WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం పోటెత్తింది. రెండు రోజుల సుదీర్ఘ సెలవు తర్వాత వరంగల్ మార్కెట్ మళ్లీ తెరవడంతో, రైతులు భారీగా మిర్చిని తరలించారు. సుమారు 60 వేలకు పైగా మిర్చి బస్తాలు చేరుకోవడంతో, అధికారులు తక్షణమే కాంటాలు ఏర్పాటు చేసేందుకు ఉపక్రమించారు. మంగళవారం జరిగిన వేలంలో దేశీ మిర్చి ధర రూ. 28,000కు చేరింది.
WGL: వరంగల్ తూర్పుకోటలో గుప్త నిధుల కోసం సొంతింటిలోనే గొయ్యి తవ్విన ఉదంతం మంగళవారం వెలుగు చూసింది. గోనెల శ్రీనివాస్ ఇంట్లో కొంత మంది పెద్దగా శబ్దాలు చేస్తూ పూజలు చేస్తున్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో గుట్టు బయటపడింది. పోలీసులు అక్కడకు రావడంతో, కొంత మంది పరారయ్యారు, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు విచారిస్తున్నారు
WGL: నేటి నుంచి 27 వరకు వరంగల్లోని నక్కలపల్లి రోడ్డులో రాష్ట్రస్థాయి రైతు ఉత్పత్తిదారు సంఘాల మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యశారదా దేవి ఒక ప్రకటనలో తెలిపారు. స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 3రోజులు ఈ మేళా ఉంటుందని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
MLG: తాడ్వాయి మండలంలోని విండ్ ఫాల్ అటవీ ప్రాంతంలో సోమవారం గుర్తు తెలియని మృతదేహం బయటపడటం స్థానికుల్లో ఆందోళన నెలకొల్పింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడారం మినీ జాతరకు కుటుంబంతో కలిసి వచ్చిన ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడని ఫిర్యాదు అందిందని, ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WGL: నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన ఇవాళ సంగెం మండలంలోని ఆశాలపల్లిలో చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజమహకూర్ తన కుటుంబంతో కలిసి మూడు నెలలుగా ఆశాలపల్లి శివారులోని ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు. వారి ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి అక్కడే ఉన్న నీటి తొట్టిలో పడిపోయింది. వేంటనే MGM ఆసుపత్రికి తరలించినా, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
MNCL: తాండూర్ మండలంలో 247 కేజీల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం డీసీపీ భాస్కర్ వివరాలను వెల్లడించారు. మండలంలో తనిఖీలు చేయగా రూ.6,17,500 విలువ చేసే 247 కిలోల పత్తి విత్తనాలు లభ్యమయ్యాయన్నారు. ఐదుగురు కొనుగోలుదారులు, ముగ్గురు డ్రైవర్లను అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు మనోహర్ రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు.
NRML: రోడ్డు ఆక్రమణలు చేసి వ్యాపారాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా హెచ్చరించారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని ప్రధాన రహదారులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రయాణికులకు ఇబ్బందులకు గురి చేస్తూ రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు.
BHPL: భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దివస్ కార్యక్రమంలో ఎస్పీ కిరణ్ ఖరే పాల్గొన్నారు. ఈ సందర్భంగా 21 మంది ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసు అధికారులు ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి సమస్యపై విచారణ చేసి ప్రజలకు తగిన న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
ADB: జలవనరులు, భూవనరుల విభాగం న్యూఢిల్లీ నుంచి నీటి వనరుల పునరుజ్జీవనం అమలుపై చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ NITI ఆయోగ్ అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. చెరువుల్లో పూడికతీతతో నీటి నిల్వలు పెరుగుతాయన్నారు. చెరువుల పరిధిలో ఆయకట్టు సాగుకు నీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
ASF: జిల్లా కాగజ్నగర్ అరుణోదయ స్కూల్ విద్యార్థులకు షీ టీం ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత, ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్లు వంటి అంశాలపై ఎఎస్ఐ సునీత వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో షీ టీం హెల్ప్ లైన్ 87126 70565 లేదా డయల్ 100 ద్వారా సహాయం కోరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లలిత, టీచర్లు, షీ టీం పాల్గొన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కల్వరాల గ్రామానికి చెందిన 33 మంది రైతులకు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లాపూర్ శాసనసభ్యులు జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు సోమవారం స్ప్లింకర్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా హార్టికల్చర్ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించుకుని ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలని సూచించారు.
MNCL: రామగుండం CP అంబర్ కిషోర్ ఝా సోమవారం కన్నెపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించారు. స్టేషన్ పరిసరాలు పరిశీలించి, సిబ్బందితో సీపీ మాట్లాడారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మావోయిస్టుల వివరాలు పరిశీలించి వారి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవనం పరిశీలించి, త్వరగా పనులు పూర్తిచేయాలన్నారు.
BHPL: కాటారం మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో పలువురు నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉద్యమ నాయకులు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు ఇచ్చిన 250 గజాల ఇంటి స్థలం, రూ.25,000 నగదు సహాయాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నేతలు పాల్గొన్నారు.
NRPT: జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నారాయణపేట కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజల కోసం రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు అంబలి కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల కలెక్టర్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
SRPT: క్షయ వ్యాధి నివారణ అందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ తేజస్ పేర్కొన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. జిల్లాలో 491 వ్యాధిగ్రస్తులు ఉన్నారని వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. క్షయ వ్యాధి అంతానికి అందరితో కలిసి పనిచేస్తానని ప్రతిజ్ఞ చేయించారు.