• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘పకడ్బందీగా ఇంటర్ పరీక్షలను నిర్వహించాలి’

KMM: జిల్లాలో ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ.పద్మజ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 36,660 మంది విద్యార్థుల కోసం 72 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేస్తామన్నారు.

February 3, 2025 / 05:22 PM IST

ఘనంగా వసంత పంచమి వేడుకలు

JGL: కోరుట్ల అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం రోజున సరస్వతీమాత జన్మదినమైన వసంతపంచమిని పురస్కరించుకుని అర్చకులు గౌతం శర్మ, వినయ్ శర్మల నిర్వహణలో అమ్మ వారి మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం150 మంది విద్యార్థులకు అక్షరాభ్యాసం చేసి పుస్తక పూజ, విజయ కంకణధారణ చేశారు. మచ్చ వాణీ వెంకటరమణ స్వామివారికి బంగారు కిరీటాన్ని అందించారు.

February 3, 2025 / 04:57 PM IST

మానవత్వం చాటుకున్న భద్రాచలం ఎమ్మెల్యే

BDK: ఛత్తీస్‌గఢ్ నుంచి చర్లకు వస్తున్న ఓ కుటుంబం సోమవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. చర్ల సరిహద్దుల్లో టూ-వీలర్, టాటా మ్యాజిక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న భద్రాచలం ఎమ్మెల్యే క్షతగాత్రులను పరిశీలించి, తన సహాయకులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యేను స్థానికులు ప్రశంసించారు.

February 3, 2025 / 04:50 PM IST

సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలు దగ్ధం

BDK: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు, రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదని కేవలం కార్పొరేట్ వర్గాల వారికి మాత్రమే ఉపయోగపడుతుందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శరత్ బాబు అన్నారు. కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో బడ్జెట్ పత్రాలు దగ్ధం చేశారు.

February 3, 2025 / 03:43 PM IST

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ డిగ్రీ ఫీజు గడువు పెంపు

PDPL: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువును ఫిబ్రవరి 4 వరకు పొడిగించడంపై కళాశాల కో-ఆర్డినేటర్ అబ్దుల్ షుకూర్ వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం కళాశాలలోని వర్సిటీ అభ్యాసకుల సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

February 3, 2025 / 03:43 PM IST

ఆజామ్ జాహీ మిల్లుపై మావోయిస్టు పార్టీ లేఖ

ములుగు: ఆజామ్ జాహీ మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో సోమవారం ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.

February 3, 2025 / 03:41 PM IST

ఆలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

హనుమకొండ: దామెర మండలంలోని పులుకుర్తి గ్రామంలో బాల మానసాదేవి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నేడు భూమి పూజ నిర్వహించారు. గ్రామస్తులు ఐకమత్యంగా ఉంటూ మానస దేవి ఆలయాన్ని నిర్మిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారాయితోపాటు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

February 3, 2025 / 03:23 PM IST

నాటు సార స్థావరాలపై దాడులు నిర్వహించిన పోలీసులు

BDK: వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామంలో నాటు సారా కాస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం పోలీసులు నిర్వహించిన దాడుల్లో భాగంగా 2 వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు ఎస్సై కే.తిరుపతిరావు తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామన్నారు. ఎవరైనా నాటు సారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 3, 2025 / 02:14 PM IST

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

KMM: కేంద్రం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్‌కు నిరసనగా సోమవారం ఎర్రుపాలెం మండలం వెంకటపురంలో సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పార్టీ గ్రామశాఖ కార్యదర్శి కుడెల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలో 50 శాతానికి పైబడి వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తుండగా ఆ రంగంపైనా ఉదాసీన వైఖరి అవలంభించారని పేర్కోన్నారు.

February 3, 2025 / 01:49 PM IST

బడ్జెట్ లో అన్యాయంపై కాంగ్రెస్ నిరసన

KMM: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అయన పాల్గోని మాట్లాడారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్నా తెలంగాణకు నిధులు తీసుకురాలేదని, దీనికి బీజేపీ ఎంపీలు సిగ్గుపడాలన్నారు.

February 3, 2025 / 01:25 PM IST

మల్లు నందినిని కలిసిన నూతన ఆత్మ కమిటీ సభ్యులు

KMM: మధిర నియోజకవర్గ నూతనంగా ఎన్నికైన ఆత్మ కమిటీ సభ్యులు సోమవారం మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు నందిని విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమకి ఇంతటి చక్కని అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

February 3, 2025 / 01:04 PM IST

యాక్సిడెంట్.. MLA గన్‌మెన్ మృతి

HYD: రోడ్డు ప్రమాదంలో MLA గన్‌మెన్ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం శంకర్‌పల్లి మండలం బుల్కాపూర్‌కు చెందిన శ్రీనివాస్(34) ఆదివారం బీరప్ప జాతరకెళ్లాడు. జాతర ముగించుకుని స్వగ్రామానికి బయల్దేరాడు. కొండకల్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ చేవెళ్ల MLA కాలే యాదయ్య వద్ద గన్‌మెన్‌గా పని చేస్తున్నాడు.

February 3, 2025 / 11:15 AM IST

శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు

HYD: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సంపత్‌నగర్, ఊట్పల్లిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సంపత్‌నగర్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమించి కబ్జా చేసిన కట్టడాలు, ఊట్పల్లిలో రోడ్డును ఆక్రమించి అడ్డంగా గేటు ఏర్పాటు చేయడంతో చర్యలు ప్రారంభించారు. నాలాలు, చెరువులను కబ్జా చేస్తే సహించేది లేదని అధికారులు హెచ్చరించారు.

February 3, 2025 / 10:40 AM IST

బాలుడి ఆవిష్కరణకు సీఎం రేవంత్ ప్రశంస

HYD: హైబ్రిడ్ సైకిల్‌ను రూపొందించిన 14 ఏళ్ల చిన్నారి గగన్ చంద్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ చిన్నారి ఆవిష్కరణ తన దృష్టిని ఆకర్షించిందని ట్వీట్ చేశారు. అతనికి అభినందనలు తెలిపారు. మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు చేసేందుకు గగనకు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. కాగా గగన్ సోలార్, బ్యాటరీ, పెట్రోల్తో నడిచే సైకిల్‌ను రూపొందించాడు.

February 2, 2025 / 08:03 PM IST

‘మారుమూల గ్రామాల రూపు రేఖలు మారుస్తాం’

NRML: మారుమూల గ్రామీణ ప్రాంతాల రూపు రేఖలను మార్చడానికి ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందనీ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఆదివారం పెంబి పట్టణ కేంద్రంతో పాటు మండలంలోని గుమ్మెన, ఎంగులాపూర్, చాకిరేవు, వస్ పల్లి, దొత్తి వాగు, పసుపుల నాయకపు గూడ,కొలంగూడ, హరిచంద్ తండా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.

February 2, 2025 / 07:43 PM IST