NGKL: పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన ఓ వివాహిత మహిళను ఓ యువకుడు ఫోన్ లో వేధించడంతో ఆ మహిళ ఇవాళ షీ టీం పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు నాగర్ కర్నూల్ జిల్లా షీ టీం అధికారిని విజయలక్ష్మి తెలిపారు. వేధింపులకు పాల్పడిన యువకుడిపై చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు.