ADB: భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో పంట చేలలోని బోరు బావుల వద్ద నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం తాంసి మండలంలోని గిరిగామ గ్రామంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. NREGS ద్వారా నీటి ఎద్దడి నివారణకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.