• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆటో డ్రైవర్ నుంచి ఉపసర్పంచ్‌గా

SDPT: కుటుంబ పోషణ కోసం చిన్న వయసులోనే ఆటో డ్రైవర్‌గా మారిన యువకుడు నేడు ఉపసర్పంచ్‌గా ఎన్నికై ఆదర్శంగా నిలిచారు. మిరుదొడ్డి మండలం కొండాపూర్ ఉపసర్పంచ్‌గా 23 ఏళ్ల సోమగల్ల భాస్కర్ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 10వ వార్డు నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన భాస్కర్ అనంతరం ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

December 15, 2025 / 04:44 PM IST

నిజాంపేటలో యువ నాయకులకే పట్టం

MDK:నిజాంపేట మండలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో యువ నాయకులకే ఎక్కువ స్థానాలు దక్కాయి.మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు సభ్యులుగా యువకులనే ఓటర్లు ఎన్నుకున్నారు. గ్రామాల అభివృద్ధి కోసమే యువ నాయకులకు అవకాశం ఇచ్చామని ఓటర్లు తెలిపారు.

December 15, 2025 / 04:40 PM IST

ముస్త్యాలపల్లి గ్రామంలో పరకాల MLA ప్రచారం

HNK: దామెర మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామంలో పరకాల MLA రేవూరి ప్రకాష్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తోట కల్పనా-రాజకుమార్, వార్డు మెంబర్ల గెలుపు కోసం ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికై ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.

December 15, 2025 / 04:40 PM IST

నూతన సర్పంచ్, వార్డు మెంబర్లు సన్మానించిన ఛైర్మన్

ములుగు మండలం పత్తిపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరచిన ధరావత్ సరిత-సారయ్య 806 ఓట్ల భారీ మెజారిటీతో సర్పంచ్‌గా గెలుపొందారు. అలాగే 12 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులను సోమవారం గ్రంథాలయ ఛైర్మన్ భానోత్ రవిచందర్, ములుగు పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల బిక్షపతి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు

December 15, 2025 / 04:40 PM IST

స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్

RR: స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని వెంకటపాపయ్య నగర్‌లో పరిసరాల పరిశుభ్రత మీద ప్రజలలో అవగాహన కోసం డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జీఎచ్ఎంసీ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. చెత్త రోడ్ల మీద వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగ ఉంచుకోవాలని అన్నారు.

December 15, 2025 / 04:37 PM IST

ధన్వాడలో అత్తదే పైచేయి.. బీజేపీ విజయం

NRPT: ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, ఎంపీ డీకే అరుణ స్వగ్రామమైన ధన్వాడలో అత్తాకోడళ్ల మధ్య జరిగిన సర్పంచ్ పోరులో అత్త బలపరిచిన బీజేపీ మద్దతుదారురాలు పీ.జ్యోతి విజయం సాధించారు. ఆమె కాంగ్రెస్ మద్దతుదారురాలు సి. జ్యోతి పై 617 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పీ.జ్యోతికి 3,287 ఓట్లు పోలయ్యాయి.

December 15, 2025 / 04:37 PM IST

‘సీనియర్ సిటిజనులు సద్వినియోగం చేసుకోవాలి’

PDPL: లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను సీనియర్ సిటిజన్‌లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ఆమె ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ పెద్దపల్లి ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేశామన్నారు.

December 15, 2025 / 04:34 PM IST

సెల్ ఫోన్లను తిరిగి అప్పగించిన ఎస్సై

GDWL: మల్దకల్ మండలానికి చెందిన బోయ హనుమంతు (నేతువానిపల్లి), గౌళ్ల రమేష్ (మద్దెలబండ) కొన్ని నెలల క్రితం పోగొట్టుకున్న తమ సెల్‌ఫోన్లపై మల్దకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై నందీకర్ కేసు దర్యాప్తు చేపట్టి, కానిస్టేబుల్ విజయరాజు ద్వారా సిగ్నల్‌ను ట్రేస్ చేయించి సోమవారం బాధితులకు అందజేశారు. ఫోన్లు పోయిన వెంటనే PSలో కంప్లైంట్ ఇవ్వాలని తెలిపారు. 

