• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘సైబర్ నేరాలపేట జాగ్రత్తగా ఉండాలి’

NRML: సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని మండల పోలీసులు సూచించారు. మంగళవారం స్థానిక బస్టాండ్ సమీపంలో మహిళలకు సైబర్ నేరాలు,చైన్ స్నాచింగ్ తదితర విషయాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పవద్దని, అనవసర లింకులు ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.

July 1, 2025 / 11:17 AM IST

ఐలమ్మ విగ్రహ ప్రారంభోత్సవానికి ఆహ్వానం

NZB: జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన రజక సంఘం సభ్యులు నేడు NZB రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. తమ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. అలాగే పూర్తయిన సంఘ భవనాన్ని కూడా ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ అధ్యక్షుడు విద్యాసాగర్, ఉపాధ్యక్షుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

July 1, 2025 / 11:14 AM IST

ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం ఫోన్‌ఇన్

NRPT: కోసం సందేహాల నివృత్తి చేసేందుకు ఈనెల 3న కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో ఫోన్ఇన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. ఫోన్ఇన్ కార్యక్రమం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని పేర్కొన్నారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9848848802, 8096907524, 9949931066 

July 1, 2025 / 11:13 AM IST

KGBVలో దరఖాస్తుల ఆహ్వానం

WNP: కొత్తకోటలోని అమడబాకుల కస్తూర్బాలో కొత్తగా మంజూరైన ఇంటర్ మొదటి ఏడాదిలో అకౌంట్ విభాగంలో ఖాళీగా ఉన్న 20 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారిణి చందన తెలిపారు. పదో తరగతి పూర్తి చేసి, ఆసక్తి ఉన్న విద్యార్థినులు నేరుగా విద్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ కోర్సు పూర్తి చేస్తే విద్యార్థినులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు.

July 1, 2025 / 11:11 AM IST

‘హుజూర్‌నగర్ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత’

SRPT: హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని సీపీఎం పట్టణ కార్యదర్శి పల్లె వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ అనుములగూడెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రిలో 52 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా కేవలం 15 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. 

July 1, 2025 / 11:07 AM IST

క్వింటా పత్తి ధర ఎంత అంటే..?

WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే నేడు పత్తి ధర పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,250 పలకగా.. మంగళవారం రూ.7,345 కి చేరింది. ఒకరోజు వ్యవధిలో రూ.95 ధర పెరగడం రైతులకు కొంత ఊరటనిచ్చినట్లయింది. మార్కెట్‌లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

July 1, 2025 / 11:07 AM IST

పేలుడు జరిగినప్పుడు 700-800 డిగ్రీల ఉష్ణోగ్రత

మెదక్: పాశమైలారంలోని పారిశ్రామికవాడలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 45కి చేరింది. అయితే, పేలుడు సంభవించిన సమయంలో 700-800 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని వల్లే పలువురు సజీవ దహనమయ్యారు. గంటగంటకూ మృతుల సంఖ్య పెరుగుతుండటం కలవరపెడుతోంది. పలువురి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి.

July 1, 2025 / 11:03 AM IST

నేడు కంది విత్తనాల పంపిణీ

NRPT: ఉట్కూరు మండల కేంద్రంలో జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా నేడు కంది విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయాధికారి గణేష్ తెలిపారు. ఏఈవోల ఆధ్వార్యంలో ఉచితంగా పంపిణీ చేసే ఈ కంది విత్తనాలను ఆయా గ్రామాల రైతులు, రైతు వేదికల వద్ద సంబంధిత పాసుబుక్, ఆధార్ కార్డుతో వచ్చి తీసుకోవాలని సూచించారు.

