MNCL: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని జీసీసీ రాష్ట్ర చైర్మన్ కొట్నాక తిరుపతి, మంచిర్యాల ఆర్టిఏ మెంబర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వారు భూమి పూజ చేశారు. గ్రామంలో 189 ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమెల రాజు పాల్గొన్నారు.
MLG: వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. చేసిన అప్పులు తీర్చలేక మొక్కజొన్న రైతు పురుగుమందు తాగి లేక మధు కృష్ణ (31) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బాండు అనే కంపెనీ మొక్కజొన్న వేసి తీవ్రంగా నష్టపోవడంతో అదికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎవరు పట్టించుకోక పోవడంతో మనస్థాపం చెంది రైతు ఆత్మహత్య చేసుకున్నట్టుగా గ్రామస్తులు తెలిపారు.
KNR: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ఛైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ నూతన CP గౌస్ ఆలంను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో శాంతి భద్రతలు, ప్రధాన వీధుల్లో CC కెమెరాల పర్యవేక్షణ, శివారు ప్రాంతాల్లో ప్రజల సమస్యల గురించి చర్చించారు.
NGKL: ట్రాన్స్పోర్ట్, హమాలి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్నారనే సమాచారం అందుకున్నారు. దీంతో బల్మూర్ మండల కేంద్రంలో స్థానిక సీపీఎం నాయకులను శుక్రవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా అంటూ వారు ప్రశ్నించారు.
MDK: శుక్రవారం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా..తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం అయినప్పటికీ..పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
MDK: మంత్రాలు, చేతబడి అనేది లేదని, ఎవరైనా మంత్రాలు చేస్తామంటూ గ్రామాల్లోకి వస్తే సమాచారం ఇవ్వాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజలకు సూచించారు. మెదక్ ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈమధ్య మంత్రాల నెపంతో ప్రజలను మోసం చేస్తున్నారని, దొంగ బాబాలను నమ్మొద్దని సూచించారు. అనారోగ్య సమస్యలు ఉంటే ఆస్పత్రిలో పరీక్షలు చేసుకోవాలని సూచించారు.
SDPT : హుస్నాబాద్ పశువుల అంగడి వేలం శుక్రవారం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తాటి మల్లికార్జున్ గౌడ్ తెలిపారు. జిల్లా అధికారుల అనుమతి మేరకు మున్సిపల్ కార్యాలయంలో రెండో సారి అంగడి వేలం నిర్వహిస్తున్నామన్నారు. అంగడివేలం కోసం డిపాజిట్లు చెల్లించిన వారు వేలం పాటకు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు.
NZB: తెలంగాణ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ జిల్లా నూతన డైరీ, క్యాలెండర్ను గురువారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ,అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నూడా ఛైర్మన్ కేశ వేణు, టీజీవో అధ్యక్షుడు అలుక కిషన్, ఉమకంత్ తదితరులు పాల్గొన్నారు.
KMR: వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కోటగిరి మండల కేంద్రంలో అభయహస్తం సొసైటీ సహకారంతో బర్ల గంగారం, బర్ల మధు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
JN: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగంలో విశేష సేవలందించిన కళాకారులకు కొండ లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డు అందజేస్తోంది. జనగామ జిల్లాలోని అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డ్ గ్రహీతలకు రూ.25 వేలు నగదు, చేనేత శాలువా, మెమెంటో సర్టిఫికెట్ ఇవ్వనున్నారు.
KMR: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. క్యాంప్ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు.
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన కంపేల మానస అనే మహిళ అదృశ్యం అయినట్లు ఎస్ఐ ప్రసాద్ గురువారం ప్రకటనలో తెలిపారు. బుధవారం మధ్యాహ్న సమయంలో బ్యాంకు పనిమీద బయటికి వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి రాలేదన్నారు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో మానస తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
HNK: కాజీపేట మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో నేడు శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలను భక్తులు విడుదల చేశారు. ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో భక్తులు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
WGL: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ ఛైర్మన్ శామంతుల శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. గురువారం జిల్లా బార్ అసోసియేషన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారితో పాటు బార్ ప్రతినిధులు, లీగల్ సెల్ నాయకులు పాల్గొని మిఠాయిలను పంచి సంబరాలు చేశారు.
ఆదిలాబాద్: జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం తెలిపారు. పరీక్ష సమయంలో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ దుకాణాలను మూసి వేసి ఉంచాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు.