SDPT: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎంతగానో కష్టపడాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో చిన్నకోడూర్ మం. చౌడారం గ్రామానికి చెందిన రవి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. గతేడాది వెలువడిన పోలీస్ ఉద్యోగ ఫలితాల్లో పోలీస్ కానిస్టేబుల్, గ్రూపు-4(వార్డు ఆఫీసర్)గా, ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఆర్అండ్ బీ ఏఈగా ఎంపికయ్యాడు.
HYD: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రేపు హైదరాబాద్లో మాంసం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గొర్రె, మేకల మండీలను, దుకాణాలను మూసివేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీ, తెలంగాణలోనూ ఇదే తరహా ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
KMR: బాన్సువాడ పట్టణంలో గల సీపీఎస్ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘం సభ్యత్వంను కామారెడ్డి జిల్లా అసోసియేట్ అధ్యక్షులు అయ్యాల సంతోష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్జీటీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సంఘం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ యందు ఓటు హక్కు కల్పించాలని అన్నారు.
కామారెడ్డి పట్టణంలో ఆర్కే డిగ్రీ కళాశాలలో ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ భద్రత అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాలల అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు, కామారెడ్డి పట్టణ సీఐ, దేవునిపల్లి ఎస్సై, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు భద్రత నియమాలకు సంబంధించి పలు సూచనలు, ఏఎస్పీ సూచించారు.
HYD: నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బెగ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో కలిసి కళాశాల భవనాలను పరిశీలించారు. కళాశాలలో మౌలిక వసతులపై అరా తీశారు. విద్యార్థుల హాజరు శాతంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
HYD: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బోయిన్పల్లి మార్కెట్ వైస్ ఛైర్మన్ DB దేవేందర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనను మార్కెట్ వైస్ ఛైర్మన్గా నియమించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను సన్మానించి, మిఠాయి తినిపించారు.
HYD: యాకుత్పురా వ్యాప్తంగా చెత్త సేకరణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు MLA జాఫర్ హుస్సేన్ మిరాజ్ తెలిపారు. బుధవారం రెయిన్బజార్ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య సిబ్బందికి 35 చెత్త సేకరణ రిక్షాలను అందజేశారు. ఇవి చెత్త సేకరించినందుకు ఎంతగానో తోడ్పడతాయని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే మరో 15 రిక్షాలను అందజేయనున్నట్లు తెలిపారు. GHMC సహకారంతో ఇవి అందజేశామన్నారు.
JGL: మెట్పల్లి మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బీ.సత్య ప్రసాద్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మెట్పల్లి మినీ స్టేడియం, డంపింగ్ యార్డ్, స్మశాన వాటికలను సందర్శించారు. మినీ స్టేడియంలో నిలిచిపోయిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్లో బయో మైనింగ్ త్వరగా ప్రారంభించమని ఆదేశించారు.
కామారెడ్డి: బీసీ రాజ్యాధికార సమితి జుక్కల్ నియోజకవర్గ ఇంఛార్జ్ల నియామకాన్ని పిట్లం మండల కేంద్రంలో బుధవారం చేపట్టారు. జిల్లా ఇంఛార్జ్ అధ్యక్షుడు కుమ్మరి యాదగిరి ఆధ్వర్యంలో జుక్కల్ కో–ఇంఛార్జ్లుగా మేకల లక్ష్మణ్ యాదవ్, పిట్లం మండలానికి చెందిన ఎర్ర రమేశ్లను నియమించారు. వారికి నియామకపత్రాలను అందజేశారు.
మేడ్చల్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు(బుధవారం) ఇద్దరు ఉరి వేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు.. వివేకానందనగర్లో కృష్ణ చైతన్య రెడ్డి(34), మహంకాళినగర్ శంషీగూడలో నవీన్(18) అనే ఇద్దరు మృతి చెందారు. వివిధ కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
BHPL: జాతీయ రహదారి 353(సీ)పై మహాదేవపూర్ అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. కాటారం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు, అతడి బంధువైన మరో వ్యక్తితో కలిసి సూరారం వెళ్లి వస్తుండగా బైక్ అదుపుతప్పి మైలురాయికి తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
RR: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైన్స్/అప్లికేషన్ విభాగంలో అధ్యాపక నియామకం కోసం ఒక పోస్ట్ ఉన్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.రాధిక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు పీజీ సబ్జెక్టులు 55 శాతం మార్కులు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు కళాశాల కార్యాలయం సంప్రదించాలన్నారు.
మేడ్చల్: మాధవి హత్య కేసులో నిందితుడైన గురుమూర్తిని 14 రోజుల రిమాండ్ విధించారు. బుధవారం వనస్థలిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులు గురుమూర్తిని కోర్టుకు తరలించారు. భార్య మాధవిని చంపిన కేసులో నిందితుడు గురుమూర్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు ఫిబ్రవరి 11 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.
MNCL: జన్నారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 పథకాలలో భాగంగా మండలంలోని పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. ఆ ఇండ్ల నిర్మాణంపై అవగాహన కల్పించేందుకు మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని చేపట్టామని హౌసింగ్ ఏఈ రియాస ఆలీ తెలిపారు.
ADB: విద్యతోనే సమాజంలో అందరికీ గుర్తింపు లభిస్తుందని ఆదిలాబాద్ ఎంపీ జీ.నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. బుధవారం ఉట్నూరు మండల కేంద్రంలోని ఆశ్రమ బాలుర పాఠశాలలో, లాల్ టేక్డిలోని గిరిజన సంక్షేమ కళాశాలతో పాటు యేందా గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో నూతన తరగతి గదుల నిర్మాణానికి ఎంపీ నగేష్తో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.