• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కాజిపల్లి బొల్లారం రహదారిలో సీసీ రోడ్డు

SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో కాజి పల్లి – బొల్లారం డివిజన్ రహదారి సీసీ పనులు పూర్తయ్యాయి. గతంలో కంకర, గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు సీసీ రోడ్డు నిర్మాణంతో ప్రయాణం సుఖంగా, సౌకర్యవంతంగా మారింది. రాకపోకలు సులభమవడంతో స్థానిక వాహనదారులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 22, 2026 / 07:55 AM IST

నగరంలో బహిరంగంగా సిగరెట్ల విక్రయాలు

WGL: నగరంలో నిషేధిత సిగరెట్ల విక్రయాలు రోజురోజుకు పెరుగుతున్నాయని స్థానికులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండ, కేయూ, NIT, పోచమ్మ మైదానం ప్రాంతాల్లో ఈ అమ్మకాలు బహిరంగంగానే సాగుతున్నాయని తెలిపారు. కాలేజ్ పరిసర ప్రాంతాల్లో ఈ దందా కొనసాగుతుందని పట్టణవాసులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి సిగరెట్ల దందా అరికట్టాలని కోరారు.

March 22, 2026 / 07:45 AM IST

గుంతల మయంగా కాజీ పల్లి రోడ్డు

SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో కాజీ పల్లి–కొర్లకుంట రహదారి గుంతలతో దెబ్బతింది. చిన్న వర్షానికే నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాల భయం నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తులు, వాహనదారులు కోరుతున్నారు.

March 22, 2026 / 07:42 AM IST

‘దత్తత తీసుకునే వారు దళారులను నమ్మి మోసపోవద్దు’

MNCL: పిల్లలను దత్తత తీసుకునే వారు దళారులను నమ్మి మోసపోవద్దని మంచిర్యాల జిల్లా శిశు సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లలు లేని వారు పిల్లలను చట్టబద్దంగా దత్తత తీసుకోవాలన్నారు. CARA కింద దత్తత ఏజెన్సీ కేంద్రాలు పనిచేస్తాయని, దరఖాస్తు చేసుకుంటే చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

March 22, 2026 / 07:33 AM IST

టీజీ సెట్‌లో జిల్లా వాసి ప్రతిభ

JGL: ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(TG-SET 2025) ఫలితాల్లో జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన జ్యోతి ప్రతిభ చాటారు. తెలుగు సబ్జెక్టులో 154 మార్కులతో ఆమె అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 29 సబ్జెక్టులకు నిర్వహించిన పరీక్షలో మొత్తం 2,565 మంది క్వాలిఫై అవ్వగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించిన జ్యోతిని పలువురు అభినందించారు.

March 22, 2026 / 07:32 AM IST

రంజాన్ మాసం చివరి రోజు.. విక్రయాల జోరు..!

MDCL: ఉప్పల్, నాచారం ప్రాంతాల్లో హలీం విక్రయాలు నిన్న జోరుగా కొనసాగాయి. రంజాన్ మాసం చివరి రోజు కావడంతో హలీం కోసం ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రముఖ హోటళ్లు, స్టాళ్ల వద్ద కస్టమర్లు పెద్ద ఎత్తున క్యూలైన్లలో నిలబడి తమ వంతు కోసం ఎదురుచూశారు. ప్రత్యేక రుచితో ప్రసిద్ధి చెందిన హలీం కోసం యువతతో పాటు కుటుంబాలు కూడా ఆసక్తి చూపారు.

March 22, 2026 / 07:30 AM IST

‘అభివృద్ధి పనుల నిధుల మంజూరుకు నివేదిక’

KNR: శంకరపట్నం (M) అంబాల్పూర్‌లో గ్రామంలో సీసీ రోడ్లు, పంచాయతీ భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయాలని గ్రామస్థులు మంత్రి శ్రీధర్ బాబుకు వినతిపత్రం అందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం గ్రామంలో డీఆర్డీవో శ్రీధర్ పలు వీధుల్లో రోడ్ల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించిన నివేదికను కలెక్టర్‌కు అందించనున్నట్లు డీఆర్డీఓ తెలిపారు.

