ADB: తాంసి మండల కేంద్రంలో మట్కా నిర్వహిస్తున్న ఇద్దరిని పట్టుకున్నట్లు తాంసి ఎస్సై రాధిక తెలిపారు. చింతల వార్ శైలేష్ స్థానికంగా మట్కా నిర్వహిస్తుండగా పట్టుకొని విచారించగా ఆన్లైన్ ద్వారా మట్కా నిర్వహిస్తున్నానని తనతోపాటు పాండ్ర అజ్జు భాయ్ అనే వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిపాడు. రూ.29,360లు, ఒక మొబైల్ మట్కా చిట్టీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.