• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సై

WGL: ఖానాపురం(M)లోని కొత్తూరు గ్రామంలో జై భీమ్ యోజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శుక్రవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్సై రఘుపతి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 20, 2026 / 04:30 PM IST

తూప్రాన్‌లో ప్రపంచ పిచ్చుక దినోత్సవ వేడుకలు

MDK: తూప్రాన్ గురుకుల పాఠశాలలో ప్రపంచ పిచ్చుక దినోత్సవం పురస్కరించుకొని వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు అటవీ శాఖ తూప్రాన్ రేంజ్ ఆఫీసర్ అంబర్ సింగ్ తెలిపారు. గురుకుల పాఠశాలకు చెందిన 8, 9 తరగతుల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

March 20, 2026 / 04:28 PM IST

మాడ్యులర్ కిచెన్ ప్రారంభించిన కలెక్టర్’

PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ రామగిరి కేజీబీవీలో నూతనంగా ఏర్పాటు చేసిన మాడ్యులర్ కిచెన్ ప్రారంభించారు. ఇందులోని స్టీమ్ రైస్ బాయిలర్, ఆటోమేటిక్ రోటి మేకర్, ఇడ్లీ బ్రాయిలర్, ఎల్పీజీ గ్యాస్ లైన్, 18 డైనింగ్ టేబుల్స్ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే మండలంలో తహసిల్దార్ కార్యాలయం నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని సూచించారు.

March 20, 2026 / 04:27 PM IST

పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించాలి: కలెక్టర్

BHNG: విద్యార్థులు కష్టపడి చదివి పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. శుక్రవారం చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య, విద్యా పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

March 20, 2026 / 04:26 PM IST

ఎస్సీ అభ్యర్థులకు దరఖాస్తులకు ఆహ్వానం

SRD: షెడ్యూల్ కులాలకు చెందిన అభ్యర్థులకు వివిధ పథకాల లబ్ధి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు MPDO శారద తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సోలార్ పంపు, విద్యుత్ ద్విచక్ర వాహనాల అవసరానికి గాను 2025-26 ప్రకారం బ్యాంకు ద్వారా రుణ సహాయం పొందవచ్చన్నారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు ఈనెల 24 వరకు ఆన్‌లైన్‌లో https://tgobmms.cgg.gov.in దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

March 20, 2026 / 04:25 PM IST

అధ్యక్ష పదవీ కోసం పార్టీ అధిష్ఠానం సన్నాహాలు

VKB: జిల్లా బీజేపీ అధ్యక్ష పదవీ భర్తీ కోసం రాష్ట్ర నేతలు స్థానిక హోటల్‌లో సీనియర్ నాయకుల అభిప్రాయాలను సేకరించారు. గతంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పదవి నుంచి తొలగించబడి, కర్ణం ప్రహల్లాద్ రావు కన్వీనర్‌గా నియమితులయ్యారు. కొత్త పోటీలో శివరాజ్, రమేష్ తదితరులు పాల్గొంటున్నారు. అధిష్ఠానం త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నారు.

March 20, 2026 / 04:22 PM IST

మన్నెగూడెంలో కొత్త వాటర్ ప్లాంట్ ప్రారంభం

MBNR: బాలానగర్ మండలం మన్నెగూడెం తండాలో శుక్రవారం సర్పంచ్ రాజు నాయక్, ఉపసర్పంచ్ హిర్య నాయక్ పాల్గొని నూతన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. గ్రామస్తులకు పరిశుభ్రమైన తాగునీరు అందించడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ప్లాంట్ ద్వారా ప్రజలు సులభంగా సురక్షిత నీటిని పొందగలుగుతారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు కూడా పాల్గొన్నారు.

March 20, 2026 / 04:22 PM IST

పోలీసులు నిజాయితీతో వ్యవహరించాలి: SP

ADB: ప్రతి ఒక్క పోలీసు నిజాయితీతో వ్యవహరించాలని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక పోలీసు సాయుధ ముఖ్య కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధులలో నిర్లక్ష్యాన్ని వహించకూడదని తెలిపారు. సిబ్బంది కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని SP అఖిల్ మహాజన్ కోరారు.