March 22, 2026 / 07:21 AM IST

జిల్లాలో నేడు చికెన్ ధర ఎంతంటే ?

KMR: జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఆదివారం మాంసం ధరలు పెరిగాయి. కిలో స్కిన్ లెస్ చికెన్ రూ. 340 నుంచి రూ.350 వరకు విక్రయిస్తుండగా, లైవ్ కోడి ధర కిలో రూ. 220కు విక్రయిస్తున్నారు. ఇక మటన్ ధర కిలో రూ.800 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు స్వల్పంగా పెరగడంతో సామాన్యులపై భారం పడుతోంది.

March 22, 2026 / 07:19 AM IST

జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పోలీస్ తనిఖీలు

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శనివారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు బ్యాంకులు, ఏటీఎంలు, ప్రధాన కూడళ్ల వద్ద పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. ఇసుక, గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా వాహన సోదాలు నిర్వహించారు.

March 22, 2026 / 07:16 AM IST

భక్తులకు వడ్డన చేసిన MLA అనిల్ జాదవ్

ADB: మహారాష్ట్రలోని పౌర దేవి యాత్రకు బయలుదేరిన భక్తుల పాదయాత్ర శనివారం రాత్రి ఆదిలాబాద్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా భక్తులకు స్థానిక ఫంక్షన్ హాల్‌లో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న MLA అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న భక్తులకు స్వయంగా అన్నాన్ని వడ్డించారు. క్షేమంగా పౌర దేవి అమ్మవారిని దర్శించుకోవాలని ఆకాంక్షించారు.

March 22, 2026 / 07:12 AM IST

తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

NLG: తాటి చెట్టు పైనుండి జారిపడి గీత కార్మికుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డ సంఘటన దేవ‌ర‌కొండ మండలం ముదిగొండ గ్రామంలో శ‌నివారం జ‌రిగింది. గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం.. ముదిగొండ గ్రామానికి చెందిన యాదయ్య ప్రతిరోజు తాటి చెట్లు ఎక్కి కల్లు గీస్తుండగా అకస్మాత్తుగా చెట్టు పైనుంచి ఒక్కసారిగా కింద‌ప‌డ్డాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు.

March 22, 2026 / 07:12 AM IST

‘లేబర్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలి’

PDPL: పెద్దపల్లి లేబర్ ఆఫీసర్ హేమలతపై చర్యలు తీసుకోవాలని దళిత, బహుజన లేబర్ అసోసియేషన్ ప్రతినిధులు చెన్నూర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి వివేక్ వెంకట స్వామికి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయాన్ని అడ్డుకుంటూ, కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు మంత్రిని కోరారు.

March 22, 2026 / 07:11 AM IST

బ్రెయిన్ స్ట్రోక్‌తో యువకుడు మృతి

MDK: రామాయంపేట మండలం అక్కన్నపేటలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామ్ రెడ్డి అనే (40) సంవత్సరాల యువకుడు నిజామాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఉగాది పండగకు ఇంటికి వచ్చి వెళ్లిన రామ్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో శుక్రవారం రాత్రి ఇంట్లో మృతి చెందారు. శనివారం సాయంత్రం రామ్ రెడ్డి మృతిని గమనించారు.

March 22, 2026 / 07:09 AM IST

గ్రీన్ హోమ్స్ కాలనీలో సైబర్ అవగాహన కార్యక్రమం

RR: నాదర్‌గుల్‌లోని గ్రీన్ హోమ్స్ కాలనీలో సైబర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా, తాజా డిజిటల్ అరెస్టుల వాటిపై వివరించారు. మోసపూరిత కాల్స్, ఓటీపీలు/పాస్‌వర్డ్‌ను పంచుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. తెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు పాస్‌వర్డ్‌ ఇవ్వకూడదని సూచించారు.

March 22, 2026 / 07:09 AM IST

రేపటి ప్రజావాణి రద్దు

SDPT: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ కె. హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. 2027 జనాభా లెక్కల సేకరణపై జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సోమవారం ఎవరూ కలెక్టరేట్‌కు రావద్దని ఆమె కోరారు.

March 22, 2026 / 07:08 AM IST