KMM: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అయన పాల్గోని మాట్లాడారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్నా తెలంగాణకు నిధులు తీసుకురాలేదని, దీనికి బీజేపీ ఎంపీలు సిగ్గుపడాలన్నారు.
KMM: మధిర నియోజకవర్గ నూతనంగా ఎన్నికైన ఆత్మ కమిటీ సభ్యులు సోమవారం మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు నందిని విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమకి ఇంతటి చక్కని అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
HYD: రోడ్డు ప్రమాదంలో MLA గన్మెన్ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం శంకర్పల్లి మండలం బుల్కాపూర్కు చెందిన శ్రీనివాస్(34) ఆదివారం బీరప్ప జాతరకెళ్లాడు. జాతర ముగించుకుని స్వగ్రామానికి బయల్దేరాడు. కొండకల్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ చేవెళ్ల MLA కాలే యాదయ్య వద్ద గన్మెన్గా పని చేస్తున్నాడు.
HYD: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సంపత్నగర్, ఊట్పల్లిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సంపత్నగర్లో ప్రభుత్వ భూమి ఆక్రమించి కబ్జా చేసిన కట్టడాలు, ఊట్పల్లిలో రోడ్డును ఆక్రమించి అడ్డంగా గేటు ఏర్పాటు చేయడంతో చర్యలు ప్రారంభించారు. నాలాలు, చెరువులను కబ్జా చేస్తే సహించేది లేదని అధికారులు హెచ్చరించారు.
HYD: హైబ్రిడ్ సైకిల్ను రూపొందించిన 14 ఏళ్ల చిన్నారి గగన్ చంద్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ చిన్నారి ఆవిష్కరణ తన దృష్టిని ఆకర్షించిందని ట్వీట్ చేశారు. అతనికి అభినందనలు తెలిపారు. మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు చేసేందుకు గగనకు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. కాగా గగన్ సోలార్, బ్యాటరీ, పెట్రోల్తో నడిచే సైకిల్ను రూపొందించాడు.
NRML: మారుమూల గ్రామీణ ప్రాంతాల రూపు రేఖలను మార్చడానికి ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందనీ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఆదివారం పెంబి పట్టణ కేంద్రంతో పాటు మండలంలోని గుమ్మెన, ఎంగులాపూర్, చాకిరేవు, వస్ పల్లి, దొత్తి వాగు, పసుపుల నాయకపు గూడ,కొలంగూడ, హరిచంద్ తండా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.
MDK: శివంపేట మండలం సామ్య తండాలో మదన్ (35) అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. తల్లిదండ్రులు గతంలో మృతి చెందగా, కుటుంబ కలహాల కారణంగా మదన్ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఒంటరిగా ఉన్న మదన్ అనుమానస్పదంగా మృతి చెందారు. హత్య చేసినట్లుగా పలువురు అనుమానిస్తున్నారు.
MDK: వైద్యులు అందుబాటులో ఉండాలని, రోగులకు సేవలందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. రామాయంపేట సి.హెచ్.సీను కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలోని మందులు అందించే గది, రక్త పరీక్షలు చేసే ల్యాబ్, ఇన్ పేషెంట్ వార్డ్, మందులు నిల్వ చేసే స్టోర్రూంను పరిశీలించారు.
SRD: మునిపల్లి మండలం బుదేరా సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. అక్కడే ఉన్న మిషన్ భగీరథ పైపులకు మంటలు వ్యాపించడంతో మంటలు వ్యాపించాయి. అగ్నికి పైపులు దగనమవడంతో మంటలు పెద్ద ఎత్తున అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పివేశారు.
SRD: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ముందు ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాములు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదని విమర్శించారు.
JN: జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన దూడల బాలసిద్దులు కృత్రిమ కాలు పెట్టడానికి డబ్బులు అవసరం పడగా, నిరుపేద కుటుంబం కావడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ మంత్రి కొన్న ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే స్పందించి రూ. 1,25,000 మంజూరు చేయించారు. వారి కుటుంబానికి కిరణ్ ఈరోజు LOC పత్రాన్ని అందజేశారు.
ADB: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
JN: స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలోని శ్రీ తిరుమలనాథ దేవస్థానం ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి స్టేషన్ ఘణపూర్ మాజీ ఎంపీటీసీ గోనెల ఉపేందర్ ముదిరాజ్ కుటుంబ సమేతంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ నిర్మాణానికి రూ.1 లక్షలను ఆలయ ప్రధాన అర్చకులు కలకోట రామానుజాచర్యులుకి విరాళంగా అందజేశారు.
KMR: వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలని డీఆర్డివో పిడి సురేందర్ అన్నారు. లింగంపేట్ మండల పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథ ఇంట్రా గ్రిడ్, పంచాయతీ అధికారులతో తాగునీటి సరఫరాపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
KMR: తాడ్వాయి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాగయ్య ఎంఆర్పీఎస్ సభకు డప్పులతో రావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్కరు డప్పులతో హైదరాబాద్ తరలి లక్ష డప్పుల మాదిగ గుండె చప్పుడు సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి గ్రామం నుంచి బస్సులు వస్తున్నాయని ప్రతి ఒక్కరూ తరలి వచ్చి ముందు కృష్ణ మాదిగకు మద్దతు తెలిపాలి.