July 1, 2025 / 11:01 AM IST

బాబ్లీ గేట్ల ఎత్తివేతతో సాగునీటికి భద్రత

NZB: నేడు బాబ్లీ గేట్ల ఎత్తివేతతో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు తాగునీరు, సాగునీటి సరఫరాలో సహాయపడే అవకాశముంది. ఎగువ నుంచి వచ్చే వరద నీరు జలాశయంలో నిల్వ అవుతుండటంతో, ఖరీఫ్ పంటలకు సాగునీటి భద్రత పెరిగే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలోని పెద్దపల్లి, NZB, జగిత్యాల జిల్లాల్లో రైతులకు ఉపశమనం లభించనుంది. అధికార యంత్రాంగం జల నియంత్రణపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోంది.

July 1, 2025 / 10:55 AM IST

రోడ్డు ప్రమాదంలో రాపిడో డ్రైవర్ మృతి..!

RR: నాగోల్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జీడిమెట్ల సుభాష్ నగర్‌కు చెందిన బండారి విజయ్ కుమార్ (35) రాత్రి 11:45కు నాగోల్‌లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద బైక్‌పై నిలుచున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ అతన్ని ఢీకొట్టింది. దీంతో తీవ్రమైన గాయాలు అయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

July 1, 2025 / 08:26 AM IST

బాలానగర్‌లో యాక్సిడెంట్.. SIకి గాయాలు..!

HYD: బాలానగర్ PS పరిధిలోని జగ్జీవన్ వంతెనపై సోమవారం రాత్రి యాక్సిడెంట్ జరిగింది. బాలానగర్ నుంచి కూకట్ పల్లి వైపు వెళ్తూ వంతెన దిగుతున్న సమయంలో కారు ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ప్రొబిషన్ SI వెంకటేశం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తుండగా అతివేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టడంతో SIకు తీవ్ర గాయాలయ్యాయి.

July 1, 2025 / 08:25 AM IST

‘ఉద్యోగ విరమణ వయసుకే కానీ బోధనకు కాదు’

KNR: గంగాధర మండలం ఓద్యారంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు కుడిక్యాల విజయలక్ష్మి(ఎల్ఎఫ్ఎలెచ్ఎం) సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా మండల విద్యా అధికారి ఏనుగు ప్రభాకర్ రావు సోమవారం సన్మానించారు. ఉద్యోగ విరమణ వయసుకే కాని బోధనకు కాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గర్షకుర్తి హెడ్ మాస్టర్లు శశికాంత్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

July 1, 2025 / 08:17 AM IST

“చెల్పూర్ మిల్లెట్స్ విక్రయాల కోసం ఐడీవోసీలో క్యాబిన్ ఏర్పాటు”

BHPL: చెల్పూర్ మిల్లెట్స్ విక్రయాల నిర్వహణకు ఐడీవోసీ కార్యాలయంలో క్యాబిన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ డీఆర్డీవోకు సూచించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో చెల్పూర్ మిల్లెట్ యూనిట్ నిర్వహిస్తున్న మహిళలతో కలెక్టర్ సమావేశమయ్యారు. నేటి జీవనశైలిలో మిల్లెట్స్ వినియోగం ఆరోగ్యపరంగా చాలా ముఖ్యమని ఆయన తెలిపారు.

July 1, 2025 / 08:16 AM IST

జిల్లా దివ్యాంగులకు శుభవార్త !

BHPL: జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన దివ్యాంగులకు ఉపకరణాల కోసం దరఖాస్తు గడువును జులై 5 వరకు పొడిగించినట్లు జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి మంగళవారం ప్రకటించారు. అర్హులైన దివ్యాంగులు నిర్దేశిత తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9652318042 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

July 1, 2025 / 08:10 AM IST

మహిళపై హత్యాయత్నం కేసులో మూడేళ్ల జైలు శిక్ష

KMR: తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అన్నారు. మాచారెడ్డి మండలంలోని నెమ్మిలిగుట్ట తండాకు చెందిన జెరుపుల నవీన్ వయస్సు (24) తన వదిన జెరుపుల సంకి వేరే వారితో సన్నిహితంగా ఉంటుందని అనుమానంతో 2017 ఫిబ్రవరి 24 న మాంసం కోసే కత్తితో ఆమెను పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఆ వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష పడినట్లు వెల్లడించాడు.

June 30, 2025 / 08:20 PM IST