March 20, 2026 / 04:22 PM IST

రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలి: సోమయ్య

JN: రైతు భరోసా నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య అన్నారు. పాలకుర్తి(M) గూడూరు గ్రామంలో రైతు సంఘం కరపత్రాలను ఇవాళ ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర లభించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

March 20, 2026 / 04:20 PM IST

కొత్త పెన్షన్ల మంజూరు నిర్ణయం ఎంతో హర్షణీయం: సీతక్క

MLG: అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మంత్రి సీతక్క కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం మీడియాతో సీతక్క మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధికి వెన్నెముకగా నిలిచే పంచాయతీరాజ్ శాఖకు అత్యధిక కేటాయింపులు చేయడం, సామాజిక భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, రెండు లక్షల కొత్త పెన్షన్ల మంజూరు నిర్ణయం ఎంతో హర్షణీయమని స్పష్టం చేశారు.

March 20, 2026 / 04:20 PM IST

ఆర్టీసీ రక్షణకు ఐక్య పోరాటం చేద్దాం: సీఐటీయూ

SRPT: ప్రైవేట్ విద్యుత్ బస్సుల విధానం వల్ల ఆర్టీసీ మనుగడ, ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడ్డాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు. 2021, 2025 వేతన సవరణలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సూర్యాపేట డిపో వద్ద సంతకాల సేకరణ నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న జరిగే రాష్ట్రవ్యాప్త ధర్నాలో కార్మికులందరూ పాల్గొలని కోరారు.

March 20, 2026 / 04:20 PM IST

నిరుద్యోగ భృతిపై ప్రకటన లేకపోవడం బాధాకరం: అశోక్

HNK: రాష్ట్ర యువత ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ భృతిపై బడ్జెట్‌లో ప్రకటన లేకపోవడం బాధాకరమని తెలంగాణ ఉద్యమకారుడు అమ్మ అశోక్ అన్నారు. బడ్జెట్‌లో జాబ్ క్యాలెండర్‌కు సంబంధించి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్‌కు యువత తగిన గుణపాఠం చెప్తారన్నారు.

March 20, 2026 / 04:14 PM IST

భూమి పూజ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

BHNG: కోకాపేట్‌లోని దొడ్డి కొమురయ్య ఆత్మగౌరవ భవనం వద్ద నిర్మించదలచిన పాఠశాల భవనానికి శుక్రవారం భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. దొడ్డి కొమరయ్య చేసినటువంటి గొప్ప పనులను స్మరించుకున్నారు. కార్యక్రమంలో క్యామ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

March 20, 2026 / 04:12 PM IST

పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించిన ఛైర్‌పర్సన్

KMM: ప్రజలకు పరిశుభ్రతపై మధిర ఛైర్‌పర్సన్ సామినేని సుజాత అవగాహన కల్పించారు. మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో శుక్రవారం పారిశుద్ధ్య పనులను ఇవాళ ప్రారంభించారు. వార్డు కౌన్సిలర్ ఎర్రం దాసు చారులత ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. కమిషనర్ సంపత్ కుమార్ పర్యవేక్షణలో కాలువల శుభ్రత, చెత్త తొలగింపు పనులు ముమ్మరంగా సాగాయి.

March 20, 2026 / 04:10 PM IST

‘DCC ఉపాధ్యక్షుడిగా చొప్పరి సదానందం’

PDPL: పెద్దపల్లి DCC ఉపాధ్యక్షుడిగా ముత్తారం మండలం కేసనపల్లికి చెందిన చొప్పరి సదానందం నియమితులయ్యారు. ఈ మేరకు TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సదానందం గతంలో సైతం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. రెండవసారి తిరిగి ఉపాధ్యక్షులుగా నియమితులు కావడంతో పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

March 20, 2026 / 04:05 PM IST