HNK: లక్ష్య సాధనకు ఏకాగ్రత, పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. మంగళవారం బాలసముద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్టడీ సర్కిల్ను జిల్లా కలెక్టర్ ప్రావిణ్య సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమై స్టడీ సర్కిల్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టడీ సర్కిల్లోని విద్యార్థుల డార్మెట్రీ పరిశీలించారు.
WGL: సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆజంజాహి మిల్స్ గ్రౌండ్స్లో 16.7 ఎకరాల విస్తీర్ణంలో 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న జీప్లస్ టు కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు.
HNK: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం(PC&PNDT) ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన PC& PNDT అధారిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు చట్ట నియమాలను పాటించాలని, సక్రమంగా రికార్డులు నిర్వహించాలని సూచించారు.
MHBD: నెల్లికుదురు మండలం ఆలేరులోని శ్రీ రాజరాజేశ్వరి రైస్ మిల్పై జిల్లా సివిల్ సప్లై అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో PDS రేషన్ బియ్యం సుమారు 430 క్వింటాళ్లు అక్రమంగా తరలిస్తుండగా సంబంధిత సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు జిల్లా అధికారి ప్రేంకుమార్ తెలిపారు. లబ్ధిదారుల నుంచి అక్రమంగా కొనుగోలుచేసి వాటిని క్లీనింగ్ పాలిష్ చేస్తున్నట్లు తెలిపారు.
HNK: మానవతా విలువలతో మనిషి మహోన్నతుడిగా మారాలన్నదే ఉపవాసాల అసలు ఉద్దేశ్యం అని వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు అన్నారు. హసన్పర్తిలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. తమ జీవిత సౌదాల్ని సత్యం, న్యాయం, ధర్మం అనే పునాదుల మీద నిర్మింపజేసుకునేందుకు ఉపయోగపడే సాధనమే ఉపవాస వ్రతం అన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ADB: ఆంగ్లభాషపై విద్యార్థులు పట్టు సాధిస్తే మంచి భవిష్యత్తుకు ఉంటుందని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్త సూచించారు. మంగళవారం ఉట్నూరు పట్టణంలోని ఎమ్మార్పీ సమావేశ మందిరంలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన యువ వక్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచేందుకు బోస్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని పీఓ ప్రశంసించారు.
RR: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్ నలందానగర్ కాలనీలో అనుమతులు లేకుండా నిర్మించిన ఓ బిల్డింగ్ రెండు అంతస్తులను సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చి వేశారు. ఏసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో కూల్చివేతలు ప్రారంభించారు. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా భవన యజమాని పట్టించుకోకపోవడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా ఝలిపించారు.
HYD: GHMC ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, ఉద్యోగులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు ఏప్రిల్ 7 నుంచి 10 వరకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ అదనపు కమిషనర్ యాదగిరి రావు తెలిపారు. విక్టరీ ప్లే గ్రౌండ్, ఉప్పల్ స్టేడియంలో APR 7 నుంచి 10 వరకు జరుగుతాయి. పురుషులకు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ పోటీలున్నాయి.
మేడ్చల్: అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్లో పని చేస్తూ ఇటీవల అనారోగ్యంతో కానిస్టేబుల్ హరీష్ బాబు, అలాగే ప్రమాదవశాత్తు అంబర్పేట ఆర్ముడు హెడ్ క్వార్టర్ కానిస్టేబుల్ బాలకృష్ణలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎల్బీ నగర్లోని రాచకొండ క్యాంపు కార్యాలయం వద్ద బాధిత కుటుంబ సభ్యులకు భద్రత చెక్కులు అందజేశారు.
మేడ్చల్: జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాజీనగర్ మార్కెట్ లేన్లో కాటి నర్సింహా భార్య సుమలత, ఇద్దరు కుమారులతో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలను చూసేందుకు ఇటీవల సుమలత తల్లి పుల్లమ్మ ఇంటికి వచ్చింది. స్నానం చేయడానికి వేడి నీళ్లు పెట్టగా బన్నీ(4) ఆడుకుంటూ అందులో పడిపోయి మృతి చెందాడు.
SRCL: వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.. ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ వెంకట రమణ విద్యార్థులకు బ్యాంకింగ్, వివిధ రకాల ఖాతాలు, బ్యాంకులు అందించే రుణాలపై వివరించారు. డబ్బు ఆదా చేయడం అలవాటు చేసుకోవాలని కోరారు.
KMR: ఒకే దేశం ఒకే ఎన్నికపై బీజేపీ దృష్టి కోణం అంశంపై మంగళవారం దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ కళ్యాణ మండపంలో బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి అధ్యక్షతన కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తోట బాలరాజు వచ్చారు.
NRML: రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న స్పందన జాయింట్ గ్రీవెన్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ జీ ఎమ్మార్వో శ్రీనివాస్ అన్నారు. మండల కార్యాలయంలో స్థానిక ఎస్సై సాయి కిరణ్తో కలిసి గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను గ్రీవెన్స్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. నాయబ్ ఎమ్మార్వో వాహీద్ తదితరులున్నారు.
ADB: ఉట్నూర్ పట్టణంలోని కోర్టులో పనిచేసే న్యాయవాదులు విధులను బహిష్కరించే నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ చంపాపేట్ ఈస్ట్ మారుతి నగర్లో ఇజ్రాయిల్ అనే న్యాయవాదిని ఒక వ్యక్తి హత్య చేయడాన్ని నిరసిస్తూ ఉట్నూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులు బహిష్కరించారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు.
ADB: జిల్లాలోని నార్నూర్ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర బృందం సభ్యులు ఆదిలాబాద్కు వచ్చారు. డైరెక్టర్ మృత్యుంజయ ఝా, శుభోద్ కుమార్ డిప్యూటీ సెక్రటరీలను స్థానిక పెన్ గంగా గెస్ట్ హౌస్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా మర్యాద పూర్వకంగా కలసి పూలమొక్కను, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వారితో పలు అంశాలపై చర్చించారు.