• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కుక్కల దాడిలో 8 గొర్రెలు మృతి

MDK: కుక్కల దాడిలో 8 గొర్రెలు మృతి చెందిన ఘటన చిలిపి చెడు మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. సోమక్కపేటకు చెందిన రైతు శేరి అర్జున్ గొర్రెల పెంపకంపై జీవనం కొనసాగిస్తున్నాడు. గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేయడం వలన 8 గొర్రెలు మృతిచెందగా, 12 గొర్రెలు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. రైతును ప్రభుత్వం అదుకోవాలని తోటి రైతులు కోరారు.

February 1, 2025 / 10:34 AM IST

మొబైల్ ద్వారా నగదు రహిత రైల్వే టికెట్‌పై అవగాహన

NLG: మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్ ఆధ్వర్యంలో శనివారం UTS మొబైల్ అప్లికేషన్ ద్వారా టికెట్ తీసుకునే విధానంపై రైల్వే ప్రయాణికులకు అవగాహన కల్పించారు. రైల్వే ప్రయాణికులు క్యూలైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా మొబైల్ అప్లికేషన్ ద్వారా త్వరగతిన టికెట్ తీసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 1, 2025 / 10:22 AM IST

రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్ మృతి

NZB: రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్​ మృతి చెందిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. నిజామాబాద్ నగరానికి చెందిన మహిపాల్ ఓ ఛానెల్​లో కెమెరా మెన్​గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అలీసాగర్​ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి అతనిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

February 1, 2025 / 10:13 AM IST

వారసిగూడ మహిళ మృతి కేసులో ట్విస్ట్

HYD: సికింద్రాబాద్ వారసిగూడ మహిళ మృతి కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈనెల 22న తల్లి లలిత చనిపోగా డిప్రెషన్‌కు గురైన ఇద్దరు కూతుళ్లు చనిపోదామనుకుని సూసైడ్ లెటర్ రాశారు. కాగా నిన్న విషయం బయటకు రావడంతో పోలీసులు ఘటనా స్థలంలో ఆ సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. అయితే తండ్రి రాజుతో ఇద్దరు కూతుళ్లకు గొడవ జరగగా ఐదేళ్లుగా ఆయన దూరం వెళ్లిపోయాడు.

February 1, 2025 / 10:06 AM IST

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన రాణా ప్రతాపరెడ్డి

WGL: తీవ్ర అనారోగ్యానికి గురై ఇటీవల మరణించిన మేడిపల్లి కిరణ్ కుటుంబాన్ని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి పరామర్శించారు . కిరణ్ చిత్రపటానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పార్టీ మండల అధ్యక్షుడు వినయ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రతాపరెడ్డి, బచ్చు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

February 1, 2025 / 10:04 AM IST

మాజీ మున్సిపల్ ఛైర్మన్ ను సన్మానించిన కేటీఆర్

SRPT: కోదాడ మున్సిపల్ ఛైర్మన్‌గా నాలుగు సంవత్సరాలు పదవి బాధ్యతలు నిర్వహించిన వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాదులో వారి పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా సన్మానించారు. కోదాడ పట్టణ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు.

February 1, 2025 / 09:50 AM IST

పేదల సొంతింటి కల నెరవేరడం లేదు’

MDK: నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిరూపయోగంగా మారాయి. నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడం కోసం ప్రభుత్వం 80 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టి దాదాపు 5 సంవత్సరాలు గడుస్తుంది. నిర్మాణాలు పూర్తయినప్పటికీ నిరుపేదలకు కేటాయించడంలో నిర్లక్ష్యం వహించడంతో అవి పూర్తిగా శిథిలావస్థకు చేరాయి.

February 1, 2025 / 09:37 AM IST

వృథాగా మంచినీరు!

HYD: బాచుపల్లి రహదారిలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ 100 ఫీట్ల బీటీ రోడ్డు పక్కన వేలాది లీటర్ల మంచినీరు వృథాగా పోతుందని స్థానికులు తెలిపారు. అశోక్ మనోజ్‌నగర్ పక్కనే ఈ పరిస్థితి ఉందన్నారు. దీనిపై అధికారులు స్పందించి, వాటర్ లీకేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. వృథా అయిన మంచినీరు రోడ్డు పై ఏరులై పారుతోందన్నారు.

February 1, 2025 / 09:33 AM IST

బాచుపల్లి-మల్లంపేట రోడ్‌లో నిత్యం ట్రాఫిక్ జామ్

HYD: బాచుపల్లి-మల్లంపేట రోడ్డులో వాహనదారులు నిత్యం నరకం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, రాత్రి తీవ్రంగా ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడి ప్రయాణానికి రెండు గంటలు ఆలస్యం అవుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు తగిన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.

February 1, 2025 / 09:24 AM IST

భద్రాద్రిలో కంచర్ల గోపన్న జయంతి ఉత్సవాలు

BDK: కంచర్ల గోపన్న 392వ జయంతి ఉత్సవాలకు భద్రాద్రి శనివారం ముస్తాబయింది. ఐదు రోజులపాటు వాగ్గేయకారోత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. నేటి నుంచి 5వ తేదీ వరకు చిత్రకూట మండపంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల సంగీత, వాయిద్య కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

February 1, 2025 / 09:22 AM IST

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఆటో

BDK: ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటన మణుగూరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. సమితి సింగారం రామాలయం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణం చేస్తున్న పున్నం ప్రణీత్, పున్నం పవన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 1, 2025 / 09:16 AM IST

శంషాబాద్ టు ఫుకెట్.. కొత్తగా ఎయిర్ ఇండియా విమానం

RR: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పర్యాటక కేంద్రమైన ఫుకెటు నూతన విమాన సర్వీసును ప్రారంభించినట్లు GMR అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా GMR సీఈవో ప్రదీప్ ఫణీకర్ మాట్లాడుతూ.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు తొలి విమాన సర్వీసు శుక్రవారం బయలుదేరిందని వివరించారు.

February 1, 2025 / 09:15 AM IST

వరంగల్ పోలీసులకు పతకాలు

WGL: రాష్ట్ర పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీసులు ఆర్చరీలో రికార్డు సృష్టించారు. ఈ క్రీడలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఏకంగా ఐదు పతకాలను సాధించారు. మూడు బంగారు పతకాలతో పాటు ఒక రజతం, ఒక కాంస్యం పతకాన్ని గెలుచుకున్నారు. ఎస్ఐ అనిల్ వేర్వేరు విభాగాల్లో మూడు బంగారు పతకాలు సాధించగా, ఎస్ఐ రాజేందర్, కానిస్టేబుల్ రాహుల్ ఒలింపిక్ విభాగంలో రజతం, కాంస్య పతకాలు సాధించారు.

February 1, 2025 / 09:05 AM IST

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

KMR: సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగ చేయాలని ప్రముఖ యోగ గురువు పరమార్థ దేవ్ అన్నారు. కామారెడ్డిలో యోగా శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఉల్లాసంగా ఉంటారని తెలిపారు.

February 1, 2025 / 09:01 AM IST

భార్య మృతి చెందిందని యువకుడి ఆత్మహత్య

SDPT: ఉరేసుకుని యువకుడు మృతి చెందిన ఘటన ములుగు మండలం బహిలంపూర్‌లో శుక్రవారం జరిగింది. ఎస్ఐ విజయ్ కుమార్ వివరాలు.. వర్గల్ మండలంలోని మైలారానికి చెందిన భాను(22) భార్య మూడు నెలల కిందట ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న భాను 26న బహిలంపూర్ బంధువుల ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

February 1, 2025 / 08:49 AM IST