KMR: ఓంకారం నుంచే లోకం ఉద్భవించిందని కేశవ్ మహారాజ్ అన్నారు. జుక్కల్ గోవింద్ మఠం కేశవ్ మహారాజ్ శనివారం రోజు భిక్షాటన కార్యక్రమంలో భాగంగా బీర్కూర్ కోదండ రామాలయం చేరుకున్నారు. భక్తులనుద్దేశించి ప్రవచనం ఇచ్చారు. ఆయనకు మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు సాదరంగా స్వాగతం పలికారు.
BDK: లక్ష్మీదేవిపల్లి మండలంలో అకాల వర్షం, వడగండ్ల వాన, ఈదురుగాలుల మొక్కజొన్న పంటలు దెబ్బతిని రైతులు నష్టపోవడం జరిగిందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా అన్నారు. వడగండ్ల వానకు దెబ్బతిన్న మొక్కజొన్న రైతులకు తక్షణమే పరిహారం చెల్లించి ఆదుకోవాలని శనివారం డిమాండ్ చేశారు. అప్పులు చేసి సాగు చేసిన రైతులు నేడు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.
ADB: రైతులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా శనివారం సూచించారు. ఆదిలాబాద్ మండలంలోని అర్లీ గ్రామానికి చెందిన రైతు తుడుం గణపతి ఆత్మహత్య ఘటన బాధాకరమని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఏమైనా సమస్యలుంటే వ్యవసాయ అధికారులు సంప్రదించాలని కోరారు.
WGL: BRS పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు కల్పిస్తామని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 1,2వ డివిజన్ల పార్టీ ముఖ్య నేతలతో ఆరూరి సమావేశం అయ్యారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని, రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాలన్నారు.
HYD: హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలో గత 7 నెలల్లో దాదాపు 100కు పైగా చోరీ కేసులు నమోదయ్యాయి. ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాలని, పోలీసులు సూచించారు. పెరుగుతున్న దొంగతనాలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు నిఘా పెంచి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేస్తూ నిందితుల పట్టివేతకు చర్యలు చేపడుతున్నారు.
SRCL: రాష్ట్ర బడ్జెట్ సవరించి విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీరాముల సంజన అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు నిరసనగా బడ్జెట్ ప్రతులను సిరిసిల్లలో వారు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సంజన మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు విద్యా రంగానికి 15 శాతం బడ్జెట్ ఇస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని తుంగలో తొక్కిందన్నారు.
MDK: తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో పేదలకు CMRF చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి చేతుల మీదుగా ఐదుగురు బాధితులకు మొత్తం రూ.1,16,500 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ఈ నిధులు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని అన్నారు.
SRD: యుద్ధం వద్దు – శాంతి ముద్దు ఈ నినాదమే హద్దుగా పెట్టుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే రాజయ్య అన్నారు. బీరంగూడ మంజీరా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో డాక్టర్ పెంటయ్య, ఇష్ట విద్యా సంస్థల ఛైర్మన్ కార్తీక్, తదితరులు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాల యుద్ధంపై ప్రసంగించారు. ప్రపంచశాంతికై అందరు ప్రయత్నం చేయాలని అన్నారు.
SDPT: కుకునూరు మండలం మంగోల్ గ్రామంలో శనివారం గోటి తలంబ్రాలు కార్యక్రమం నిర్వహించారు. శ్రీ రామకోటి భక్త సమాజం అధ్యక్షులు భక్తిరత్నజాతి అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆధ్వర్యంలో గోటి తలంబ్రాలు కలశాలలో నింపి రామనామ స్మరణతో పురవీధుల్లో హనుమాన్ మందిరం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ 3 గంటలపాటు గోటితో వడ్లను ఒలిచి తలంబ్రాలుగా మార్చారు.
MBNR: జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రేమ లేదని BRSV పాలమూరు యూనివర్సిటీ అధ్యక్షులు కుర్వ గడ్డం భరత్ బాబు అన్నారు. బడ్జెట్ కేటాయింపులో పీయూకీ కేవలం రూ. 20 కోట్లు ఇవ్వడంపై అయన మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాకు తలమానికంగా ఉన్న ఒకే ఒక యూనివర్సిటీకి రూ.100 కోట్లకుపైన ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ. 20 కోట్లకు సరిచేయడం ఏమిటని డిమాండ్ చేశారు.
GDWL: ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం పాగుంట వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. దేశం విద్య, వైద్య రంగాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తున్నట్లు చెప్పారు.
BHNG: వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో వినాయక చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురూపంగా ప్రకాష్, వనం ఉపేందర్ మాట్లాడుతూ.. వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్యం నిర్లక్ష్యం చూపిందన్నారు.
PDPL: ఈనెల 23న జిల్లా కలెక్టరేట్ ముందు ‘గొర్రెల కాపరుల గొంగడి ధర్నా’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు వారు పెద్దపల్లిలో ధర్నాకు సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరించారు. గొర్రెల కాపరుల హక్కులు, ఆత్మగౌరవం, జీవనోపాధి రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ధర్నాలో పాల్గొనాలని సూచించారు.
MNCL: చెన్నూరులో రూ.కోటి 87 లక్షల నిధులతో అమృత్ 2.0 పథకం ద్వారా కుమ్మరికుంట పునర్జీవ అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో శాశ్వత మంచినీటి కరువును శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, తదితరులు పాల్గొన్నారు.
NLG: చిట్యాల మండల సర్పంచులు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్గా నియమితులైన సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశంతో పాటు పలువురు సర్పంచులు పాల్గొన్నారు.