December 15, 2025 / 04:33 PM IST

అయ్యప్ప శోభాయాత్ర ఘనంగా నిర్వహణ

NGKL: జిల్లాలోని స్థానిక శ్రీ సీతారామస్వామి దేవస్థానం నుండి కలశం, అయ్యప్ప స్వామి విగ్రహం, తిరు ఆభరణాలతో అయ్యప్ప శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. మేళతాళాల నడుమ పట్టణ పురవీధుల్లో సాగిన ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. అనంతరం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సన్నిధానం వరకు భజనలు, కోలాటాలు, నృత్యాలతో అయ్యప్ప స్వాములు, భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

December 15, 2025 / 04:32 PM IST

మెడికల్ విద్యార్థికి బంగారు గోల్డ్ మెడల్

KNR: సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామానికి చెందిన బైరి రమణయ్య – సునీత దంపతుల రెండో కుమార్తె బైరి అనూష ఉస్మానియా యూనివర్సిటీలో ఎండీ పాతాలజీలో గోల్డ్ మెడల్ సాధించారు. ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా అనూష బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

December 15, 2025 / 04:32 PM IST

చెప్పల్‌బజార్‌లో రోడ్డు తవ్వి వదిలేశారు..!

HYD: చెప్పల్‌బజార్‌లో గత కొంతకాలంగా మంచినీటిలో పొల్యూషన్ నీటి సరఫరా జరుగుతోందని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు సమస్యను పరిష్కరించారు. కానీ, తవ్విన రోడ్డును మాత్రం అలానే వదిలేశారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను కార్పొరేటర్ కన్నె ఉమా రమేశ్ యాదవ్ ఇవాళ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

December 15, 2025 / 04:30 PM IST

ప్రగతి ధర్మారం ఉపసర్పంచ్‌గా లలిత ఏకగ్రీవం

MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామ ఉపసర్పంచ్‌గా నింగరమైన లలిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలోని 12 వార్డుల్లో లలిత నాలుగో వార్డు సభ్యురాలిగా విజయం సాధించారు. ఆదివారం రాత్రి జరిగిన ఉపసర్పంచ్ ఎన్నికల్లో 11 మంది వార్డు సభ్యులు ఆమెకు మద్దతు తెలపడంతో లలిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

December 15, 2025 / 04:29 PM IST

రేపటి నుంచి రామాలయంలో ధనుర్మాస పూజలు

NGKL: పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో కొలువుదీరిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ధనుర్మాస ప్రత్యేక పూజలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని అర్చకులు వరదరాజన్ అయ్యగారు తెలిపారు. జనవరి 14వరకు జరిగే ఈ పూజలలో ప్రతిరోజు సుప్రభాతసేవ, ఆరాధన, సామూహిక కుంకుమార్చనలు, గోదామాధకు పుష్పాభిషేకం, భక్తుల గోత్రనామాలతో అర్చనలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

December 15, 2025 / 04:28 PM IST

ఏడేళ్లలో ఇదే మొదటిసారి..!

HYD: మహానగరాన్ని చలిపులి వణికిస్తోంది. ఏడేళ్లలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి. సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో 6.3 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. ఇక మౌలాలిలో 7.3, రాజేంద్రనగర్‌లో 7.7, శివరాంపల్లిలో 8.8, గచ్చిబౌలిలో 9.1, బొల్లారంలో 9.3, మారేడ్‌పల్లిలో 10.1, కుత్బుల్లాపూర్‌‌లో 10.2, జీడిమెట్లలో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

December 15, 2025 / 04:27 PM IST

కార్మికుల హక్కులను కాల రాస్తున్నాయి: CITU

MNCL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాయిస్తున్నాయని CITU జన్నారం మండల కార్యదర్శి అంబటి లక్ష్మణ్ విమర్శించారు. సీఐటిీయూ మహాసభల సందర్భంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పలు కాలనీలు, నాయకుల ఇళ్లపై సీఐటిీయూ జెండాలను ఎగురవేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నామని ఆయన తెలిపారు.

December 15, 2025 / 04:27 PM IST