MHBD: సీరోల్ మండలం కొత్తూరు (సీ) గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. కొత్త సరోజన (60), ఆమె కుమారుడు శేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
RR: మైలార్ దేవుపల్లి డివిజన్ పరిధిలోని బాబు రెడ్డి నగర్ మార్కండేయ నగర్ హైవే రోడ్పై డివైడర్ పనులు జరుగుతున్నాయి. దీనివల్ల స్థానికులు రోడ్డు దాటడానికి ఇబ్బందిగా ఉందని చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుందని కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డికి తెలియజేశారు. దీంతో పనులను కార్పొరేటర్ పరిశీలించారు. GHMC అధికారులు, ట్రాఫిక్ సీఐతో మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
RR: VIP విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీనివాసుడిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిపారసు లేఖలు అనుమతిస్తునందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయిడుకి, ఛైర్మన్ బీఆర్ నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో పీఓ ఖుష్బూ గుప్తాను CITU జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్, ANMలతో కలిసి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న ఏఎన్ఎంలకు పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. వారి సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
ADB: ఉట్నూర్ పట్టణంలోని ఐటీడీఏ ఉద్యానవన నర్సరీలో పెంచుతున్న పుచ్చకాయ తోటను ప్రాజెక్ట్ అధికారి కుష్బూ గుప్త పరిశీలించారు. బుధవారం సాయంత్రం ఆమె ఉద్యానవన నర్సరీని సందర్శించి అక్కడ పెంచుతున్న పుచ్చకాయ తోటను పరిశీలించి హార్టికల్చర్ ఆఫీసర్ సందీప్ కుమార్ను వివరాలు అడిగి తెలుసుకుని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐటీడీఏ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నేడు మాదక ద్రవ్యాల వినియోగంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో మాదకద్రవ్యాల నివారణకు అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులు సమీక్షించారు. యువతను చైతన్యవంతం చేస్తూ ముద్రించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. డీసీపీ సలీమా, జిల్లా రెవెన్యూ అధికారి గణేష్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.
SDPT: హుస్నాబాద్ పట్టణానికి 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో సౌకర్యాలు లేని ప్రదేశాలలో ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మించవద్దని బీఎస్పీ పార్టీ హుస్నాబాద్ నియోజక వర్గ ఇంఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు సౌకర్యాలు ఉన్న ప్రాంతంలో కాలేజ్ను నిర్మించాలని అన్నారు. ఈ సమావేశంలో మారేపల్లి సుధాకర్, శంకర్ పాల్గొన్నారు.
SRD: ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో వైద్యశాఖపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి మాత శిశు మరణాల రేటు 50% తగ్గినట్లు చెప్పారు. ఆసుపత్రులకు వచ్చే రిస్కు కేసులు ఏరియా ఆసుపత్రిలో వైద్యం అందేలా చూడాలని సూచించారు.
MNCL: జన్నారం మండలంలోని కలమడుగు జడ్పీ పాఠశాల విద్యార్థులకు ఆర్బీఎస్కే వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలను పంపిణీ చేశారు. బుధవారం ఆర్బీఎస్కే జిల్లా సహాయ అధికారి గౌరీ శంకర్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కంటి చూపు సమస్య ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా కళ్లద్దాలను వాడాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం రాజమౌళి ఉన్నారు.
KMM: ఖమ్మం నగరానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.188 కోట్ల బడ్జెట్ను కేటాయించినట్లు మున్సిపల్ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య తెలిపారు. ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, మేయర్ నేతృత్వంలో ఈ బడ్జెట్ ను ఆమోదించినట్టు తెలిపారు. వరదలు నియంత్రణ, డ్రైనేజీ అభివృద్ధి, టౌన్ ప్లాన్ తదితర అంశాలకు ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.
KMM: నగరంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల జువాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న బూర్గుల కవితకు కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మొహ్మద్ జాకీరుల్లా మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ కాలేజ్ అధ్యాపకులకు డాక్టరేట్ రావడం సంతోషంగా ఉందన్నారు.
MNCL: జన్నారం మండలంలో 132 కెవి సబ్స్టేషన్ నిర్మించాలని మండల ప్రజలు కోరారు. జన్నారం మండలం పూర్తిగా వ్యవసాయ రంగం మీద ఆధారపడింది. దీంతో విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతుంది. అయితే విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో తరచూ విద్యుత్ సమస్యలు ఎదురవుతున్నాయి. మండలంలో 132 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
ADB: తాంసి మండల కేంద్రంలో మట్కా నిర్వహిస్తున్న ఇద్దరిని పట్టుకున్నట్లు తాంసి ఎస్సై రాధిక తెలిపారు. చింతల వార్ శైలేష్ స్థానికంగా మట్కా నిర్వహిస్తుండగా పట్టుకొని విచారించగా ఆన్లైన్ ద్వారా మట్కా నిర్వహిస్తున్నానని తనతోపాటు పాండ్ర అజ్జు భాయ్ అనే వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిపాడు. రూ.29,360లు, ఒక మొబైల్ మట్కా చిట్టీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
NZB: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించే మహిళా సంఘాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా మద్దతు అందిస్తామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు భరోసా కల్పించారు. మంగళవారం నిజామాబాద్ నగరంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 110 ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.