PDPL: శనివారం జరిగిన 10వ తరగతి హిందీ పరీక్షకు 99. 87 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి తెలిపారు. అదనపు కలెక్టర్ వేణు 1 పరీక్షా కేంద్రాన్ని, 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 16 సెంటర్లను, అసిస్టెంట్ కమిషనర్ పరీక్షల విభాగం 3 సెంటర్లను సందర్శించారని తెలిపారు. హిందీ పరీక్షకు 7,383 మంది విద్యార్థులు 7,374 హాజరవ్వగా 9 మంది గైర్హాజరయ్యారు.