E.G: నిడదవోలు నియోజకవర్గంలో ఉపాధి హామీ కూలీల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని CPM తూ.గో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సింగవరంలో ఉపాధి కూలీలను ఆయన కలిసి సమస్యలు తెలుసుకున్నారు. గత 3 నెలలు పనిచేసిన వేతనాలు ఇవ్వటం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించాలన్నారు.