మేడ్చల్: టీజీఎస్పీడీసీఎల్ జీడిమెట్ల డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్ ఎస్.సురేందర్ రెడ్డి రూ. 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 11 KV లైన్ షిఫ్ట్ చేయడం, కొత్త భవనానికి కేబుల్ వేయడం కోసం పని అంచనా నివేదిక అందించేందుకు ఈ లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు. పక్కా ప్లాన్ వేసిన అధికారులు డబ్బులు తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు.
మేడ్చల్: ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. రన్నింగ్లో ఉన్న బైక్ని నవత ట్రాన్స్పోర్ట్స్కి చెందిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ రైడర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జోసెఫ్గా పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా కొర్రెండులోని చర్చిలో ఫాస్టర్గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది.
మేడ్చల్: ఉప్పల్ స్టేడియం వద్ద SRH, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన పలువురు యువత ఆరెంజ్ ఆర్మీ టీషర్ట్స్, మహేశ్ బాబు బ్యానర్తో స్టేడియానికి చేరుకున్నారు. ఈ సారి SRH బ్యాటింగ్కు దిగితే 300 స్కోర్ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ తరలివచ్చారు.
హన్మకొండ: బైకు అదుపు తప్పి తండ్రి, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కాజీపేట మండలం కడిపికొండ శివారు గృహకల్పవద్ద గురువారం చోటుచేసుకుంది. స్టేషన్ ఘన్పూర్కు చెందిన దేవేందర్ సరిత తండ్రి కూతురు తమ బైకుపై వరంగల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై గుంతలు పడి కంకర తేలివుండడంతో బైకు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో తండ్రి, కూతురుకి తీవ్ర గాయాలయ్యాయి.
JGL: కొండగట్టు ఘాట్ రోడ్డులో గురువారం ప్రమాదం జరిగింది.స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్ నుంచి కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఘాటు రోడ్డు దిగే సమయంలో వాహనం పైకి ఎక్కిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు కిందపడ్డారు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: దిల్సుఖ్నగర్లోని హాస్టళ్లలో నీటి కొరత మొదలైంది. హాస్టల్స్ విద్యార్థులు, ఉద్యోగస్థులు అవసరాలకు నీళ్లులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ హాస్టల్ యాజమాన్యం బోర్ వేయించి దానికి అయిన ఖర్చుగా హాస్టల్లో ఉండేవారి నుంచి అదనంగా రూ.500 వసూలు చేసి భారం వేస్తున్నారని విద్యార్థులు వాపోయారు. అధికారులు నీటి ఎద్దడిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
JGL: ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా మెట్ పల్లి పట్టణంలోని రెండు కూడళ్లలో అధికారులు లక్షలు ఖర్చు చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. సిగ్నల్ పోల్కు ఓ లారీ తగలడంతో రోడ్డుపై పడిపోయింది. దీంతో గత కొన్ని నెలలుగా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో పట్టణంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అధికారులు సిగ్నల్ లైట్లను పునరుద్ధరించాలని పట్టణ ప్రజలు కోరారు.
WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఈరోజు అన్నదాతలకు కొంత ఊరటనిచ్చాయి. గత మూడు రోజులతో పోలిస్తే, ఈరోజు పత్తి ధర పెరిగింది. సోమవారం క్వింటా ధర రూ. 7,030, మంగళవారం రూ.7,045, బుధవారం రూ.7,010 గా ఉండగా, ఈరోజు రూ. 7,050 కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు.
SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం నుండి లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ. 1 కోటి 95 లక్షల 75 వేల 168 వచ్చినట్లు ఈవో వినోద్ ఒక ప్రకటన తెలిపారు. బంగారం 287 గ్రాములు, వెండి 18 కిలోల 500 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. 20 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.
SRCL: యాసంగి సీజన్లో పండించిన వరి ధాన్యాన్ని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ ఆదేశించారు. యాసంగి 2024-25 వరి ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో బుధవారం నిర్వహించారు. ఈ సమావే శానికి అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు.
PDPL: రెవెన్యూ విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంథని, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో విస్తృతంగా పర్యటించారు. మంథని మండలంలోని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం, నిర్మాణం అవుతున్న నూతన పురపాలక భవన పనులను పరిశీలించారు. అనంతరం ముత్తారం మండలం ధర్యాపూర్లో పర్యటించారు.
MHBD: సీరోల్ మండలం కొత్తూరు (సీ) గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. కొత్త సరోజన (60), ఆమె కుమారుడు శేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
RR: మైలార్ దేవుపల్లి డివిజన్ పరిధిలోని బాబు రెడ్డి నగర్ మార్కండేయ నగర్ హైవే రోడ్పై డివైడర్ పనులు జరుగుతున్నాయి. దీనివల్ల స్థానికులు రోడ్డు దాటడానికి ఇబ్బందిగా ఉందని చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుందని కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డికి తెలియజేశారు. దీంతో పనులను కార్పొరేటర్ పరిశీలించారు. GHMC అధికారులు, ట్రాఫిక్ సీఐతో మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
RR: VIP విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీనివాసుడిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిపారసు లేఖలు అనుమతిస్తునందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయిడుకి, ఛైర్మన్ బీఆర్ నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో పీఓ ఖుష్బూ గుప్తాను CITU జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్, ANMలతో కలిసి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న ఏఎన్ఎంలకు పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. వారి సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.