WNP: గోపాల్పేట్ మండలంలో శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి దేవాలయం నిర్మించి 100 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ అధ్యక్షుడు ఆదిత్య రెడ్డిని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గోపాల్ పేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
KMR: రంజాన్ పర్వదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొని ప్రార్ధనలు నిర్వహించారు. ఈ కార్యక్రమలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పూల బోకె అందించి షబ్బీర్ అలీకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మైనార్టీలు ప్రార్థనలు చేశారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య వేడుకలు జరిగాయి.
JN: జిల్లాలో జనగణన–2026 కోసం టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేశామన్నారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు ఇంటర్వ్యూల ద్వారా ఒకరిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
NRML: ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా సారంగాపూర్ ఉప అటవీ క్షేత్రాధికారి ఎండి నజీర్ ఖాన్ రాష్ట్ర స్థాయి ఉత్తమ అటవీ అధికారిగా ఎంపికయ్యారు. అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ, అవగాహన కార్యక్రమాల్లో విశేష కృషికి ఈ అవార్డు దక్కింది. మార్చి 23న హైదరాబాద్లోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో మంత్రి కొండ సురేఖ తదితరుల చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
SRD: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రోజు కూలి రూ.800 చెల్లించాలని సీపీఎం పార్టీ పటాన్ చెరు డివిజన్ కార్యదర్శి నాగేశ్వరరావు అన్నారు. శనివారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గుమ్మడిదల మండలం కానుకుంట, రామ్రెడ్డి బావి గ్రామాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
JGL: భూపతిపూర్ పద్మశాలి సేవాసంఘం అభివృద్ధికి డాక్టర్ వాసాల శ్రీధర్ ఆర్థికసాయం అందించారు. తన తండ్రి స్వర్గీయ లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థం రూ.1 లక్ష విరాళాన్ని సంఘ సభ్యులకు అందజేశారు. శ్రీధర్ సేవాగుణాన్ని అభినందిస్తూ సంఘ అధ్యక్షుడు కటుకం సతీశ్, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులను సంఘ భవన అభివృద్ధికి వినియోగించనున్నట్లు వారు పేర్కొన్నారు.
SRPT: తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. బంకులకు వెళ్లిన ప్రజలకు “స్టాక్ లేదు” అనే సమాధానం తప్ప మరొకటి జవాబు రావడం లేదు. అయితే ఇదే సమయంలో బ్లాక్ మార్కెట్లో మాత్రం ఇంధనం లభ్యత పెరిగి, అది కూడా అధిక ధరలకు అమ్ముడవుతున్న పరిస్థితి స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
KNR: భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ ముత్యాల తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసే ప్రత్యేక కార్యక్రమాన్ని ఆర్టీసీ లాజిస్టిక్స్ గత పది రోజులుగా విజయవంతంగా నిర్వహిస్తోందని ATM-L వెంకటనారాయణ, RME బి.రాజు, DME ఎన్. అన్వేష్ తెలిపారు. బుక్ చేసుకోవాలనుకునే భక్తులు KNR బస్టాండ్లోని లాజిస్టిక్స్ కౌంటర్ను 24 గంటలు సంప్రదించవచ్చని సూచించారు.
HYDలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వీటిని సాధారణ చెత్తలో కలిపితే సీసం, లెడ్, పాదరసం వంటి ప్రమాదకర లోహాలు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఈ వ్యర్థాల్లో ప్లాటినం, కాపర్, సెలీనియం వంటి విలువైన లోహాలు కూడా ఉన్నాయని కాలుష్య నియంత్రణ మండలి శాస్త్రవేత్త ప్రసన్న కుమార్ తెలిపారు.
ADB: నార్నూర్ మండలంలోని మాలేపూర్ గ్రామంలో సాగు చేస్తున్న గంజాయి తోటపై శనివారం పోలీసులు దాడి చేశారు. సీఐ ప్రసాద్, SI శ్రీసాయి వివరాల ప్రకారం.. మాలేపూర్కు చెందిన బాలాజీ అనే వ్యక్తి తన వ్యవసాయంలో గంజాయి సాగు చేస్తున్నాడని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మొత్తం 24 మొక్కలు స్వాధీనం చేశామన్నారు. దీన్ని విలువ రూ.2,40,000 ఉంటుందని అంచనా వేశారు.
HNK: ప్రతిపాదిత బడ్జెట్ సవరించి పేదలకు న్యాయం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. హానుమకొండ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ సంక్షేమ రంగాలకు ప్రభుత్వం కోత పెట్టిందని, ఇది పేదలు, దళితులు, రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని మండిపడ్డారు.
KMM: బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రేపటి నుంచి ఈనెల 26 తేదీ వరకు మండలస్థాయి క్రికెట్, కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు ఇవాళ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మోదుగు సుధీర్ బాబు పాల్గొన్నారు. క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
NGKL: దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో కొలువైన సలేశ్వరం లింగమయ్య క్షేత్రం తెలంగాణ అమరనాథ్ యాత్రగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం సాక్షాత్తు బ్రహ్మదేవుడు స్వయంగా ఈ లింగమయ్యను ఇక్కడ ప్రతిష్టించారని ప్రతీతి. క్రీస్తు శకం 13వ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు “మల్లికార్జున పాండితారాధ్య చరిత్ర”లో ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని వర్ణించారు.
MDK: శివంపేట మండలం గుండ్లపల్లిలో పదేళ్ల క్రితం దెబ్బతిన్న బోర్లకు సర్పంచ్ పెంజర్ల మమత నర్సింహ యాదవ్ మరమతులు చేయించారు. తాటి కిష్టయ్య, తాడేపు అంజయ్య ఇళ్ల వద్ద పదేళ్ల క్రితం ఇరుక్కుపోయిన బోర్లను బయటకు తీశారు. నూతనంగా మోటర్లు ఏర్పాటు చేసి, ప్రారంభించారు. వేసవి దృష్ట్యా నూతన మోటర్లు ఏర్పాటు చేసి నీరు అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
మంచిర్యాల జిల్లా భీమారం మండలం కాజిపల్లి గ్రామ సర్పంచ్ కొండ శ్యామల శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి వివేక్ వెంకట స్వామి ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి, గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మి, మాజీ సర్పంచ్ కొండా చంద్రశేఖర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.