KNR: జిల్లా చిగురుమామిడి (M) ఇందుర్తికి చెందిన మల్లవ్వ అనే వృద్ధురాలి మృతదేహం తిమ్మాపూర్ ఎల్ఎండీ జలాశయం వద్ద లభించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలించగా సమీపంలో ఒక సంచిలో ఇందుర్తి గ్రామంగా గుర్తింపు కార్డు ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.