MDK: రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ పద్మావతి గోదా దేవీ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న పుష్కర బ్రహ్మోత్సవాలకు శ్రీ త్రిదండి నారాయణ చినజీయర్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శుక్రవారం నిర్వహించనున్నారు. అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు.
MDK: పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణతను సాధించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృషి చేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. పాపన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి ప్రతి విద్యార్థి సబ్జెక్టుల వారీగా అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించారు.
వరంగల్: చాక్లెట్ ఆశ చూపి ఓ చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన ఓ వృద్ధుడి (60)పై కేసు నమోదైన ఘటన జనగామ జిల్లా తరిగొప్పులలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు వృద్ధుడిపై గురువారం పోక్సో కేసు నమోదు చేశారు. కాగా వృద్ధుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.
NLG: పట్టణంలోని కేంద్రీయ విద్యాలయంలో బ్యాగ్స్ డేస్ కార్యక్రమంలో భాగంగా ఆరో తరగతి విద్యార్థులకు చిత్రలేఖనం కలలో నైపుణ్యం(క్రాఫ్ట్) కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మట్టితో వివిధ ఆకృతులు చేసి ఆకట్టుకున్నారు. పిల్లలకు చదువులతో పాటు ఇలాంటి కలలు చాలా ప్రయోజనం చేకూరుస్తాయని అధ్యాపకుడు రవికుమార్ అన్నారు.
NLG: ఉత్తమ అవార్డులు పొందిన దామరచర్ల తహశీల్దార్ జవహర్ నాయక్, మండల వైద్యాధికారి డా. అడావత్ నాగేశ్వరరావులను సేవాలాల్ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం సన్మానించారు. వారు మాట్లాడుతూ.. వృత్తిపరంగా చేసినటువంటి శ్రమను, పనితనాన్ని గుర్తించి వారికి అవార్డు రావడం గిరిజన జాతికి గర్వకారణమని అన్నారు.
PDPL: రామగుండం నగరంలో ఎక్కడా చీకటి ప్రదేశాలు లేకుండా చర్యలు చేపట్టామని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. రూ.1.30 కోట్లతో నగరంలో డార్క్ స్పాట్ లేకుండా 300 విద్యుత్ స్తంభాలు, 2 వేల లైట్లను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. గురువారం కార్పొరేషన్ ఆఫీస్లో జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. రాబోయే వేసవిలో తాగు నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టామన్నారు.
HYD: హైదరాబాద్లో ఉన్నత విద్యలో సీట్ల భర్తీకి దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి 5 ఏళ్ల రిలాక్సేషన్, 5 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని పేర్కొంది. అంధత్వం, చెవుడు, మానసిక వైకల్యం, మరుగుజ్జులు, యాసిడ్ బాధితులు, కండరాలు సరిగా పనిచేయని వారిని 5 కేటగిరీలుగా విభజించనుంది.
KNR: తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికునికి తీవ్ర గాయాలైన ఘటన చొప్పదండి మండలం గుమ్లాపూర్లో జరిగింది. గ్రామానికి చెందిన పెరుమాండ్ల శ్రీనివాస్ గీత కార్మిక వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం కల్లు తీసేందుకు తాటిచెట్టు పైకి ఎక్కిన శ్రీనివాస్ అకస్మాత్తుగా పైనుంచి జారి కింద పడడంతో స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
KNR: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ షెడ్యూల్ వెలువడినందున ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మార్చి 8వ తేదీ వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు. కలెక్టర్ ఎన్నికల నియామవళిపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రజలను ప్రభావితం చేసేలా ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు, గోడలపై రాతలు, చిత్రపటాలు తొలగించాలని హెచ్చరించారు.
NLG: వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున, నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమల్లోకి వచ్చిందని కలెక్టర్, ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని అధికారులు, నాయకులకు సూచించారు.
NLG: త్రిపురారం మండలంలోని మాటూరు గ్రామానికి చెందిన ధనావత్ వస్రాం నాయక్ భారత ద్వివాంగుల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలు నుంచి ప్రశంసలు అందుతున్న విషయం అందరికి తెలిసిందే. దానికి దానికి గర్వకారణమైన విషయాన్ని పురస్కరించుకొని మాజీ సర్పంచ్ వాంకుడోత్ లలిత పాండు నాయక్ స్వగృహంలో మిత్రులతో కలిసి పూలదండలు వేసి శాలువాతో సత్కరించి సన్మానించారు.
NRPT: నర్వ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే వాకిటిశ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కందులకు ప్రభుత్వం మద్దతు ధర రూ.7,550 చెల్లించి కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.
HYD: బాలానగర్ పీఎస్ పరిధి గాంధీనగర్ చెత్తకుండీలో గురువారం పేలుడు సంభవించింది. దీంతో చెత్త క్లీన్ చేస్తున్న మహిళకు గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై క్లూస్ సేకరిస్తున్నారు.
HYD: పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగని మల్కాజిగిరి ఎంపీ ఈటల సత్కరించారు. రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి అన్నంపెట్టే ప్రజలకు అండగా మంద కృష్ణ నిల్చడని ఎంపీ ఈటల కొనియాడారు. జాతిని పైకి తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉండటం గొప్ప విషయమన్నారు. నమ్ముకున్న జాతిని, నమ్ముకున్న ఆశయాన్ని, గమ్యాన్ని ముద్దాడే వరకు వెనకడుగు వేయని వ్యక్తి అంటూ ఈటల పేర్కొన్నారు.
MDK: కౌడిపల్లి మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామానికి చెందిన రాజశేఖర్ గౌడ్ కొల్చారం మండలంలో AEOగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఆయన మాట్లాడుతూ.. 5వ సారి జాతీయ స్థాయికి ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.