KNR: జమ్మికుంట స్థానిక వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం యార్డుకు రైతులు 73 క్వింటాళ్ల విడిపత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,170, కనిష్ఠంగా రూ.6,900 పలికింది. గోనె సంచుల్లో 8 క్వింటాలు తీసుకురాగా.. రూ.5,300 నుంచి రూ.6,400 వరకు పలికింది. తాజాగా పత్తి ధర నిన్నటి కంటే ₹20 పెరిగింది. పత్తి కనీస ధరను పెంచాలని రైతులు కోరుతున్నారు.