• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆరోగ్యకే ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

SRCL: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలో జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు.

February 9, 2025 / 05:05 PM IST

చెరువులన్నీ నింపాలని ప్రభుత్వ విప్‌కు వినతి

BHNG: రాజాపీట మండలంలోని చెరువులన్నీ నింపాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతు జేఏసీ నాయకులు ఆదివారం గాంధీ చౌరస్తాలో వినతి పత్రం అందజేశారు. కొత్తగా ఎస్టిమేషన్ వేసిన తర్వాత చెరువులన్నీ నింపేందుకు ప్రయత్నం చేయనున్నట్లు బీర్ల ఐలయ్య తెలిపారు. కాలయాపన చేయకుండా పంటలు ఎండిపోక ముందే చెరువులు నింపాలని రైతు జేఏసీ నాయకులు కోరారు.

February 9, 2025 / 04:42 PM IST

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

NLG: కొడుకులు లేని తండ్రికి కూతురే అన్ని తానే తలకొరివి పెట్టింది. ఈ సంఘటన ఆదివారం పెన్ పహాడ్ మండలం చీదెళ్ల గ్రామంలో చోటుచేసుకుంది గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రగోతంరెడ్డి శనివారం రాత్రి మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు సంతానం కావడంతో పెద్ద కూతురు శృతి ఆదివారం తండ్రికి కొడుకుల తలకొరివి పెట్టి తండ్రి రుణం తీర్చుకుంది.

February 9, 2025 / 04:31 PM IST

అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి

మేడ్చల్: అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో జరిగింది. పట్టణంలోని కిష్టాపూర్ రోడ్డులో ఉన్న జమున వెంచర్లాట్ నెంబరు 33లో ఆర్మూర్ శ్రీనాథ్ అనే వ్యక్తి మూడేళ్ల కిందట కృష్ణవేణి సిమెంట్ వర్క్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు. శ్రీనాథ్ వెనుక భాగంలో బలమైన గాయాలు ఉండటంతో సహచర కార్మికుడు రాజును పోలీసులు విచారిస్తున్నారు.

February 9, 2025 / 01:34 PM IST

వైద్యురాలి బ్రెయిన్ డెడ్.. అవయవదానం

RR: నార్సింగి పరిధిలోని మేకన్ గడ్డ వద్ద జరిగిన ప్రమాదంలో వైద్యుడు యశ్వంత్ మృతి చెందగా.. వైద్యురాలు భూమిక తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా భూమికకు బ్రెయిన్ డెడ్ అయింది. నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో గుండె, లివర్, కళ్లు, కిడ్నీలను దానం చేశారు. కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

February 9, 2025 / 01:09 PM IST

ఓఆర్ఆర్‌పై ఆకతాయిల హల్చల్

HYD: నగర శివార్లలోని ORR పై రాత్రివేళ ఆకతాయిలు హల్చల్ చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రమాదకరంగా కారు రేసింగులు, స్టంట్లు చేస్తూ హంగామా చేస్తున్నారు. శంషాబాద్ సమీపంలో ఔటర్‌పై ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవడంతో.. స్టంట్లు చేసిన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

February 9, 2025 / 01:04 PM IST

విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

RR: చేవెళ్ల మండలం పామెన గ్రామంలో దుర్గమ్మ, మైసమ్మ, సరోజనమ్మ దేవతల విగ్రహ ప్రతిష్టాపనల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 9, 2025 / 12:55 PM IST

25లోగా రైల్వేఅండర్ పాస్ ప్రారంభించాలి

మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర కల్యాణ మహోత్సవం ఈనెల 26న జరుగనున్న సందర్భంగా ఆలయ సమీపంలోని నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ పాస్ నిర్మాణాన్ని 25లోగా ప్రారంభించాలని పట్టణ నాయకులు కాంట్రాక్టర్‌కు సూచించారు. శనివారం రైల్వే అండర్ పాస్ నిర్మాణ పనులను కాంట్రాక్టర్ వెంకన్నతో కలిసి పరిశీలించారు.

February 9, 2025 / 12:10 PM IST

గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన విప్

MHBD: మరిపెడ మండలం తానంచర్ల గంగమ్మ ఆలయాన్ని నేడు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం అందజేశారు ఆలయంలో భక్తులతో కలిసి ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 9, 2025 / 10:15 AM IST

కుట్టుశిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

WNP: జిల్లా కేంద్రంలోని 22వ వార్డు బాలాజీ నగర్‌లో గల కుట్టు శిక్షణ కేంద్రాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిర్వాహకురాలు హసీనాతో శిక్షణ కేంద్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో రామానంద తీర్థ స్వచ్ఛంద సంస్థ వారు ఈ కేంద్రంను ఏర్పాటు చేశారని, నేటి వరకు 3 వేల మంది మహిళలకు కుట్టు శిక్షణను ఇచ్చామని తెలిపారు.

February 9, 2025 / 09:58 AM IST

పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

MBNR: విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని శాషాబుగుట్ట హైస్కూల్‌ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్ పరిసరాలు, క్లాస్ రూమ్స్, వంటశాల, స్టోర్‌రూంను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛమైన త్రాగునీరు, పరిసరాలు, భోజనంలో పరిశుభ్రత పాటించాలన్నారు.

February 9, 2025 / 09:54 AM IST

కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడు: సీతక్క

MLG: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగులో శనివారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీతక్క మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడన్నారు.

February 9, 2025 / 09:02 AM IST

ట్రామా సెంటర్ ఏర్పాటుకు స్థలం పరిశీలించిన ఎమ్మెల్యే

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు పట్టణ సమీపంలో ఏర్పాటు చేయనున్న ట్రామా సెంటర్, స్కిల్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం పరిశీలించారు. ఈ రెండు సెంటర్లను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

February 9, 2025 / 08:48 AM IST

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ మల్లురవి

NGKL: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ను నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి డిప్యూటీ సీఎం బట్టివిక్రమార్క‌తో కలిసి ఢిల్లీలోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణకు రావలసిన వెనుకబాటు జిల్లాల ప్రత్యేక సహాయ నిధి విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఎంపీ తెలిపారు.

February 9, 2025 / 08:32 AM IST

‘రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి’

PDPL: ముత్తారం మండలం కేశనపల్లి గ్రామంలోని ఫర్టిలైజర్ షాపును మండల వ్యవసాయ అధికారి అనూష శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ దుకాణంలోని రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గోదాములలో నిలువలను పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులను అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు.

February 9, 2025 / 06:44 AM IST