NGKL: ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శివశంకర్ శనివారం కల్వకుర్తిలో ఛలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా కార్మికులు నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని, వారి హక్కులు, సంక్షేమం కోసం సమగ్ర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.