మేడ్చల్: ఈస్ట్ జోన్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ని వారి కార్యాలయంలో ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కొరకు నిధులు శాంక్షన్ చేయాల్సిందిగా అలాగే వేసవిని దృష్టిలో ఉంచుకుని బాక్స్ డ్రైనేజీ పనులను కోరారు.