మండల తహశీల్దార్ కార్యాలయంలో పాత కార్డుల్లో పేరు డిలీట్కి అప్లై చేసుకోవాలని పేర్కొన్నారు.
NZB: బోధన్ పట్టణంలో పట్టభద్రులు గళం బలం అనే సమావేశానికి శనివారం కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల అభ్యర్థి నరేందర్ రెడ్డి రానున్నారు. ఆయనతో పాటు బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి హాజరుకానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించచున్నారు.
హైద్రాబాద్: ఎల్బీనగర్ పరిధి చంపాపేట డివిజన్ ఉదయ నగర్ కాలనీలో కాంగ్రెస్ తెలంగాణ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి గౌడ్ పర్యటించారు. కాలనీ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీలైనంత తొందరలోనే కాలనీలోని సమస్యలు తీరుస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.
KMR: ఎల్లారెడ్డి నర్సరిలో మొక్కల సంరక్షణ సక్రమంగా చేపట్టాలని ఆర్డీవో ప్రభాకర్ శుక్రవారం సూచించారు. మండలంలోని బ్రాహ్మణపల్లి నర్సరీని అయిన శుక్రవారం పరిశీలించారు. నర్సరీలో పెరుగుతున్న మొక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు సంసిద్ధం చెయాలనీ నిర్వహకులకు సూచించారు.
MLG: మంగపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) హాజరై మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలనీ, పార్టీ లైన్లోనే ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు.
NZB: వర్ని మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి గురువారం మధ్యాహ్నం పొలంలో పని చేస్తుండగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ శుక్రవారం తెలిపారు. పోలీస్ల వివరాల ప్రకారం మృతుడు అదే గ్రామానికి చెందిన మేక వెంకటేశ్వర్ రావు వద్ద 10 సంవత్సరాల నుంచి వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.
KMR: కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు శుక్రవారం సుభాష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన హైకమాండ్. గత కొన్ని రోజుల క్రితం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక మీటింగ్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్పై మరియు పార్టీని దుర్భాషలాడినందుకు హైకమాండ్ ఇట్టి విషయాన్నీ తీవ్రమైన కఠిన చర్యగా తీసుకొని సస్పెండ్ చేశారు.
MNCL: బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ క్రీడాకారుడు రాసకొండ సంజీవ్ మరోసారి ప్రతిభ చూపి పోటీల్లో బహుమతి సాధించాడు. ఈనెల 1 నుండి 5 వరకు కేడి జాదవ్ ఇండోర్ స్టేడియం ఐజి కాంప్లెక్స్ న్యూఢిల్లీలో జరిగిన ఏడవ వాకో అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ రిఫ్రి సెమినార్ లో పాల్గొని సర్టిఫికెట్, అవార్డు పొందారు. అతన్ని గ్రామస్తులు అభినందించారు.
SRPT: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందిస్తుందని టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. కులగణన సర్వే సక్రమంగా నిర్వహిస్తే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ, లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.