WGL: నేటి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఘనంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో, క్రికెట్ బెట్టింగ్లను అరికట్టేందుకు వరంగల్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సీజన్లో బెట్టింగ్ కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తూ, దీనిని నియంత్రించడానికి పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.