MNCL: జన్నారం మండలంలో 132 కెవి సబ్స్టేషన్ నిర్మించాలని మండల ప్రజలు కోరారు. జన్నారం మండలం పూర్తిగా వ్యవసాయ రంగం మీద ఆధారపడింది. దీంతో విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతుంది. అయితే విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో తరచూ విద్యుత్ సమస్యలు ఎదురవుతున్నాయి. మండలంలో 132 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.