MNCL: జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో రామకృష్ణాపూర్ పట్టణానికి RTC బస్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రైల్వే గేటు సాకుతో దశాబ్దాలుగా బస్సు నడవలేదు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా అదే పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఆటోలే దిక్కవుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మికి స్థానిక మహిళలు నోచుకోలేదు.