NLG: చిట్యాల మండలం వట్టిమర్తిలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మేరి పద్మ కుటుంబానికి దూదిగామ సైదమ్మ ఫౌండేషన్ అండగా నిలిచింది. ఫౌండేషన్ వ్యవస్థాపకులు దూదిగామ స్వామి, సత్తి శనివారం రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా, భవిష్యత్తులో అనేక ఉచిత సేవలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మేడి హరికృష్ణ ఉన్నారు.
ADB: బేల మండలంలోని టాక్లి గ్రామస్తులు మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాతను ఆమె నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని విన్నవించారు. సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ సర్పంచ్ అశోక్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు రుపేష్ రెడ్డి ఉన్నారు.
KMR: జిల్లా బీబీపేట పోలీస్ స్టేషన్లో శనివారం బీబీపేట SI కొండ విజయ్ సమాచార హక్కు పరిరక్షణ కమిటీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం ఆదేశాల మేరకు ఆర్టీఐ బీబీపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్నినిర్వహిచారు. ఈ సందర్భంగా ఎస్సై కొండ విజయ్ మాట్లాడుతూ.. ఆర్టీఐ చట్టం ప్రజలందరికీ ఒక వరం లాంటిదన్నారు.
BHNG: బండకొత్తపల్లి నుంచి దేవరుప్పల వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు గ్రామ సర్పంచ్ గద్వాల ఉపేందర్, పాలకవర్గ సభ్యులు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. రోడ్లు సరిగా లేక గ్రామ ప్రజలకు రాకపోకలకు ఇబ్బందిగా ఉందని వివరించి రహదారిని నిర్మించాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.
NRML: జూనియర్ కళాశాల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు పరుస్తానని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం నిర్మల్ జిల్లా ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ క్యాంపులో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులకు ఆకలి ఇబ్బందులు దూరం కానున్నాయని వారు తెలిపారు.
JGL: జగిత్యాల క్లబ్లో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ వ్యవస్థను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పర్యావరణ పరిరక్షణలో పునరుత్పాదక శక్తి వినియోగం అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ వాణి శ్రీనివాస్, క్లబ్ సెక్రటరీ రాంగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు సతీశ్, మమత రామకృష్ణారెడ్డి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
MLG: మంగపేట మండలం రాజుపేట కప్ప వాగు మలుపు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ కారు అతివేగంగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వారిని ఆంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
WGL: జిల్లాలోని ఎస్సీ యువతకు స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 24వ తేదీలోపు అర్హత కలిగిన షెడ్యూల్ కులాల యువకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని ఈడీ కోరారు.
WGL: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ వరంగల్ పట్టణంలోని ఏకశిలా పార్కు నుంచి అమరవీరుల స్తూపం వరకు ఉమ్మడి జిల్లా BC సంఘం ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు స్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం బీసీల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బీసీల సంక్షేమానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు
MHBD: జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తండ్రి జాటోతు లచ్చనాయక్ ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన చిత్రపటానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సాంభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
పెద్దపల్లి జిల్లాలోని ఆయా క్లస్టర్ల రైతు వేదికల నుంచి సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట సభకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆయా క్లస్టర్ రైతు వేదిక నుంచి బస్సులు బయలు దేరుతాయని తెలిపారు. ఆసక్తిగల రైతులు వ్యవసాయ విస్తరణ అధికారికి ఈరోజు సాయంత్రంలోగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
MNCL: మంచిర్యాల పట్టణంలో రైల్వే స్టేషన్ నుండి శ్రీనివాస్ థియేటర్ వరకు రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిలో రాష్ట్రంలోనే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ను మొదటి స్థానంలో నిలపడమే తన లక్ష్యం అన్నారు. ఇందుకు సహకరిస్తున్న వివిధ శాఖల అధికారులకు కృతజ్ఞత తెలిపారు.
SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని మల్టీ జోన్–1 ఐజీపీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐజీపీకి ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మండపంలో అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి స్వామివారి శేషవస్త్రం కప్పిప్రసాదాన్ని అందజేశారు.
ASF: కాగజ్ నగర్ పట్టణ ఈద్గా వద్ద రంజాన్ పండగ సందర్భంగా నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో MLC విఠల్ శనివారం పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ.. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు పాటించి ఆత్మశుద్ధితో పవిత్ర పండుగను జరుపుకుంటారన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా శాంతియుత వాతావరణంలో జీవించాలని ఆకాంక్షించారు.
ADB: రైతులు తమ పండించిన పంటలను నేరుగా ప్రభుత్వ మార్కెట్ కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. తాంసి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగ కొనుగోలు కేంద్రాన్ని స్థానికులతో కలిసి శనివారం ప్రారంభించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని MLA కోరారు.