• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘పోలీసులు బాధ్యతగా పనిచేయాలి’

BHPL: భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దివస్ కార్యక్రమంలో ఎస్పీ కిరణ్ ఖరే పాల్గొన్నారు. ఈ సందర్భంగా 21 మంది ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసు అధికారులు ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి సమస్యపై విచారణ చేసి ప్రజలకు తగిన న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

March 24, 2025 / 05:59 PM IST

భూగర్భ జలాల సమీక్ష సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా

ADB: జలవనరులు, భూవనరుల విభాగం న్యూఢిల్లీ నుంచి నీటి వనరుల పునరుజ్జీవనం అమలుపై చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ NITI ఆయోగ్ అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. చెరువుల్లో పూడికతీతతో నీటి నిల్వలు పెరుగుతాయన్నారు. చెరువుల పరిధిలో ఆయకట్టు సాగుకు నీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

March 24, 2025 / 05:56 PM IST

విద్యార్థులకు షీ టీం చట్టాలపై అవగాహన

ASF: జిల్లా కాగజ్‌నగర్ అరుణోదయ స్కూల్ విద్యార్థులకు షీ టీం ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత, ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్‌లు వంటి అంశాలపై ఎఎస్ఐ సునీత వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో షీ టీం హెల్ప్ లైన్ 87126 70565 లేదా డయల్ 100 ద్వారా సహాయం కోరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లలిత, టీచర్లు, షీ టీం పాల్గొన్నారు.

March 24, 2025 / 05:51 PM IST

“రైతులకు స్ప్లింకర్లు పంపిణీ చేసిన అధికారులు”

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కల్వరాల గ్రామానికి చెందిన 33 మంది రైతులకు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లాపూర్ శాసనసభ్యులు జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు సోమవారం స్ప్లింకర్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా హార్టికల్చర్ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించుకుని ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలని సూచించారు.

March 24, 2025 / 05:41 PM IST

కన్నెపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన CP

MNCL: రామగుండం CP అంబర్ కిషోర్ ఝా సోమవారం కన్నెపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించారు. స్టేషన్ పరిసరాలు పరిశీలించి, సిబ్బందితో సీపీ మాట్లాడారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మావోయిస్టుల వివరాలు పరిశీలించి వారి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవనం పరిశీలించి, త్వరగా పనులు పూర్తిచేయాలన్నారు.

March 24, 2025 / 05:20 PM IST

ఉద్యమకారుల హామీల అమలుకు డిమాండ్

BHPL: కాటారం మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో పలువురు నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉద్యమ నాయకులు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు ఇచ్చిన 250 గజాల ఇంటి స్థలం, రూ.25,000 నగదు సహాయాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నేతలు పాల్గొన్నారు.

March 24, 2025 / 05:05 PM IST

అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

NRPT: జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నారాయణపేట కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజల కోసం రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు అంబలి కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల కలెక్టర్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.

March 24, 2025 / 04:58 PM IST

క్షయ నివారణ అందరి బాధ్యత: కలెక్టర్

SRPT: క్షయ వ్యాధి నివారణ అందరి బాధ్యతని జిల్లా కలెక్టర్‌ తేజస్ పేర్కొన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. జిల్లాలో 491 వ్యాధిగ్రస్తులు ఉన్నారని వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. క్షయ వ్యాధి అంతానికి అందరితో కలిసి పనిచేస్తానని ప్రతిజ్ఞ చేయించారు.

March 24, 2025 / 04:17 PM IST

‘వెంకేపల్లి నుంచి కోడూరుకు రోడ్డు నిర్మాణం చేపట్టాలి’

SRPT: వెంకేపల్లి నుంచి కోడూరుకు పాలేరు మీదుగా బ్రిడ్జి నిర్మించి రోడ్డు ఏర్పాటు చేయాలని నూతనకల్ మండలం వెంకేపల్లి శివారులోని వాగును, రోడ్డును పరిశీలించిన అనంతరం అధికారుల సమావేశంలో ప్రతిపాదించారు. ఈ ప్రాంత రైతులు తమ వ్యవసాయ పనుల నిమిత్తం వాగు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో వాగు దాటుతుండగా ఒక వ్యక్తి కొట్టుకుపోయిన ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

March 24, 2025 / 04:16 PM IST

“బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు”

SRPT: ఐపీఎల్ క్రికెట్ సీజన్‌ సందర్భంగా యువత ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడవద్దని క్రమశిక్షణతో మంచిగా చదివి ఉన్నత స్థాయిలకు ఎదగాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ అన్నారు. మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని తెలిపారు.

March 24, 2025 / 03:28 PM IST

అకాల వర్షానికి భారీ పంట నష్టం

RR: నిన్న సాయంత్రం భారీ గాలులతో కూడిన వర్షానికి రైతులకి తీవ్ర పంట నష్టం ఏర్పడింది. మడుగుల(M) బ్రాహ్మణపల్లి, నల్లచెరువు, ఇర్విన్, ఆర్కపల్లి, అన్నెబోయినపల్లితో పాటు పలు గ్రామాలలో కురిసిన వర్షానికి అనేక ఎకరాలలో నేలకొరిగిన మొక్కజొన్న, వరి, బొప్పాయి,మామిడి పంటలు నెలరాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి చేస్తున్నారు.

March 24, 2025 / 02:36 PM IST

జడ్జిని కలిసిన నూతన ఎస్పీ

SRCL: ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ప్రేమలతని సోమవారం రోజున కోర్ట్ ప్రాంగణంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురు అధికారులు పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలతో పాటుగా ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కరించి నేరస్థులకు శిక్షలు పడే దిశగా కృషి చేయాలని అన్నారు.

March 24, 2025 / 02:20 PM IST

‘ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి’

ADB: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్ రూమ్, రైతు రుణమాఫీ తదితర సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పించారు.

March 24, 2025 / 01:43 PM IST

ధర్మారంలో ప్రపంచ క్షయ దినోత్సవం

PDPL: ధర్మారం మండల కేంద్రంలోని సాయి మణికంఠ పాఠశాలలో మేడారం PHC వైద్యాధికారి డాక్టర్ సుస్మిత ఆధ్వర్యంలో విద్యార్థులకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. వ్యాధి లక్షణాలు, వ్యాధి సోకే విధానం, చికిత్స మార్గాల గురించి వివరించారు. కటికనపల్లిలో MLHP డాక్టర్ గౌతమ్, కిలా వనపర్తిలో డాక్టర్ రాజు, ఇతర సబ్ సెంటర్లలో ఏఎన్ఎంలు వ్యాధిపై అవగాహన కల్పించారు.

March 24, 2025 / 01:36 PM IST

డిప్లమో కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

KNR: టెక్స్ టైల్ టెక్నాలజీ డిప్లమో కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా జౌలి చేనేత శాఖ సహాయ సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా మంజూరైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ హైదరాబాద్ నందు మొదటి సంవత్సరానికి 60 సీట్లు ఉన్నాయన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.

March 24, 2025 / 12:40 PM IST