NLG: ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. ఇవాళ నకిరేకల్ లోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు తోఫాను అందించారు. సోదర భావంతో మెలుగుతూ పండుగలను సామరస్యంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.
MDK: రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. జిల్లావ్యాప్తంగా 61 మందికి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పదవులు కేటాయించగా, సిద్ధిరాములుకు వైస్ ప్రెసిడెంట్ పదవి కేటాయించారు. కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.
JN: రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దివ్యాంగుల భద్రత, సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మల్లికాంబ మనో వికాస కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించి మాట్లాడుతూ… మానసిక దివ్యాంగ చిన్నారుల కోసం పనిచేసే సంస్థలకు ప్రభుత్వ సహాయం మరింతగా అవసరమని, పిల్లలకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందజేస్తానని చెప్పారు.
RR: తెలంగాణలో నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. యాచారం మండలం గున్గల్ గ్రామస్తులైన రైతు కుటుంబానికి చెందిన ఆవ రమాదేవి-జంగయ్యల కుమారుడు ఆవ మోక్షిత్ 95 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి ప్రతిభకు గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
JGL: TGNPDCL పరిధిలో కొత్త సర్వీసుల కోసం సర్వీస్ లైన్ ఛార్జీల విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చామని SE బి. సుదర్శనం తెలిపారు. కొత్త LT కనెక్షన్లు, అదనపు లోడ్ కోసం సర్వీస్ లైన్ ఛార్జీలను సరళంగా, ఏకరీతిగా నిర్ణయించామన్నారు. స్థల పరిశీలన లేకుండా త్వరితగతిన కొత్త సర్వీసులు అందిస్తున్నామని అన్నారు. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
JGL: శక్తివంతమైన, ద్రుడమైన భారత నిర్మాణానికి కృషి చేయాలని RSS జిల్లా కార్యవాహ గొల్కొండ నాగరాజు అన్నారు. రాయికల్ పట్టణంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ ఉగాది ఉత్సవానికి ఆయన హాజరయ్యారు. హిందూ పండుగలు ఖగోళ శాస్త్రం, ప్రకృతి మార్పులు, ధర్మం, అధర్మంపై సాధించిన విజయానికి ప్రతీకలని అన్నారు. జాతీయ సమైక్యత, విశ్వగురు భారత్ RSS ధ్యేయమని అయన పేర్కొన్నారు.
VKB: బొమ్మరాస్పేట మండలం మదన్పల్లిలో నిన్న ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. రహదారులన్నీ మంచు కురిసినట్లుగా తెల్లగా మారిపోయాయి. ఈ అకాల వర్షం వల్ల కూరగాయలు, ఇతర పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం చల్లబడినప్పటికీ, పంట నష్టం వారిని కోలుకోలేని దెబ్బ తీసింది.
HYD: ఆస్తి పన్ను పరిష్కార మేళా అన్ని GHMC సర్కిల్ కార్యాలయాల్లో ఈనెల 22న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. OTS సమస్యలు తలెత్తుతున్న వేళ, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
MNCL: జన్నారం మండలానికి నూతన ఎస్సైని నియమించాలని ప్రజలు కోరారు. ఎస్సైగా పనిచేసిన గొల్లపల్లి అనూషను రామగుండం కమిషనరేట్ వీఆర్కు బదిలీ చేశారు. ఆయన లక్షేట్టిపేట సీఐ జన్నారం పోలీస్ స్టేషన్కు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. మండలంలో ఇటీవల దొంగతనాలు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రచారం చేస్తున్నారు.
BHNG: మోత్కూర్ మున్సిపాలిటీ 6వ వార్డ్ అరేగూడెంలో సామలా రామస్వామి రెడ్డి గత 7 సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతూ మంచానికి పరిమితం కావడంతో బాధను చూడలేక వీల్ చైర్ వారికీ సహాయం చేసిన మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బద్దం నాగార్జున రెడ్డి, వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, యువకులు పాల్గొన్నారు.
KMR: డోంగ్లి మండలం లోని ఎన్ బూర గ్రామ సర్పంచ్గా ఉన్న యూనూస్ పటేల్ను TPCC వైస్ ప్రెసిడెంట్గా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్కు MLA లక్ష్మీ కాంత రావుకు, DCC మల్లికార్జున్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు
వనపర్తి జిల్లా డీసీసీ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలో (డీసీసీ) ప్రజా ప్రతినిధిగా K.రమేష్ గౌడ్ Ex ZPTC నూతనంగా ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వనపర్తి ఎమ్మెల్యే మేగా రెడ్డి, డీసీసీ అధ్యక్షులు శివసేన రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల మత సామరస్యాన్ని ప్రమోట్ చేసేందుకు ఇవాళ సాయంత్రం 6 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ముస్లింల మత పెద్దలు, ప్రముఖులు పాల్గొని భిన్న మతాల మధ్య ఐక్యతను చాటనున్నారు. మీడియా ప్రతినిధులు సాయంత్రం 5:45 గంటలకు కార్యక్రమ వేదికకు చేరుకోవాలని సూచించారు.
NLG: మిర్యాలగూడ పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. బాలవాటిక-3లో చేరేందుకు ఈ రోజు నుంచి ఏప్రిల్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రిన్సిపల్ నానిప్రసాద్ తెలిపారు. 9వ తరగతి విద్యార్థులు ఏప్రిల్ 2 నుంచి 8 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చెయ్యాన్నారు.
NZB: పసుపు రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర దక్కక కన్నీరు కారుస్తున్నారు. నెలల తరబడి సాగయ్యే ఈ పసుపు పంటను రైతు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పండిస్తే ఈ పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. మార్కెట్ మాయాజాలానికి, సిండికేటు వ్యాపారుల దెబ్బకు పసుపు రైతు దారుణంగా బలవుతున్నాడు.